హైదరాబాద్ తెలంగాణకు గుండెలాంటిది. వ్యాపార, వాణిజ్య, రాజకీయ, పారిశ్రామిక ఇలా ఏ రంగం తీసుకున్నా రాష్ట్రానికి హైదరాబాద్ ఎంతో కీలకమైంది. పొలిటికల్ పరంగానూ హైదరాబాద్కు ఎనలేని ప్రాధాన్యత ఉంది.
కానీ గత తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో గ్రేటర్ హైదరాబాద్లో కాంగ్రెస్ ఒక్కటి కూడా గెలుచుకోలేకపోయింది. కానీ ఇప్పుడు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను పార్టీలో చేర్చుకుంటూ హైదరాబాద్పై పట్టుకు సీఎం రేవంత్ ప్రయత్నిస్తున్నారనే టాక్ వినిపిస్తోంది.
ఏ గ్రేటర్ హైదరాబాద్లో అయితే కాంగ్రెస్ ఒక్క సీటు కూడా గెలవలేకపోయిందో అదే చోట గులాలీ ఎమ్మెల్యేలందరినీ పార్టీలో చేర్చుకునేలా రేవంత్ కసరత్తు చేస్తున్నారని తెలిసింది. మేడ్చల్, రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాల్లో కలిపి 26 అసెంబ్లీ స్థానాలున్నాయి. ఇందులో ఇబ్రహీంపట్నంలో మాత్రమే కాంగ్రెస్ గెలిచింది.
ఇటీవల సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఉప ఎన్నికల్లో విజయం సాధించింది. ఇక ఖైరతాబాద్, రాజేంద్రనగర్, శేర్లింగంపల్లి, చేవెళ్లలో బీఆర్ఎస్ నుంచి నెగ్గిన ఎమ్మెల్యేలు ఇప్పుడు కాంగ్రెస్లోకి వచ్చేశారు.
ఇప్పుడు మరికొంతమంది గ్రేటర్లోని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కూడా కాంగ్రెస్లో చేరే అవకాశముంది. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ కీలక నాయకుడు, మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కూడా కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోబోతున్నారనే టాక్ వినిపిస్తోంది. సనత్నగర్ నుంచి గెలిచిన తలసాని గత కొంతకాలంగా సైలెంట్గా ఉంటున్నారు.
ప్రభుత్వంపై, కాంగ్రెస్ పార్టీపై ఎలాంటి విమర్శలు చేయడం లేదు. దీంతో తలసానిని కూడా రేవంత్ ఒప్పించారనే ప్రచారం సాగుతోంది. తలసాని లాంటి నాయకుడు వస్తే ఆయనతో పాటు మరో అయిదారుగురు కూడా కాంగ్రెస్లో చేరుతారన్నది రేవంత్ ప్లాన్గా తెలుస్తోంది.
This post was last modified on July 13, 2024 3:22 pm
తెలంగాణలో ఆక్రమ కట్టడాలకు సింహ స్వప్నంగా మారిన హైడ్రా విధానంపై హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. తమ మాటంటే హైడ్రాకు…
వైసీపీ నేత, ఫైర్ బ్రాండ్ నాయకుడు, మాజీ మంత్రి జోగి రమేష్ ఫ్యామిలీలో కోడలు చేసిన ఆరోపణలు పెను కుదుపునకు…
సినిమాల్లో రాజకీయ అంశాలు పెట్టాలంటే ఒకటికి రెండుసార్లు ఆలోచించుకోవాల్సిన పరిస్థితులున్నాయి ప్రస్తుతం. తమ నాయకుల మీద పొలిటికల్ కౌంటర్లు వేస్తే…
జన నాయకుడు సినిమా ఎలా ఉందనేది మళ్ళీ చెప్పనవసరం లేదు. విజయ్ ఇమేజ్ పుణ్యమాని రెండు వందల కోట్లు దాటేసింది…
ఏపీలో గత 2 మాసాల కిందటి వరకు తీవ్రస్థాయిలో చర్చనీయాంశం అయిన ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా, ఉండి నియోజకవర్గం…
ప్రజలు, శాంతియుతంగా నిరసన చేస్తున్నవారిని కొట్టే హక్కు పోలీసులకు ఉందా? అని సుప్రీంకోర్టు ప్రశ్నించింది. ఇలా అయితే.. దేశం మొత్తం…