హైదరాబాద్ తెలంగాణకు గుండెలాంటిది. వ్యాపార, వాణిజ్య, రాజకీయ, పారిశ్రామిక ఇలా ఏ రంగం తీసుకున్నా రాష్ట్రానికి హైదరాబాద్ ఎంతో కీలకమైంది. పొలిటికల్ పరంగానూ హైదరాబాద్కు ఎనలేని ప్రాధాన్యత ఉంది.
కానీ గత తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో గ్రేటర్ హైదరాబాద్లో కాంగ్రెస్ ఒక్కటి కూడా గెలుచుకోలేకపోయింది. కానీ ఇప్పుడు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను పార్టీలో చేర్చుకుంటూ హైదరాబాద్పై పట్టుకు సీఎం రేవంత్ ప్రయత్నిస్తున్నారనే టాక్ వినిపిస్తోంది.
ఏ గ్రేటర్ హైదరాబాద్లో అయితే కాంగ్రెస్ ఒక్క సీటు కూడా గెలవలేకపోయిందో అదే చోట గులాలీ ఎమ్మెల్యేలందరినీ పార్టీలో చేర్చుకునేలా రేవంత్ కసరత్తు చేస్తున్నారని తెలిసింది. మేడ్చల్, రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాల్లో కలిపి 26 అసెంబ్లీ స్థానాలున్నాయి. ఇందులో ఇబ్రహీంపట్నంలో మాత్రమే కాంగ్రెస్ గెలిచింది.
ఇటీవల సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఉప ఎన్నికల్లో విజయం సాధించింది. ఇక ఖైరతాబాద్, రాజేంద్రనగర్, శేర్లింగంపల్లి, చేవెళ్లలో బీఆర్ఎస్ నుంచి నెగ్గిన ఎమ్మెల్యేలు ఇప్పుడు కాంగ్రెస్లోకి వచ్చేశారు.
ఇప్పుడు మరికొంతమంది గ్రేటర్లోని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కూడా కాంగ్రెస్లో చేరే అవకాశముంది. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ కీలక నాయకుడు, మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కూడా కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోబోతున్నారనే టాక్ వినిపిస్తోంది. సనత్నగర్ నుంచి గెలిచిన తలసాని గత కొంతకాలంగా సైలెంట్గా ఉంటున్నారు.
ప్రభుత్వంపై, కాంగ్రెస్ పార్టీపై ఎలాంటి విమర్శలు చేయడం లేదు. దీంతో తలసానిని కూడా రేవంత్ ఒప్పించారనే ప్రచారం సాగుతోంది. తలసాని లాంటి నాయకుడు వస్తే ఆయనతో పాటు మరో అయిదారుగురు కూడా కాంగ్రెస్లో చేరుతారన్నది రేవంత్ ప్లాన్గా తెలుస్తోంది.
This post was last modified on July 13, 2024 3:22 pm
జూన్ 4 విడుదల కాబోతున్న పెద్ది కోసం ఎదురు చూపులు మాములుగా లేవు. రెండు నెలలుగా డ్రైగా ఉన్న బాక్సాఫీస్…
గత పది రోజులుగా తమిళనాడు రాజకీయాలు దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశం అవుతున్నాయో తెలిసిందే. ఎన్నికల్లో అతి పెద్ద పార్టీగా టీవీకే…
ఇవాళ జరిగిన టాలీవుడ్ ప్రొడ్యూసర్ల సమావేశంలో నిర్మాత నాగవంశీ ఒక మాటన్నారు. ఒకవేళ ఈ సమస్య పరిష్కారం కాకుండా పెద్దిని…
నైజామ్ సింగల్ స్క్రీన్ పర్సెంటేజ్ వివాదం ముదిరిపోతోంది. నిన్న శిరీష్, సునీల్ నారంగ్ తదితరులు నిర్వహించిన ఎగ్జిబిటర్ల ప్రెస్ మీట్…
కాంగ్రెస్ పార్టీ అగ్రనేతలు.. ప్రియాంక గాంధీ, రాహుల్ గాంధీలకు కేరళలో తీవ్రనిరసన సెగ తగులుతోంది. రాహుల్-ప్రియాంక.. కేరళ మిమ్మల్ని క్షమించదు.…
నిజమేనండోయ్… జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఏదైనా మాట ఇచ్చారంటే దానిని నెరవేర్చి తీరతారు. ఇందుకు…