ఏపీ మాజీ సీఎం, వైసీపీ అధినేత జగన్కు.. ఆ పార్టీ మాజీ నాయకుడు, ప్రస్తుత ఉండి నియోజకవర్గం ఎమ్మెల్యే రఘురామ కృష్ణం రాజు.. ఉరఫ్ ఆర్.ఆర్.ఆర్ రిటర్న్ గిఫ్టు ఇచ్చారు. 2021-22 మధ్య ఎంపీగా ఉన్న తనను అక్రమంగా నిర్బంధించి కస్టోడియల్ టార్చర్ చేశారని.. ఈ క్రమంలో తనపై హత్యాయత్నం కూడా చేశారని పేర్కొంటూ రఘురామ తాజాగా గుంటూరు జిల్లా నగరం పాలెం పోలీసులకు ఫిర్యాదు చేశారు. అప్పట్లో తనను శారీరకంగా హింసించారని.. రెబ్బరు లాఠీలతో హింసించారని తెలిపారు.
తన సెల్ఫోన్ పర్సనల్ లాక్ నెంబరు చెప్పాలంటూ.. సీఐడీ అప్పటి చీఫ్ సునీల్ కుమార్ తనను కొట్టారని ఫిర్యాదు చేశారు. ఈ సమయంలో తన గుండెలపై కూర్చుని ఊపిరి ఆడకుండా చేశారని.. తనను చంపే ప్రయత్నం చేశారని తెలిపారు. ఈ ఫిర్యాదు నేపథ్యంలో వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.
ఎవరెవరిపై ఫిర్యాదు..?
ఏయే సెక్షన్లు..?
120b, 166, 167, 197, 307, 326, 465, 506 r/w 34 IPCల కింద కేసు నమోదు చేశారు. వీటిలో తీవ్రంగా కొట్టడం, బెదిరించడం, హత్యాయత్నం, నిర్బంధించడం, ఎలాంటి అనుమతి తీసుకోకుండా అదుపులోకి తీసుకోవడం వంటివి ఉన్నాయి.
అప్పట్లో ఏం జరిగింది?
2021లో నరసాపురం వైసీపీ ఎంపీగా ఉన్న రఘురామ వివిధ కారణాలతో వైసీపీతో విభేదించిన విషయం తెలిసిందే. ఈ సమయంలో ఆయనపై విద్వేషపూరిత ప్రసంగాలు, సోషల్ మీడియాలో పోస్టులు, కొన్ని వర్గాల్లో ఉద్రిక్తత సృష్టించడం, ప్రభుత్వ ప్రముఖులపై దాడి వంటి ఆరోపణలతో హైదరాబాద్లో సీఐడీ అదుపులోకి తీసుకుంది. అదే రోజు రాత్రి ఆయనను కస్టడీలో హింసించారనే ఆరోపణలు వచ్చాయి. దీనిపై సుప్రీంకోర్టు విచారణ జరపడం, హైదరాబాద్లోని మిలిటరీ ఆసుపత్రిలో రఘురామకు పరీక్షలు చేయడం తెలిసిందే.
This post was last modified on July 12, 2024 2:11 pm
తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్కు అత్యంత ఆప్తులైన అధికారులు చాలా మంది ఉన్నారు. ఆయన వస్తే.. పొర్లు దండాలు పెట్టినవారు…
తిరుపతికి చెందిన జూనియర్ ఎన్టీఆర్ అభిమాని కౌశిక్ రెండు పదుల వయసులో కూడా లేని స్థితిలో క్యాన్సర్ బారిన పడి…
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఇంట్లో ఉన్న గోశాలకు పండగ వచ్చింది. సుమారు 30 గోవులను ఈ గోశాలలో పెంచు తున్నారు.…
డెబ్యూతోనే సెన్సేషనల్ హిట్ అందుకుని ఆ తర్వాత వరస డిజాస్టర్లతో టాలీవుడ్ మార్కెట్ కోల్పోయిన హీరోయిన్ కృతి శెట్టి మలయాళం…
"తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఓ.. చిట్టినాయుడు. మేం చంద్రబాబు నాయుడితోనే కొట్టాడినం. ఈయనెం త?" అని బీఆర్ ఎస్…
హీరోయిన్గా రెజీనా కసాండ్రా.. ముఖ్య పాత్రల్లో ప్రకాష్ రాజ్, రాజేంద్ర ప్రసాద్, నాజర్, బ్రహ్మానందం, ఆలీ.. ఇంకా చాలామంది ప్రముఖ…