ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో దారుణ పరాభవం ఎదుర్కొన్న వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి ఇబ్బందులు తప్పడం లేదు. ఓ వైపు కేసుల మీద కేసులు నమోదవుతున్నాయి. అరెస్టుల భయం వెంటాడుతోంది.
మరోవైపు పార్టీని వీడే నాయకుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. తాజాగా మాజీ ఎమ్మెల్యే కరణం బలరాం కూడా వైసీపీకి గుడ్బై చెప్పాలని అనుకుంటున్నారని తెలిసింది. ఆయన త్వరలోనే వైసీపీకి రాజీనామా చేయబోతున్నారని సమాచారం.
వైసీపీ ఓటమి తర్వాత మాజీ మంత్రి రావెల కిశోర్బాబు పార్టీని వీడారు. విజయవాడ మాజీ ఎంపీ కేశినేని నాని రాజకీయాల నుంచే పూర్తిగా తప్పుకున్నారు. నటుడు అలీ సైతం పొలిటికల్ కెరీర్ వద్దనుకున్నారు. ఇప్పుడు కరణం బలరాం కూడా జగన్కు బైబై అంటున్నారు. 2019 అసెంబ్లీ ఎన్నికల్లో బలరాం టీడీపీ తరపున చీరాల నుంచి విజయం సాధించారు. కానీ ఆ తర్వాత వైసీపీలోకి వెళ్లిపోయారు.
ఈ ఏడాది జరిగిన ఎన్నికల్లో చీరాల నుంచి కరణం బలరాం తనయుడు కరణం వెంకటేశ్ వైసీపీ నుంచి పోటీ చేసి ఓడిపోయారు. దీంతో బలరాం రాజకీయ భవిష్యత్పై నీలినీడలు కమ్ముకున్నాయి. అందుకే వైసీపీలో ఉంటే లాభం లేదని ఆయన పార్టీకి గుడ్బై చెప్పాలని నిర్ణయిం తీసుకున్నట్లు తెలిసింది.
తిరిగి టీడీపీలోకి వెళ్లేందుకు ప్రయత్నిస్తున్నారని సమాచారం. కానీ పార్టీ ఓడిపోయిందని టీడీపీని వదలి వెళ్లిన బలరాంను బాబు తిరిగి చేర్చుకుంటారా? అన్నది ప్రశ్నగా మారింది. మరి ఏం జరుగుతుందో చూడాలి.
This post was last modified on July 13, 2024 4:24 pm
బాలీవుడ్ ప్రముఖుల కామెంట్లు ఒక్కోసారి భలే విచిత్రంగా ఉంటాయి. బిగ్ బి అమితాబ్ బచ్చన్ సతీమణి, ఒకప్పటి మాజీ హీరోయిన్…
మామూలుగా ఒక సినిమా వాయిదాల మీద వాయిదాలు పడి ఆలస్యంగా రిలీజైతే కొంచెం బజ్ తగ్గుతూ ఉంటుంది. కానీ ‘రాబిన్…
అతడు.. తెలుగు ప్రేక్షకులు అత్యంత మెచ్చిన చిత్రాల్లో ఇది ముందు వరసలోఉంటుందనడంలో సందేహం లేదు. మహేష్ బాబు హీరోగా త్రివిక్రమ్…
చట్టసభల్లో ప్రజా ప్రతినిధుల వ్యవహార తీరుకు సంబంధించి చట్టాల్లోని నియమ నిబంధనలు పెద్దగా పనిచేయడం లేదు. చట్టాలను పక్కనపెట్టేస్తున్న కొందరు…
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఏపీ ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్ బుధవారం బస్సు డ్రైవర్ గా అవతారం…
బాహుబలి తర్వాత సీక్వెల్ ట్రెండ్ అనేది ఎంత పాపులరయ్యిందో చూస్తున్నాం. కెజిఎఫ్, పుష్ప లాంటి బ్లాక్ బస్టర్లు దానికి మరింత…