Political News

వైసీపీని బీజేపీ ఉంచుకుంది: షర్మిల

ఏపీ మాజీ సీఎం, తన సోదరుడు వైఎస్ జగన్ పై ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తాజాగా మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. బీజేపీకి తొత్తుగా, తోక పార్టీగా, ఉంచుకున్న పార్టీగా ఉన్నది వైసీపీ అని, బీజేపీకి జగన్ ఊడిగం చేస్తున్నారని షాకింగ్ వ్యాఖ్యలు చేశారు. అధికారంలో ఉన్న 5 సంవత్సరాలు ఊడిగం చేయడమే కాకుండా…మొన్న జరిగిన స్పీకర్ ఎన్నికలో కూడా బీజేపీకి జగన్ మద్దతిచ్చారని దుయ్యబట్టారు. మణిపూర్ ఘటన సహా ఏది చూసుకున్నా మొత్తం బీజేపీతో జగన్ ఉన్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీని ప్రజలు గొయ్యి తీసి పాతిపెట్టారు. రాజశేఖర్ రెడ్డి గారికి వైసీపీకి సంబంధం లేదు అని షర్మిల అన్నారు.

వైఎస్ రాజశేఖర్ రెడ్డి 75వ జయంతిని గొప్పగా చేయకుండా ఏదో మొక్కుబడిగా చేశారని షర్మిల విమర్శించారు. 5 నిమిషాలు అక్కడ నిలబడే రాజశేఖర్ రెడ్డి గారికి తూతూ మంత్రంలా జగన్ నివాళులు అర్పించడాన్ని తప్పుబట్టారు. ‘సిద్ధం’ అంటూ పెద్ద పెద్ద సభలు, హోర్డింగ్ లు పెట్టి సభకు రూ.30 కోట్లు ఖర్చుపెట్టారని విమర్శించారు. అటువంటిది రాజశేఖర్ రెడ్డి గారి కోసం ఒక్క సభ ఎందుకు పెట్టలేకపోయారని జగన్ ను షర్మిల నిలదీశారు.

నా తండ్రి, మా పార్టీ నేత కాబట్టే రాజశేఖర్ రెడ్డి గారి కోసం అంత పెద్ద సభ ఏర్పాటు చేశామని, ఆ సభకు ఓ ముఖ్యమంత్రి, పక్క రాష్ట్రంలోని మంత్రులు, పెద్ద పెద్ద నాయకులు కూడా వచ్చారని చెప్పారు. సోనియా గాంధీ, రాహుల్ గాంధీ వంటి అగ్రనేతలు రాజశేఖర్ రెడ్డి జయంతి కోసం సందేశాలు పంపించారని అన్నారు. మీరా రాజశేఖర్ రెడ్డి వారసులు?” అంటూ షర్మిల నిప్పులు చెరిగారు. రాజశేఖర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ మనిషి అని అన్నారు.

This post was last modified on July 12, 2024 8:58 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

పవన్ కల్యాణ్ హీరోగా… టీడీపీ ఎమ్మెల్యే నిర్మాతగా…

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తెలుగులో ఎన్నో విజయవంతమైన చిత్రాలు వచ్చాయి. తొలినాళ్లలో తీసిన చాలా సినిమాలు బ్లాక్ బస్టర్…

42 minutes ago

రష్యా vs ఉక్రెయిన్ – ఇండియా ఎవరివైపో చెప్పిన మోడీ

ప్రపంచమంతా ఉత్కంఠగా ఎదురుచూస్తున్న సమావేశం ఢిల్లీలోని హైదరాబాద్ హౌస్‌లో జరిగింది. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, భారత ప్రధాని నరేంద్ర…

1 hour ago

హై కోర్టుకు సారీ చెప్పిన హైడ్రా, ఏం జరిగింది?

`సారీ మైలార్డ్‌.. ఇక‌పై అలాంటి త‌ప్పులు జ‌ర‌గ‌వు`` - అని తెలంగాణ హైకోర్టుకు హైడ్రా క‌మిష‌న‌ర్‌, ఐపీఎస్ అధికారి రంగ‌నాథ్…

2 hours ago

లోకేష్ కోసం వెళ్ళని చంద్రబాబు ఏపీ కోసం వచ్చారు

పార్వతీపురం మన్యం జిల్లాలో నిర్వహించిన మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ లో సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ పాల్గొన్నారు. ఈ…

2 hours ago

అఖండ అనుభవం.. అలెర్ట్ అవ్వాలి

నందమూరి బాలకృష్ణ, బోయపాటి శ్రీనుల బ్లాక్ బస్టర్ కాంబినేషన్లో తెరకెక్కిన సినిమా.. అఖండ-2. అంతా అనుకున్నట్లు జరిగితే.. ఈపాటికి ఈ…

3 hours ago

ఐదుగురికి కమిట్మెంట్ అడిగారు.. నో చెప్పా

సినీ రంగంలో మహిళలకు లైంగిక వేధింపులు ఎదురవడం గురించి దశాబ్దాలుగా ఎన్నో అనుభవాలు వింటూనే ఉన్నాం. ఐతే ఒకప్పటితో పోలిస్తే…

3 hours ago