Political News

తిరుమలలో ఇదేం పని?

దేశవ్యాప్తంగా హిందువులు ఎంతో పవిత్రంగా భావించే ఆలయం.. తిరుమల శ్రీ వేంకటేశ్వరుడిది. ఆలయ పవిత్రతను కాపాడడానికి కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేస్తుంటుంది టీటీడీ. ఇందులో భాగంగానే ఆలయ ప్రాంగణంలో ఎక్కడా మొబైల్ ఫోన్లను అనుమతించరు. క్యూ కాంప్లెక్స్‌లలోకి కూడా సెల్ ఫోన్లతో ప్రవేశించడానికి అవకాశం ఉండదు.

అలాంటి చోట్ల కొందరు తమిళ యువకులు వీడియోలు తీసి రీల్స్‌లో పోస్ట్ చేయడం కలకలం రేపుతోంది. తమిళనాడుకు చెందిన యువకుల బృందం.. తాజాగా భద్రత సిబ్బంది కళ్లు గప్పి లోనికి మొబైల్ ఫోన్లు తీసుకెళ్లింది. అంతే కాక నారాయణగిరి ఉద్యాన క్యూ కాంప్లెక్స్ లోపల ప్రాంక్ వీడియోలు కూడా చేసింది. క్యూ కాంప్లెక్స్ గేట్లు తెరిచేస్తున్నట్లుగా జనాలకు భ్రమలు కల్పించి వారిని ఫూల్స్‌ను చేసే ప్రయత్నం చేసింది. ఈ వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.

ఈ ప్రాంక్ వీడియోల వ్యవహారం టీటీడీ దృష్టికి వెళ్లింది. ఈ ఘటనను తీవ్రంగా ఖండించిన టీటీడీ.. ఈ వ్యవహారంపై విజిలెన్స్ విచారణకు ఆదేశించింది. బాధ్యులపై చర్యలు ఉంటాయని హెచ్చరించింది. ఐతే సెల్ ఫోన్ లోపలికి తీసుకెళ్తే దారి మధ్యలోనే సెన్సర్లు కచ్చితంగా గుర్తిస్తాయి. మరి సిబ్బందిని ఎలా బోల్తా కొట్టించి మొబైల్‌ను ఈ ఆకతాయిలు లోనికి తీసుకెళ్లారన్నది ప్రశ్నార్థకం.

మొబైళ్లను క్యూ కాంప్లెక్స్ కంటే ముందే డిపాజిట్ చేశాకే లోనికి వెళ్లాల్సి ఉంటుంది. ఈ ఘటన టీటీడీ భద్రత వైఫల్యాన్ని సూచించేదే. వైసీపీ హయాంలో తిరుమలలో జరిగిన అనేక ఘటనలు వివాదాస్పదమయ్యాయి. కొత్త ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అన్నీ చక్కబెడుతున్న సంకేతాలు వస్తుండగా.. ఇప్పుడీ ఘటన టీటీడీకి, ప్రభుత్వానికి చెడ్డ పేరు తెచ్చింది. దీనిపై టీటీడీ ఎలాంటి చర్యలు చేపడుతుందో చూడాలి.

This post was last modified on July 12, 2024 10:50 am

Share
Show comments
Published by
Satya
Tags: Tirumala

Recent Posts

నియోజ‌క‌వ‌ర్గాల‌పై రేవంత్ కొత్త ఫార్ములా… వ‌ర్కువ‌ట్ అయ్యేనా?

2029 పార్ల‌మెంటు ఎన్నిక‌ల నాటికి దేశంలో నియోజ‌క‌వ‌ర్గాల‌ను పున‌ర్విభ‌జించాల‌ని కేంద్ర ప్ర‌భుత్వం ల‌క్ష్యంగా పెట్టుకున్న విష‌యం తెలిసిందే. ఇటు అసెంబ్లీ,…

2 hours ago

పెను సంక్షోభంలో ప్ర‌పంచం…!

అమెరికా - ఇరాన్ దేశాల మధ్య నెలకొన్న చర్చల ప్రతిష్టంభ‌న ప్రపంచ దేశాలను పెను సంక్షోభంలోకి నెట్టే దిశగా మారుతోందా?…

2 hours ago

రాష్ట్ర‌ప‌తికి బహుమతిగా మంగళగిరి చీర

భార‌త రాష్ట్ర‌ప‌తి ద్రౌప‌దిముర్ముతో ఏపీ మంత్రి, టీడీపీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి నారా లోకేష్ భేటీ అయ్యారు. పార్టీకి చెందిన…

3 hours ago

ఏపీ కొత్త ఎన్నిక‌ల క‌మిష‌న‌ర్‌… వైసీపీకి షాకేనా?

ఏపీ రాష్ట్ర ఎన్నిక‌ల సంఘం క‌మిష‌న‌ర్ ప‌ద‌వి ఖాళీ అయింది. గ‌త నెల 31వ తేదీ వ‌ర‌కు ఉన్న రాష్ట్ర…

3 hours ago

‘హోం’ ప్రశ్నలపై ‘సీఎం’ సమాధానం చెప్తారా?

తెలంగాణలో కీలకమైన హోం శాఖను సీఎం రేవంత్ రెడ్డి తన దగ్గర పెట్టుకున్నారు. శాంతిభద్రతలను ఆయనే పర్యవేక్షిస్తున్నారు. అయితే తరచుగా…

4 hours ago

కేసీఆర్ వరకు వెళ్లిన సీతక్క పంచాయితీ

తెలంగాణలో అధికార పార్టీ కాంగ్రెస్ కు చెందిన మహిళా నేత, సీఎం ఎనుముల రేవంత్ రెడ్డి కేబినెట్ లో కీలక…

5 hours ago