Political News

షర్మిల గాలానికి వైసీపీ నేతలు చిక్కుతారా ?!

అన్న మీద తిరుగుబాటు చేసి ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ ప్రభుత్వ ఓటమికి తీవ్రంగా కృషిచేసిన వైఎస్ జగన్ సోదరి, ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల కడప ఎంపీగా పోటీ చేసి ఓటమి చవిచూసింది. అయితే ఎన్నికల్లో జగన్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లక్ష్యంగా ఆమె చేసిన విమర్శలు తీవ్ర ప్రభావం చూపాయి. అయితే ఎన్నికల ఫలితాల అనంతరం కూడా ఆమె దూకుడుగా వెళ్తుండడం గమనార్హం.

వైఎస్ జయంతి వేదికగా పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి, పలువురు మంత్రులను తీసుకువచ్చి మంగళగిరిలో ఘనంగా నిర్వహించిన షర్మిల వైఎస్ వారసురాలిని తానేనని ప్రకటించుకున్నది. ఏపీలో వైసీపీ ప్రస్తుతం 11 శాసనసభ, 4 లోక్ సభ స్థానాలకు పరిమితం అయిన నేపథ్యంలో వైసీపీలో ఉన్న మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, జడ్పీటీసీలు, ఎంపీపీలను కాంగ్రెస్ వైపు లాక్కోవాలని షర్మిల భావిస్తున్నట్లు తెలుస్తుంది.

జగన్ బలహీనపడడం, వైసీపీ కనుమరుగు కావడం టీడీపీ కూడా ఆశిస్తుంది. అయితే ఇన్నాళ్లూ వైసీపీలో ఉండి అడ్డగోలు వ్యవహారాలు చేసిన నేతలను టీడీపీలో చేర్చుకునే పరిస్థితి లేదు. కాబట్టి వాళ్లంతా కాంగ్రెస్ పార్టీలో చేరినా టీడీపీకి వచ్చిన నష్టం ఏమీ లేకపోగా, వైసీపీ బలహీనం కావాలన్న టీడీపీ లక్ష్యం నెరవేరుతుంది.

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ తో షర్మిలకు సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. వచ్చే ఎన్నికల్లో కడపకు, పులివెందులకు వచ్చి షర్మిల గెలుపు కోసం పనిచేస్తానని, షర్మిలను ముఖ్యమంత్రిని చేస్తామని వైఎస్ జయంతి వేడుకల్లో రేవంత్ ప్రకటించాడు. ఈ నేపథ్యంలోనే తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్, కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకె శివకుమార్ ల సహకారంతో ఏపీలో కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయాలని షర్మిల భావిస్తున్నట్లు తెలుస్తుంది.

గత ఎన్నికలలో వైసీపీ టికెట్ నిరాకరించిన పలువురు ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో చేరి పోటీ చేశారు. ఈ నేపథ్యంలో గత ప్రభుత్వంలో జగన్ కు సన్నిహితంగా ఉన్న వారిని కాంగ్రెస్ వైపు లాక్కు రావాలని షర్మిల ప్రయత్నాలు మొదలుపెట్టినట్లు తెలుస్తుంది. మరి షర్మిల గాలానికి చిక్కే వారెవరో తెలియాలంటే వేచిచూడాల్సిందే.

This post was last modified on July 13, 2024 11:12 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

ప్యారడైజ్ పరుగులు పెట్టాల్సిందే

పెద్ది విషయంలో జరుగుతున్న జాప్యం ఇతర సినిమాలను అలర్ట్ చేస్తోంది. రెండుసార్లు రిలీజ్ డేట్ మార్చాక కూడా దానికి కట్టుబడలేని…

52 minutes ago

రజినీకాంత్ భయపడ్డాడా? జాగ్రత్తపడ్డాడా?

తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల వేళ రాజకీయ వాతావరణం సెగలు పుట్టిస్తోంది. ముఖ్యంగా దళపతి విజయ్ తన సొంత పార్టీతో నేరుగా…

3 hours ago

వాషింగ్టన్ డీసీని… మనమ్మాయి శాసిస్తుందా?

ప్రపంచానికి పెద్దన్న.. అగ్రరాజ్యమైన అమెరికా రాజధాని నగరం వాషింగ్టన్ డీసీ. ఈ మహానగర మేయర్ ఎన్నిక ఇప్పుడు జరుగుతోంది. విశేషం…

3 hours ago

పార్టీ పేరుతో పాటు గుర్తుతోనూ స్ట్రోక్ ఇవ్వనున్న కవిత?

బీఆర్ఎస్ పార్టీ మాజీ నాయ‌కురాలు, తెలంగాణ జాగృతి సంస్థ అధ్య‌క్షురాలు క‌విత త‌న దూకుడు మరింత పెంచినట్టు తెలుస్తోంది. త్వ‌రలోనే…

3 hours ago

భానుప్రియ మతిస్థిమితం కోల్పోయిందా?

ఒకప్పుడు తెలుగు సినిమాల్లో ఒక వెలుగు వెలిగిన కథానాయికల్లో భానుప్రియ ఒకరు. 80వ దశకంలో తెలుగులో ఉన్న అందరు అగ్రకథానాయికులతోనూ ఆమె…

4 hours ago

బ్లాక్ బస్టర్ స్ట్రీక్‌కు బ్రేక్ పడబోతోందా?

అనామకుడైన ఒక కుర్రాడు హీరోగా నటించిన తొలి సినిమాతోనే వంద కోట్ల వసూళ్లు రాబట్టడమే అనూహ్యం. అలాంటిది ఆ హీరో తర్వాతి…

4 hours ago