Political News

‘జ‌గ‌న్ పాల‌న క‌న్నా.. బ్రిటీష్ పాల‌నే బెట‌ర్‌’

ఏపీ మాజీ సీఎం జ‌గ‌న్‌పై.. ముఖ్యమంత్రి కార్యాల‌యం మాజీ కార్య‌ద‌ర్శి, రిటైర్డ్ ఐఏఎస్ అధికారి పీవీ ర‌మేష్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. జ‌గ‌న్‌పాల‌న‌క‌న్నా.. బ్రిటీష్ పాల‌నే బెట‌ర్ అనిపించేలా గ‌త ఐదేళ్లు ఏపీలో పాల‌న సాగింద‌ని అన్నారు. రాష్ట్రాన్ని జ‌గ‌న్ త‌న సొంత సామ్రాజ్యంగా భావించార‌ని తెలిపారు. ప్ర‌భుత్వ‌మంటే రాచ‌రిక వ్య‌వ‌స్థ‌లా.. అధికారులంటే త‌న బానిస‌లుగా అనుకున్నార‌ని వ్యాఖ్యానించారు. తాజాగా గుంటూరులో నిర్వ‌హించిన ఏపీ అభివృద్ది కార్యాచ‌ర‌ణ‌పై జ‌రిగిన కార్య‌క్ర‌మంలో పీవీ ర‌మేష్ పాల్గొన్నారు. ఈ సంద‌ర్భంగా జ‌గ‌న్ పాల‌న‌లోని లోపాల‌ను ఆయ‌న ప్ర‌స్తావించారు.

గ‌త ఐదేళ్ల‌లో జ‌గ‌న్ ప్ర‌భుత్వం రాష్ట్ర అభివృద్ధిని గాలికి వ‌దిలేశార‌ని వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో ప‌రిశ్ర మలు, కంపెనీల ఏర్పాట్ల‌కు ఎలాంటి ప్ర‌య‌త్నం చేయ‌లేద‌న్నారు. దీంతో రాష్ట్రంలో ఉపాధి, ఉద్యోగ రంగాలు భ్ర‌ష్టు ప‌ట్టిపోయాయ‌ని ర‌మేష్ వ్యాఖ్యానించారు. బ‌ట‌న్ నొక్కితే చాల‌ని.. అవే ఓట్లు రాలుస్తాయని భ్ర‌మ‌లో జ‌గ‌న్ గ‌డిపేశార‌ని తెలిపారు. దీంతో రాష్ట్రంలో చాలా ఏళ్లు వెన‌క్కి వెళ్లిపోయింద‌న్నారు. రాష్ట్ర ప్ర‌గ‌తిని ఆయ‌న విస్మ‌రించార‌ని చెప్పారు.

జ‌గ‌న్ ప్ర‌భుత్వం తీసుకువ‌చ్చిన భూ హ‌క్కు చ‌ట్టం కూడా అనేక వివాదాల‌కు దారి తీసింద‌ని పీవీ ర‌మేష్ చెప్పారు. జ‌గ‌న్ క‌న్నా బ్రిటీష్ వాళ్లే న‌య‌మ‌ని సంచ‌ల‌న వ్యాఖ్య చేశారు. భూమి హ‌క్కుల విష‌యంలో జ‌గ‌న్ చ‌ట్టాల‌క‌న్నా.. బ్రిటీష్ వారు తెచ్చిన చ‌ట్టాలే బాగున్నాయ‌ని ర‌మేష్ చెప్పారు. జ‌గ‌న్ తెచ్చిన భూ హ‌క్కుల చ‌ట్టం కొత్త స‌మ‌స్య‌ల‌ను కొని తెచ్చిన‌ట్టు అయింద‌న్నారు. ఎవ‌రికీ భూమ‌లపై హ‌క్కులు లేకుండా చేయాల‌న్న ఉద్దేశంతో ఈ చ‌ట్టాన్ని తీసుకువ‌చ్చార‌ని ఆరోపించారు.

ఎవ‌రికి ప్ర‌యోజ‌నం క‌ల్పించాల‌ని అనుకున్నారో తెలియ‌దు. కానీ, కొంద‌రికి మాత్ర‌మే ప్ర‌యోజ‌నం చేకూర్చేలా ఈ చ‌ట్టాల‌ను తీసుకువ‌చ్చారు. అందుకే ప్ర‌జ‌ల్లో అంత వ్య‌తిరేక‌త వ్య‌క్త‌మైంది అని పీవీ ర‌మేష్ అన్నారు.

This post was last modified on July 15, 2024 5:57 am

Share

Recent Posts

సుమంత్ ఈసారి బలంగా వస్తున్నాడు

అక్కినేని నాగేశ్వ‌ర‌రావు మ‌న‌వ‌డు సుమంత్‌ను చూస్తే పెద్ద స్టార్ కావ‌డానికి అవ‌స‌ర‌మైన అన్ని ల‌క్ష‌ణాలు ఉన్న‌ట్లే క‌నిపిస్తాడు. ఆర‌డుగుల ఆజానుబాహుడు,…

2 minutes ago

విద్యార్థిని ఆత్మ‌హ‌త్య‌.. చంద్ర‌బాబు తీవ్ర ఆవేద‌న.. ఏంటీ బంధం?

పోలవరం జిల్లా ఈర్లపల్లి గ్రామానికి చెందిన 10వ తరగతి విద్యార్ధిని ముర్రం శివాని ఆత్మ‌హ‌త్య చేసుకుంది. దీనికి సంబంధించిన కార‌ణాలు…

5 minutes ago

రంగ‌నాథ్‌ను తప్పించండి… హైడ్రాపై హైకోర్టు సీరియ‌స్‌!

తెలంగాణ‌లో ఆక్ర‌మ క‌ట్టడాల‌కు సింహ స్వ‌ప్నంగా మారిన హైడ్రా విధానంపై హైకోర్టు కీల‌క వ్యాఖ్య‌లు చేసింది. త‌మ మాటంటే హైడ్రాకు…

2 hours ago

జోగి ఫ్యామిలీలో `కోడ‌లి` కుదుపు!

వైసీపీ నేత‌, ఫైర్ బ్రాండ్ నాయ‌కుడు, మాజీ మంత్రి జోగి ర‌మేష్ ఫ్యామిలీలో కోడ‌లు చేసిన ఆరోప‌ణలు పెను కుదుపున‌కు…

3 hours ago

కొత్త సినిమాల్లో పొలిటికల్ పంచులు చూశారా?

సినిమాల్లో రాజకీయ అంశాలు పెట్టాలంటే ఒకటికి రెండుసార్లు ఆలోచించుకోవాల్సిన పరిస్థితులున్నాయి ప్రస్తుతం. తమ నాయకుల మీద పొలిటికల్ కౌంటర్లు వేస్తే…

3 hours ago

థియేటర్ చెక్స్… నాయకుడి పద్దతి బాగుంది

జన నాయకుడు సినిమా ఎలా ఉందనేది మళ్ళీ చెప్పనవసరం లేదు. విజయ్ ఇమేజ్ పుణ్యమాని రెండు వందల కోట్లు దాటేసింది…

3 hours ago