హైదరాబాద్ తెలంగాణకు గుండెలాంటిది. వ్యాపార, వాణిజ్య, రాజకీయ, పారిశ్రామిక ఇలా ఏ రంగం తీసుకున్నా రాష్ట్రానికి హైదరాబాద్ ఎంతో కీలకమైంది. పొలిటికల్ పరంగానూ హైదరాబాద్కు ఎనలేని ప్రాధాన్యత ఉంది.
కానీ గత తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో గ్రేటర్ హైదరాబాద్లో కాంగ్రెస్ ఒక్కటి కూడా గెలుచుకోలేకపోయింది. కానీ ఇప్పుడు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను పార్టీలో చేర్చుకుంటూ హైదరాబాద్పై పట్టుకు సీఎం రేవంత్ ప్రయత్నిస్తున్నారనే టాక్ వినిపిస్తోంది.
ఏ గ్రేటర్ హైదరాబాద్లో అయితే కాంగ్రెస్ ఒక్క సీటు కూడా గెలవలేకపోయిందో అదే చోట గులాలీ ఎమ్మెల్యేలందరినీ పార్టీలో చేర్చుకునేలా రేవంత్ కసరత్తు చేస్తున్నారని తెలిసింది. మేడ్చల్, రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాల్లో కలిపి 26 అసెంబ్లీ స్థానాలున్నాయి. ఇందులో ఇబ్రహీంపట్నంలో మాత్రమే కాంగ్రెస్ గెలిచింది.
ఇటీవల సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఉప ఎన్నికల్లో విజయం సాధించింది. ఇక ఖైరతాబాద్, రాజేంద్రనగర్, శేర్లింగంపల్లి, చేవెళ్లలో బీఆర్ఎస్ నుంచి నెగ్గిన ఎమ్మెల్యేలు ఇప్పుడు కాంగ్రెస్లోకి వచ్చేశారు.
ఇప్పుడు మరికొంతమంది గ్రేటర్లోని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కూడా కాంగ్రెస్లో చేరే అవకాశముంది. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ కీలక నాయకుడు, మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కూడా కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోబోతున్నారనే టాక్ వినిపిస్తోంది. సనత్నగర్ నుంచి గెలిచిన తలసాని గత కొంతకాలంగా సైలెంట్గా ఉంటున్నారు.
ప్రభుత్వంపై, కాంగ్రెస్ పార్టీపై ఎలాంటి విమర్శలు చేయడం లేదు. దీంతో తలసానిని కూడా రేవంత్ ఒప్పించారనే ప్రచారం సాగుతోంది. తలసాని లాంటి నాయకుడు వస్తే ఆయనతో పాటు మరో అయిదారుగురు కూడా కాంగ్రెస్లో చేరుతారన్నది రేవంత్ ప్లాన్గా తెలుస్తోంది.
This post was last modified on July 13, 2024 3:22 pm
సెలబ్రిటీలు చిన్న వాళ్ళైనా పెద్దోళ్ళయినా ఏదైనా మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితి ఉందిప్పుడు. సోషల్ మీడియా జమానాలో చిన్న టంగ్…
అభిమానుల్లోనే కాదు సినీ ప్రియుల్లోనూ విపరీతమైన అంచనాలు మోస్తున్న సినిమా పెద్ది. చికిరి చికిరి ఛార్ట్ బస్టర్ పుణ్యమాని హిందీలోనూ…
హైదరాబాద్లోని పంజాగుట్ట పోలీసులు యూట్యూబర్ అన్వేష్ (నా అన్వేషణ)పై లుకౌట్ నోటీసులు జారీ చేశారు. ప్రస్తుతం అన్వేష్ విదేశాల్లో ఉన్నారని…
ఏపీ కాంగ్రెస్ పార్టీ పరిస్థితి నానాటికీ తీసికట్టుగా మారుతోందా? .. పార్టీ నాయకులు దీనస్థితిలో ఉన్నారా? అంటే.. ఔననే సమాధానమే…
గత ఏడాది లిటిల్ హార్ట్స్ సినిమా సక్సెస్ మీట్లో నటుడు, నిర్మాత బండ్ల గణేష్ చేసిన వ్యాఖ్యలు ఎంత దుమారం…
ఇరాన్లో ప్రస్తుతం నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులు అక్కడ వైద్య విద్యనభ్యసిస్తున్న భారతీయ విద్యార్థులను తీవ్ర ఆందోళనకు గురిచేస్తున్నాయి. ఒకవైపు అమెరికా…