ఏపీ మాజీ సీఎం, వైసీపీ అధినేత జగన్కు.. ఆ పార్టీ మాజీ నాయకుడు, ప్రస్తుత ఉండి నియోజకవర్గం ఎమ్మెల్యే రఘురామ కృష్ణం రాజు.. ఉరఫ్ ఆర్.ఆర్.ఆర్ రిటర్న్ గిఫ్టు ఇచ్చారు. 2021-22 మధ్య ఎంపీగా ఉన్న తనను అక్రమంగా నిర్బంధించి కస్టోడియల్ టార్చర్ చేశారని.. ఈ క్రమంలో తనపై హత్యాయత్నం కూడా చేశారని పేర్కొంటూ రఘురామ తాజాగా గుంటూరు జిల్లా నగరం పాలెం పోలీసులకు ఫిర్యాదు చేశారు. అప్పట్లో తనను శారీరకంగా హింసించారని.. రెబ్బరు లాఠీలతో హింసించారని తెలిపారు.
తన సెల్ఫోన్ పర్సనల్ లాక్ నెంబరు చెప్పాలంటూ.. సీఐడీ అప్పటి చీఫ్ సునీల్ కుమార్ తనను కొట్టారని ఫిర్యాదు చేశారు. ఈ సమయంలో తన గుండెలపై కూర్చుని ఊపిరి ఆడకుండా చేశారని.. తనను చంపే ప్రయత్నం చేశారని తెలిపారు. ఈ ఫిర్యాదు నేపథ్యంలో వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.
ఎవరెవరిపై ఫిర్యాదు..?
ఏయే సెక్షన్లు..?
120b, 166, 167, 197, 307, 326, 465, 506 r/w 34 IPCల కింద కేసు నమోదు చేశారు. వీటిలో తీవ్రంగా కొట్టడం, బెదిరించడం, హత్యాయత్నం, నిర్బంధించడం, ఎలాంటి అనుమతి తీసుకోకుండా అదుపులోకి తీసుకోవడం వంటివి ఉన్నాయి.
అప్పట్లో ఏం జరిగింది?
2021లో నరసాపురం వైసీపీ ఎంపీగా ఉన్న రఘురామ వివిధ కారణాలతో వైసీపీతో విభేదించిన విషయం తెలిసిందే. ఈ సమయంలో ఆయనపై విద్వేషపూరిత ప్రసంగాలు, సోషల్ మీడియాలో పోస్టులు, కొన్ని వర్గాల్లో ఉద్రిక్తత సృష్టించడం, ప్రభుత్వ ప్రముఖులపై దాడి వంటి ఆరోపణలతో హైదరాబాద్లో సీఐడీ అదుపులోకి తీసుకుంది. అదే రోజు రాత్రి ఆయనను కస్టడీలో హింసించారనే ఆరోపణలు వచ్చాయి. దీనిపై సుప్రీంకోర్టు విచారణ జరపడం, హైదరాబాద్లోని మిలిటరీ ఆసుపత్రిలో రఘురామకు పరీక్షలు చేయడం తెలిసిందే.
This post was last modified on July 12, 2024 2:11 pm
సుప్రీంకోర్టులో రోజు వారీగా అనేక కేసులు విచారణకు వస్తాయి. న్యాయశాస్త్రంలో లబ్ధప్రతిష్టులైన అనేక మంది న్యాయవాదులు వాదనలు వినిపిస్తారు. ఇది…
రేపు కొత్త శుక్రవారం వచ్చేస్తోంది. సంక్రాంతి సినిమాల హడావిడి పూర్తిగా అయిపోవడంతో ఇప్పుడు మూవీ లవర్స్ దృష్టి వీటివైపు వెళ్లాల్సి…
బాలీవుడ్ బ్యూటీ మృణాల్ ఠాకూర్ కి విపరీతమైన ఫ్రీ పబ్లిసిటీ జరుగుతుంది. అదేంటో ఆమె సినిమాల వల్ల వచ్చిన పాపులారిటీ…
ప్రేక్షకులను తన సినిమాలతో మెప్పిస్తూ యువ హీరోగా సత్తా చాటుతున్నాడు నవీన్ పొలిశెట్టి. సంక్రాంతికి అనగనగా ఒక రాజుతో వచ్చి…
తెలుగు సినిమాలో పరిగెత్తడంలోనూ ప్రత్యేక స్టాండర్డ్ సెట్ చేసిన ఏకైక హీరో సూపర్ స్టార్ మహేష్ బాబు. అతని రన్నింగ్…
ఆల్ ఇండియా బ్లాక్ బస్టర్స్ లో ఒకటిగా అవతరించిన దురంధర్ తాజాగా ఓటిటిలో వచ్చాక కొత్త డిబేట్ మొదలయ్యింది. ఇంతకన్నా…