Political News

ఉప ఎన్నిక‌ల్లో మోడీకి తొలి దెబ్బ‌.

దేశంలో ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ నేతృత్వంలోని ఎన్డీయే కూట‌మికి తొలి దెబ్బ భారీగా త‌గులుతోంది. అధికారం చేప‌ట్టిన నెల రోజుల్లో వ‌చ్చిన ఉప ఎన్నిక‌ల్లో ఎన్డీయే కూట‌మి ప‌క్షాలు, ముఖ్యంగా బీజేపీ ఉప పోరులో వెనుక‌బ‌డి పోగా.. ఇండియా కూట‌మి దూకుడు ప్ర‌ద‌ర్శించింది. మొత్తం 13 స్థానాల‌కు ఉప ఎన్నిక జ‌ర‌గ్గా.. శ‌నివారం ఓట్ల లెక్కింపు ప్ర‌క్రియ చేప‌ట్టారు. 13 స్థానాల్లో 11 చోట్ల కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియా కూట‌మి విజ‌యం దిశ‌గా దూసుకుపోతోంది.

దేశవ్యాప్తంగా 7 రాష్ట్రాల్లోని 13 అసెంబ్లీ స్థానాలకు జరిగిన ఉప ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్ర‌క్రియ కొన‌సాగుతోంది. 11 చోట్ల ఇండియా కూటమి అభ్యర్థులు ముందంజ‌లో ఉన్నారు. మిగతా రెండుచోట్ల ఎన్డీయే అభ్యర్థులు ఆధిక్యంలో కొన‌సాగుతున్నారు. పశ్చిమ బెంగాల్‌లోని 4, హిమాచల్‌ ప్రదేశ్‌లోని మూడు, ఉత్తరాఖండ్‌లోని రెండు, పంజాబ్, బిహార్‌, తమిళనాడు, మధ్యప్రదేశ్‌లోని ఒక్కొక్క‌ స్థానానికి ఈ నెల 10న ఉప ఎన్నిక పోలింగ్‌ జరిగింది.

ఆప్‌కు ఊపిరి: పంజాబ్‌లోని జలంధర్‌ స్థానంలో ఆమ్‌ ఆద్మీ పార్టీ అభ్యర్థి మోహిందర్‌ భగత్‌ విజయం సాధించారు. తన సమీప బీజేపీ అభ్యర్థి షీతల్‌పై 37వేల ఓట్ల మెజారిటీతో గెలుపొందారు.

మ‌మ‌త త‌గ్గ‌లేదు: పశ్చిమబెంగాల్‌లోని మానిక్‌తలా, బాగ్దా, రాణాఘాట్‌ దక్షిణ్‌, రాయ్‌గంజ్‌.. మొత్తం నాలుగు స్థానంలో సీఎం మ‌మ‌తా బెన‌ర్జీ నేతృత్వంలోని తృణ‌మూల్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు ఆధిక్యంలో కొనసాగుతున్నారు.

కాంగ్రెస్ దూకుడు: హిమాచల్‌ ప్రదేశ్‌లోని దేహ్రా అసెంబ్లీ స్థానానికి జ‌రిగిన ఉప ఎన్నిక‌లో రాష్ట్ర ముఖ్యమంత్రి సుఖ్వీందర్‌ సింగ్‌ సుఖు సతీమణి, కాంగ్రెస్‌ అభ్యర్థి కమలేశ్‌ ఠాకుర్‌ ముందంజలో ఉన్నారు. నాలాగఢ్‌ స్థానంలో కాంగ్రెస్‌ అభ్యర్థి ఆధిక్యంలో కొనసాగుతుండగా..ఉత్తరాఖండ్‌లోని బద్రీనాథ్‌, మంగలౌర్‌.. రెండు స్థానాల్లోనూ కాంగ్రెస్‌ అభ్యర్థులు ఆధిక్యంలో కొనసాగుతున్నారు. అదేవిధంగా మధ్యప్రదేశ్‌లోని అమర్‌వాడా స్థానంలో కాంగ్రెస్‌ అభ్యర్థి ధీరన్‌ షా ముందంజలో ఉన్నారు.

కూట‌మి రెండు స్థానాల్లో: బిహార్‌లోని రూపౌలి స్థానంలో జేడీయూ అభ్యర్థి ఆధిక్యంలో కొనసాగుతున్నారు. అదేవిధంగా హమీర్‌పుర్‌లో బీజేపీ నేత ముందంజలో ఉన్నారు. ఇక‌, తమిళనాడులోని విక్రావండిలో ఇండియా కూట‌మిలోని త‌మిళ‌నాడు అధికార పార్టీ డీఎంకే నేత అన్నియుర్‌ శివ ముందంజలో ఉన్నారు. మొత్తంగా ఈ ప‌రిణామం.. మోడీ నేతృత్వంలోని ఎన్డీయేకి ఇబ్బందిగా మార‌నుంద‌ని ప‌రిశీల‌కులు అంచ‌నా వేస్తున్నారు.

This post was last modified on July 13, 2024 4:19 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

ప్రభాస్ వల్ల థియేటర్లకు కళొచ్చింది

మరీ డెడ్ డ్రైగా మారిపోయిన తెలుగు రాష్ట్రాల థియేటర్లు పెద్ద సినిమాలు లేక అల్లాడిపోతున్నాయి. రెండు మూడు రోజులు ప్రమోషన్లతో…

24 minutes ago

80% రాజ‌కీయ నేత‌లు సెక్స్ వీడియోలు చూస్తారా?,

``రాజ‌కీయ నేత‌లు.. ప్ర‌జ‌ల కోసం ప‌నిచేసేది త‌క్కువ‌.. సెక్స్ వీడియోలు చూసేది ఎక్కువ‌. కావాలంటే.. నా ఫోన్ స‌హా.. రాష్ట్రంలోని…

1 hour ago

ర‌వితేజ‌ను త‌ప్పించ‌డానికి ఒప్పుకోని పూరి

బద్రి లాంటి సూప‌ర్ హిట్ మూవీతో ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌యం అయ్యాడు పూరి జ‌గ‌న్నాథ్. అరంగేట్రంలోనే అలాంటి హిట్ ప‌డిందంటే ఇక…

3 hours ago

స‌జ్జ‌నార్‌కు ప్ర‌మోష‌న్‌… ఎందుకంత స్పెషల్?

తెలంగాణ ప్ర‌భుత్వం ఆరుగురు సీనియ‌ర్ ఐపీఎస్ అధికారుల‌కు డైరెక్ట‌ర్ జ‌న‌ర‌ల్స్‌(డీజీ)గా ప‌దోన్న‌తి క‌ల్పించింది. వీరిలో మ‌హేశ్ భ‌గ‌వ‌త్‌, స్వాతి ల‌క్రా,…

5 hours ago

మైఖేల్ జాక్సన్ మీద ఇంత ప్రేమ ఉందా

ఈ వారం విడుదల కాబోతున్న అన్ని భాషల సినిమాల్లో అత్యధిక బుకింగ్స్ జరుపుకున్నది హాలీవుడ్ మూవీ మైఖేల్ ఒక్కటే. ఇప్పటిదాకా…

8 hours ago

శ్రీలీల డెబ్యూకి మోక్షం ఎప్పుడో

అదేంటి ఇప్పటికే బోలెడు సినిమాల్లో చూసేశాం కదా కొత్తగా మళ్ళీ డెబ్యూ ఏంటనుకుంటున్నారా. మ్యాటర్ వేరే ఉంది. శ్రీలీల బాలీవుడ్…

11 hours ago