Political News

త‌ల‌సాని కాంగ్రెస్‌లోకి.. హైద‌రాబాద్ టార్గెట్‌గా రేవంత్‌!

హైద‌రాబాద్ తెలంగాణ‌కు గుండెలాంటిది. వ్యాపార‌, వాణిజ్య‌, రాజ‌కీయ‌, పారిశ్రామిక ఇలా ఏ రంగం తీసుకున్నా రాష్ట్రానికి హైద‌రాబాద్ ఎంతో కీల‌క‌మైంది. పొలిటిక‌ల్ ప‌రంగానూ హైద‌రాబాద్‌కు ఎన‌లేని ప్రాధాన్య‌త ఉంది.

కానీ గ‌త తెలంగాణ అసెంబ్లీ ఎన్నిక‌ల్లో గ్రేట‌ర్ హైద‌రాబాద్‌లో కాంగ్రెస్ ఒక్క‌టి కూడా గెలుచుకోలేక‌పోయింది. కానీ ఇప్పుడు బీఆర్ఎస్ ఎమ్మెల్యేల‌ను పార్టీలో చేర్చుకుంటూ హైద‌రాబాద్‌పై ప‌ట్టుకు సీఎం రేవంత్ ప్ర‌య‌త్నిస్తున్నార‌నే టాక్ వినిపిస్తోంది.

ఏ గ్రేట‌ర్ హైద‌రాబాద్‌లో అయితే కాంగ్రెస్ ఒక్క సీటు కూడా గెల‌వ‌లేక‌పోయిందో అదే చోట గులాలీ ఎమ్మెల్యేలంద‌రినీ పార్టీలో చేర్చుకునేలా రేవంత్ క‌స‌ర‌త్తు చేస్తున్నార‌ని తెలిసింది. మేడ్చ‌ల్‌, రంగారెడ్డి, హైద‌రాబాద్ జిల్లాల్లో క‌లిపి 26 అసెంబ్లీ స్థానాలున్నాయి. ఇందులో ఇబ్ర‌హీంప‌ట్నంలో మాత్ర‌మే కాంగ్రెస్ గెలిచింది.

ఇటీవ‌ల సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఉప ఎన్నిక‌ల్లో విజ‌యం సాధించింది. ఇక ఖైర‌తాబాద్‌, రాజేంద్ర‌న‌గ‌ర్‌, శేర్లింగంప‌ల్లి, చేవెళ్ల‌లో బీఆర్ఎస్ నుంచి నెగ్గిన ఎమ్మెల్యేలు ఇప్పుడు కాంగ్రెస్‌లోకి వ‌చ్చేశారు.

ఇప్పుడు మ‌రికొంత‌మంది గ్రేట‌ర్లోని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కూడా కాంగ్రెస్‌లో చేరే అవ‌కాశ‌ముంది. ఈ నేప‌థ్యంలో బీఆర్ఎస్ కీల‌క నాయ‌కుడు, మాజీ మంత్రి త‌ల‌సాని శ్రీనివాస్ యాద‌వ్ కూడా కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోబోతున్నార‌నే టాక్ వినిపిస్తోంది. స‌న‌త్‌న‌గ‌ర్ నుంచి గెలిచిన త‌ల‌సాని గ‌త కొంత‌కాలంగా సైలెంట్‌గా ఉంటున్నారు.

ప్ర‌భుత్వంపై, కాంగ్రెస్ పార్టీపై ఎలాంటి విమ‌ర్శ‌లు చేయ‌డం లేదు. దీంతో త‌ల‌సానిని కూడా రేవంత్ ఒప్పించార‌నే ప్ర‌చారం సాగుతోంది. త‌ల‌సాని లాంటి నాయ‌కుడు వ‌స్తే ఆయ‌న‌తో పాటు మ‌రో అయిదారుగురు కూడా కాంగ్రెస్‌లో చేరుతార‌న్న‌ది రేవంత్ ప్లాన్‌గా తెలుస్తోంది.

This post was last modified on July 13, 2024 3:22 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

ఫిక్స్… మూడో భాగం ఛాన్స్ లేదు

బాక్సాఫీస్ వద్ద ర్యాంపేజ్ చూపిస్తున్న దురంధర్ ది రివెంజ్ కు సంబంధించి ఒక ముఖ్యమైన ప్రశ్న అందరి మెదళ్లను తొలిచేసింది.…

2 hours ago

పవన్ పట్టుకు బాలినేని లొంగిపోయారా?

బాలినేని శ్రీనివాస రెడ్డి జనసేనలో చేరిన తర్వాత పెద్దగా యాక్టివ్ గా లేని సంగతి తెలిసిందే. అధికారికంగా జనసేన నిర్వహించే…

3 hours ago

ఊపిరి పీల్చుకుంటున్న తెలుగు థియేటర్లు

ఫిబ్రవరితో మొదలుపెట్టి మార్చి రెండో వారం దాకా పట్టుమని వారం రోజులు హౌస్ ఫుల్ చేసే సినిమా లేక గగ్గోలు…

3 hours ago

డిజిటల్ మోసాల బారిన పడినోళ్లకు పరిహారం, కానీ…

కొన్నిసార్లు అవగాహన రాహిత్యంతో డిజిటల్ మోసాల బారిన పడతాం. అలాంటి వారి విషయంలో ఇప్పటివరకు ఎప్పుడూ లేని విధంగా పరిహారం…

5 hours ago

అసలే కిమ్… ఎన్నికల్లో ఓట్లు వేయకపోతే…

ప్రపంచంలోని మూర్ఖ పాలకుల జాబితాను తీస్తే.. అందులో మొదటి ముగ్గురు పాలకుల్లో ఒకరుగా నిలుస్తారు కింగ్ జోంగ్ ఉన్. తన…

6 hours ago

‘ధూరందర్’ దర్శకుడు… మాములోడు కాదు

బాలీవుడ్‌లో స్టార్ పవర్ కంటే కేవలం కథను నమ్మి సినిమాలు తీసే దర్శకులు చాలా తక్కువ మంది ఉంటారు. అందులో…

6 hours ago