ఎటు చూసినా బీఆర్ఎస్కు సమస్యలే కనిపిస్తున్నాయి. సవాళ్ల సుడిగుండంలో ఆ పార్టీ చిక్కుకుంది. ఇటు రాష్ట్రంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను కాంగ్రెస్లో చేర్చుకుంటున్నారు. బీఆర్ఎస్ శాసనసభ పక్షాన్ని కాంగ్రెస్లో విలీనం చేసుకోవడమే లక్ష్యంగా రేవంత్ సాగుతున్నారు.
ఇక అటు ఢిల్లీలో ఏమో బీఆర్ఎస్ను దెబ్బకొట్టేందుకు బీజేపీ సిద్ధమైందని తెలిసింది. బీఆర్ఎస్ రాజ్యసభ ఎంపీలను పార్టీలో చేర్చుకునేందుకు కసరత్తు మొదలెట్టిందని టాక్. బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ బీజేపీలో విలీనం అవడం ఖాయమనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
సార్వత్రిక ఎన్నికల్లో బీఆర్ఎస్ ఒక్క లోక్సభ స్థానంలోనూ గెలవకపోవడంతో ఆ పార్టీకి గుడ్బై చెప్పాలని రాజ్యసభ ఎంపీలు భావిస్తున్నట్లు తెలిసింది. బీఆర్ఎస్కు భవిష్యత్ లేదని ఈ ఎంపీలు బీజేపీతో టచ్లోకి వెళ్తున్నట్లు సమాచారం. ప్రస్తుతం లోక్సభలో బీఆర్ఎస్కు ప్రాతినిథ్యం లేదు. రాజ్యసభలో పార్థసారథి రెడ్డి, దామోదర్ రావు, సురేశ్ రెడ్డి, వద్ధిరాజు రవిచంద్ర బీఆర్ఎస్ ఎంపీలుగా ఉన్నారు.
ఈ నలుగురు బీఆర్ఎస్ రాజ్యసభ ఎంపీలను పార్టీలో చేర్చుకునేందుకు బీజేపీ సిద్ధంగా ఉందని తెలిసింది. అదే జరిగితే బీజేపీలో బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ విలీనం తప్పదు. మరోవైపు ఈ ఎంపీలతో కాంగ్రెస్ కూడా టచ్లోకి వచ్చిందనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. దీంతో ఇటు రాష్ట్రంలో, అటు కేంద్రంలో బీఆర్ఎస్కు గట్టి షాక్ తప్పదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
This post was last modified on July 13, 2024 4:21 pm
తెలంగాణ ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ పార్టీని ప్రక్షాళన చేసే దిశగా అడుగులు పడుతున్నాయి. పార్టీలో సంస్థాగతంగా పనిచేస్తున్న వారిని గత…
2029 పార్లమెంటు ఎన్నికల నాటికి దేశంలో నియోజకవర్గాలను పునర్విభజించాలని కేంద్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకున్న విషయం తెలిసిందే. ఇటు అసెంబ్లీ,…
అమెరికా - ఇరాన్ దేశాల మధ్య నెలకొన్న చర్చల ప్రతిష్టంభన ప్రపంచ దేశాలను పెను సంక్షోభంలోకి నెట్టే దిశగా మారుతోందా?…
భారత రాష్ట్రపతి ద్రౌపదిముర్ముతో ఏపీ మంత్రి, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ భేటీ అయ్యారు. పార్టీకి చెందిన…
ఏపీ రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ పదవి ఖాళీ అయింది. గత నెల 31వ తేదీ వరకు ఉన్న రాష్ట్ర…
తెలంగాణలో కీలకమైన హోం శాఖను సీఎం రేవంత్ రెడ్డి తన దగ్గర పెట్టుకున్నారు. శాంతిభద్రతలను ఆయనే పర్యవేక్షిస్తున్నారు. అయితే తరచుగా…