ఏపీ మాజీ సీఎం, వైసీపీ అధినేత జగన్కు.. ఆ పార్టీ మాజీ నాయకుడు, ప్రస్తుత ఉండి నియోజకవర్గం ఎమ్మెల్యే రఘురామ కృష్ణం రాజు.. ఉరఫ్ ఆర్.ఆర్.ఆర్ రిటర్న్ గిఫ్టు ఇచ్చారు. 2021-22 మధ్య ఎంపీగా ఉన్న తనను అక్రమంగా నిర్బంధించి కస్టోడియల్ టార్చర్ చేశారని.. ఈ క్రమంలో తనపై హత్యాయత్నం కూడా చేశారని పేర్కొంటూ రఘురామ తాజాగా గుంటూరు జిల్లా నగరం పాలెం పోలీసులకు ఫిర్యాదు చేశారు. అప్పట్లో తనను శారీరకంగా హింసించారని.. రెబ్బరు లాఠీలతో హింసించారని తెలిపారు.
తన సెల్ఫోన్ పర్సనల్ లాక్ నెంబరు చెప్పాలంటూ.. సీఐడీ అప్పటి చీఫ్ సునీల్ కుమార్ తనను కొట్టారని ఫిర్యాదు చేశారు. ఈ సమయంలో తన గుండెలపై కూర్చుని ఊపిరి ఆడకుండా చేశారని.. తనను చంపే ప్రయత్నం చేశారని తెలిపారు. ఈ ఫిర్యాదు నేపథ్యంలో వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.
ఎవరెవరిపై ఫిర్యాదు..?
ఏయే సెక్షన్లు..?
120b, 166, 167, 197, 307, 326, 465, 506 r/w 34 IPCల కింద కేసు నమోదు చేశారు. వీటిలో తీవ్రంగా కొట్టడం, బెదిరించడం, హత్యాయత్నం, నిర్బంధించడం, ఎలాంటి అనుమతి తీసుకోకుండా అదుపులోకి తీసుకోవడం వంటివి ఉన్నాయి.
అప్పట్లో ఏం జరిగింది?
2021లో నరసాపురం వైసీపీ ఎంపీగా ఉన్న రఘురామ వివిధ కారణాలతో వైసీపీతో విభేదించిన విషయం తెలిసిందే. ఈ సమయంలో ఆయనపై విద్వేషపూరిత ప్రసంగాలు, సోషల్ మీడియాలో పోస్టులు, కొన్ని వర్గాల్లో ఉద్రిక్తత సృష్టించడం, ప్రభుత్వ ప్రముఖులపై దాడి వంటి ఆరోపణలతో హైదరాబాద్లో సీఐడీ అదుపులోకి తీసుకుంది. అదే రోజు రాత్రి ఆయనను కస్టడీలో హింసించారనే ఆరోపణలు వచ్చాయి. దీనిపై సుప్రీంకోర్టు విచారణ జరపడం, హైదరాబాద్లోని మిలిటరీ ఆసుపత్రిలో రఘురామకు పరీక్షలు చేయడం తెలిసిందే.
తెలుగులో చాలా కొద్ది మంది హీరోయిన్లకు మాత్రమే సాధ్యమైన స్టార్ ఇమేజ్ సంపాదించింది సమంత. విజయశాంతి, అనుష్కల తర్వాత హీరోలతో…
కేవలం పది కోట్ల బడ్జెట్లో తెరకెక్కిన సినిమా.. అబ్సెషన్. ఈ హాలీవుడ్ హార్రర్ మూవీ విడుదలైనప్పటి నుంచి వరల్డ్ వైడ్…
స్టార్ హీరో సినిమాల రిపీట్ వేల్యూకి ప్రధానంగా దోహదం చేసేది పాటలే. ఫైట్లు, ఎలివేషన్లు, యాక్షన్ ఎపిసోడ్లు ఎక్కువ లేని…
సంక్రాంతికి రిలీజైన మన శంకరవరప్రసాద్ గారులో ప్రాణ స్నేహితులుగా నటించిన చిరంజీవి, వెంకటేష్ మొదటిసారి స్క్రీన్ పంచుకుని ఎంత పెద్ద…
హెడింగ్ చూడగానే ఏవో ముళ్లచెట్ల వల్ల ఎవరికో ఏదో అయిపోయి షూటింగ్ బ్రేక్ పడిందని అనుకోకండి. ఇక్కడ అడ్డంకులనే కోణంలో…
రాష్ట్రంలో అటవీ సంపదను కాపాడడంతోపాటు.. వన్యప్రాణుల సంరక్షణకు సైతం ప్రాధాన్యం ఇస్తున్న ఉప ముఖ్యమంత్రి, అటవీ శాఖ మంత్రి పవన్…