ఏపీ మాజీ సీఎం, వైసీపీ అధినేత జగన్కు.. ఆ పార్టీ మాజీ నాయకుడు, ప్రస్తుత ఉండి నియోజకవర్గం ఎమ్మెల్యే రఘురామ కృష్ణం రాజు.. ఉరఫ్ ఆర్.ఆర్.ఆర్ రిటర్న్ గిఫ్టు ఇచ్చారు. 2021-22 మధ్య ఎంపీగా ఉన్న తనను అక్రమంగా నిర్బంధించి కస్టోడియల్ టార్చర్ చేశారని.. ఈ క్రమంలో తనపై హత్యాయత్నం కూడా చేశారని పేర్కొంటూ రఘురామ తాజాగా గుంటూరు జిల్లా నగరం పాలెం పోలీసులకు ఫిర్యాదు చేశారు. అప్పట్లో తనను శారీరకంగా హింసించారని.. రెబ్బరు లాఠీలతో హింసించారని తెలిపారు.
తన సెల్ఫోన్ పర్సనల్ లాక్ నెంబరు చెప్పాలంటూ.. సీఐడీ అప్పటి చీఫ్ సునీల్ కుమార్ తనను కొట్టారని ఫిర్యాదు చేశారు. ఈ సమయంలో తన గుండెలపై కూర్చుని ఊపిరి ఆడకుండా చేశారని.. తనను చంపే ప్రయత్నం చేశారని తెలిపారు. ఈ ఫిర్యాదు నేపథ్యంలో వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.
ఎవరెవరిపై ఫిర్యాదు..?
ఏయే సెక్షన్లు..?
120b, 166, 167, 197, 307, 326, 465, 506 r/w 34 IPCల కింద కేసు నమోదు చేశారు. వీటిలో తీవ్రంగా కొట్టడం, బెదిరించడం, హత్యాయత్నం, నిర్బంధించడం, ఎలాంటి అనుమతి తీసుకోకుండా అదుపులోకి తీసుకోవడం వంటివి ఉన్నాయి.
అప్పట్లో ఏం జరిగింది?
2021లో నరసాపురం వైసీపీ ఎంపీగా ఉన్న రఘురామ వివిధ కారణాలతో వైసీపీతో విభేదించిన విషయం తెలిసిందే. ఈ సమయంలో ఆయనపై విద్వేషపూరిత ప్రసంగాలు, సోషల్ మీడియాలో పోస్టులు, కొన్ని వర్గాల్లో ఉద్రిక్తత సృష్టించడం, ప్రభుత్వ ప్రముఖులపై దాడి వంటి ఆరోపణలతో హైదరాబాద్లో సీఐడీ అదుపులోకి తీసుకుంది. అదే రోజు రాత్రి ఆయనను కస్టడీలో హింసించారనే ఆరోపణలు వచ్చాయి. దీనిపై సుప్రీంకోర్టు విచారణ జరపడం, హైదరాబాద్లోని మిలిటరీ ఆసుపత్రిలో రఘురామకు పరీక్షలు చేయడం తెలిసిందే.
This post was last modified on July 12, 2024 2:11 pm
సెలబ్రిటీలు చిన్న వాళ్ళైనా పెద్దోళ్ళయినా ఏదైనా మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితి ఉందిప్పుడు. సోషల్ మీడియా జమానాలో చిన్న టంగ్…
అభిమానుల్లోనే కాదు సినీ ప్రియుల్లోనూ విపరీతమైన అంచనాలు మోస్తున్న సినిమా పెద్ది. చికిరి చికిరి ఛార్ట్ బస్టర్ పుణ్యమాని హిందీలోనూ…
హైదరాబాద్లోని పంజాగుట్ట పోలీసులు యూట్యూబర్ అన్వేష్ (నా అన్వేషణ)పై లుకౌట్ నోటీసులు జారీ చేశారు. ప్రస్తుతం అన్వేష్ విదేశాల్లో ఉన్నారని…
ఏపీ కాంగ్రెస్ పార్టీ పరిస్థితి నానాటికీ తీసికట్టుగా మారుతోందా? .. పార్టీ నాయకులు దీనస్థితిలో ఉన్నారా? అంటే.. ఔననే సమాధానమే…
గత ఏడాది లిటిల్ హార్ట్స్ సినిమా సక్సెస్ మీట్లో నటుడు, నిర్మాత బండ్ల గణేష్ చేసిన వ్యాఖ్యలు ఎంత దుమారం…
ఇరాన్లో ప్రస్తుతం నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులు అక్కడ వైద్య విద్యనభ్యసిస్తున్న భారతీయ విద్యార్థులను తీవ్ర ఆందోళనకు గురిచేస్తున్నాయి. ఒకవైపు అమెరికా…