Political News

నన్ను ఇన్ వాల్వ్ చేయకండి జగన్ గారు !

వేయి గొడ్లు తిన్న రాబందు ఒక్క గాలివానకు నేలకూలినట్లు ఏపీలో ఐదేళ్లు 151 శాసనసభ్యులు, 21 ఎంపీలతో చక్రం తిప్పిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి దెబ్బకు ఎన్నికల్లో 11 ఎమ్మెల్యే, 4 ఎంపీ స్థానాలకు పరిమితమై చతికిలపడింది. గత ప్రభుత్వంలో మంత్రులుగా పనిచేసిన వారు కూడా బయటకు రావడానికి జంకుతున్నారు. కొంతమంది ఎమ్మెల్యేలు ప్రస్తుతం అజ్ఞాతంలో ఉన్నారు. మరి కొంతమంది అసలు ఎక్కడు ఉన్నారో ఆచూకీ లభించడం లేదు. ఇంకొందరిని పోలీసులు వెతుకుతున్నా ఆచూకీ లభించడం లేదు.

గత వైసీపీ హయాంలో విశాఖపట్నం స్థానిక సంస్థల శాసనమండలి స్థానం నుండి వంశీక్రిష్ణ శ్రీనివాస్ యాదవ్ వైసీపీ తరపున ఎమ్మెల్సీగా ఎన్నికయ్యాడు. సరిగ్గా ఎన్నికలకు ముందు జనసేన పార్టీ తీర్ధం పుచ్చుకుని విశాఖ దక్షిణ శాసనసభ స్థానం నుండి పోటీ చేసి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు. దీంతో అనివార్యంగా ఆయన తన ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేశాడు.

దీంతో ఇక్కడ ఎమ్మెల్సీ స్థానానికి ఉప ఎన్నిక రానున్నది. ఇక్కడ స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు 725 మంది వరకు ఉండగా, టీడీపీకి కేవలం 180 ఓట్లున్నాయి. వైసీపీకి 545 ఓట్లు ఉండడం విశేషం. ఈ నేపథ్యంలో ఇక్కడ పోటీ చేసి ఎమ్మెల్సీ కావాలని మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ ఉవ్విళ్లూరుతున్నాడు. అయితే ఆర్థికంగా శక్తిమంతుడు అయిన ఎంవీవీ సత్యనారాయణను బరిలోకి దించాలని వైసీపీ అధినేత వైఎస్ జగన్ నిర్ణయించినట్లు సమాచారం.

ఈ మేరకు తాడేపల్లిలో జగన్ ను కలిసిన ఎంవీవీ సత్యనారాయణ తాను ఎమ్మెల్సీగా పోటీ చేయలేనని స్పష్టం చేసినట్లు తెలుస్తుంది. తన సంస్థ చేపట్టిన వివిధ పనులను నిలిపివేయాలని అధికారంలోకి వచ్చిన టీడీపీ ప్రభుత్వం ఇప్పటికే ఆదేశాలు జారీచేసిందని, ఈ మేరకు తన మీద, తన మనుషుల మీద కేసులు కూడా నమోదు చేశారని, ఈ పరిస్థితులలో తాను ఎన్నికల్లో పోటీ చేయలేనని చెప్పినట్లు తెలుస్తుంది. 545 మంది సభ్యుల బలం ఉండి అక్కడ పోటీకి భయపడడం ఆశ్చర్యకరమే. ఈ స్థానం నుండి టీడీపీ గండి బాబ్జీని రంగంలోకి దింపనున్నట్లు సమాచారం.

This post was last modified on July 13, 2024 10:51 am

Share

Recent Posts

విజయ్ స్థానాన్ని భర్తీ చేస్తాడా?

తమిళంలో సూపర్ స్టార్ రజినీకాంత్ ఎన్నో ఏళ్ల పాటు నంబర్ వన్ హీరోగా కొనసాగారు. రజినీ ఉండగా ఆయన్ని మించే స్టార్ రాబోడని అంతా…

2 hours ago

విశ్వంభర వెళ్తున్న దారి సరైనదేనా

చిరంజీవి పుట్టినరోజు ఇంకో ఆరు రోజుల్లో రానుంది. రెండు కీలక అప్డేట్స్ కోసం అభిమానులు ఎదురు చూస్తున్నారు. మెగా 158…

4 hours ago

యష్ మాటల్లో పరిణితి పని చేస్తుంది

ఇంకో పది రోజుల్లో టాక్సిక్ విడుదల కానుంది. కెజిఎఫ్ తర్వాత సుమారు నాలుగేళ్ల విలువైన కాలాన్ని దీని కోసమే ఖర్చు…

5 hours ago

వైసీపీ స‌త్తాకు `బ్యాలెట్` టెస్ట్‌?

ఏపీలో వ‌చ్చే సెప్టెంబ‌రులో నిర్వ‌హించాల‌ని భావిస్తున్న స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల‌ను బ్యాలెట్ విధానంలోనే నిర్వ‌హించాల‌ని రాష్ట్ర ఎన్నిక‌ల సంఘం నిర్ణ‌యించింది. దీంతో…

5 hours ago

కేటీఆర్ కార్యకర్తల రక్తాన్ని అమ్ముకున్నారు

తెలంగాణాలో స్థానిక ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్ది అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య విమర్శలు జోరందుకుంటున్నాయి. దీంతో రాజకీయ వేడి రాజుకుంటుంది.…

5 hours ago

భోగాపురం టూ సింగపూర్… బాబు గారి దిల్ ఖుష్

విజ‌య‌న‌గ‌రం జిల్లాలోని భోగాపురంలో అధునాతన వ‌స‌తుల‌తో నిర్మించిన అల్లూరి సీతారామ‌రాజు అంత‌ర్జాతీయ గ్రీన్ ఫీల్డ్ విమానాశ్ర‌యం కార్య‌కలాపాలు ఆదివారం అర్ధ‌రాత్రి…

8 hours ago