దేశవ్యాప్తంగా హిందువులు ఎంతో పవిత్రంగా భావించే ఆలయం.. తిరుమల శ్రీ వేంకటేశ్వరుడిది. ఆలయ పవిత్రతను కాపాడడానికి కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేస్తుంటుంది టీటీడీ. ఇందులో భాగంగానే ఆలయ ప్రాంగణంలో ఎక్కడా మొబైల్ ఫోన్లను అనుమతించరు. క్యూ కాంప్లెక్స్లలోకి కూడా సెల్ ఫోన్లతో ప్రవేశించడానికి అవకాశం ఉండదు.
అలాంటి చోట్ల కొందరు తమిళ యువకులు వీడియోలు తీసి రీల్స్లో పోస్ట్ చేయడం కలకలం రేపుతోంది. తమిళనాడుకు చెందిన యువకుల బృందం.. తాజాగా భద్రత సిబ్బంది కళ్లు గప్పి లోనికి మొబైల్ ఫోన్లు తీసుకెళ్లింది. అంతే కాక నారాయణగిరి ఉద్యాన క్యూ కాంప్లెక్స్ లోపల ప్రాంక్ వీడియోలు కూడా చేసింది. క్యూ కాంప్లెక్స్ గేట్లు తెరిచేస్తున్నట్లుగా జనాలకు భ్రమలు కల్పించి వారిని ఫూల్స్ను చేసే ప్రయత్నం చేసింది. ఈ వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
ఈ ప్రాంక్ వీడియోల వ్యవహారం టీటీడీ దృష్టికి వెళ్లింది. ఈ ఘటనను తీవ్రంగా ఖండించిన టీటీడీ.. ఈ వ్యవహారంపై విజిలెన్స్ విచారణకు ఆదేశించింది. బాధ్యులపై చర్యలు ఉంటాయని హెచ్చరించింది. ఐతే సెల్ ఫోన్ లోపలికి తీసుకెళ్తే దారి మధ్యలోనే సెన్సర్లు కచ్చితంగా గుర్తిస్తాయి. మరి సిబ్బందిని ఎలా బోల్తా కొట్టించి మొబైల్ను ఈ ఆకతాయిలు లోనికి తీసుకెళ్లారన్నది ప్రశ్నార్థకం.
మొబైళ్లను క్యూ కాంప్లెక్స్ కంటే ముందే డిపాజిట్ చేశాకే లోనికి వెళ్లాల్సి ఉంటుంది. ఈ ఘటన టీటీడీ భద్రత వైఫల్యాన్ని సూచించేదే. వైసీపీ హయాంలో తిరుమలలో జరిగిన అనేక ఘటనలు వివాదాస్పదమయ్యాయి. కొత్త ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అన్నీ చక్కబెడుతున్న సంకేతాలు వస్తుండగా.. ఇప్పుడీ ఘటన టీటీడీకి, ప్రభుత్వానికి చెడ్డ పేరు తెచ్చింది. దీనిపై టీటీడీ ఎలాంటి చర్యలు చేపడుతుందో చూడాలి.
This post was last modified on July 12, 2024 10:50 am
అధికారంలో ఉన్నాం. అయినా మాకు పనులు జరగడం లేదు. అనే వ్యాఖ్యను అనంతపురం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు…
డాలర్లు, మంచి లైఫ్ స్టైల్ కోసం విదేశాలకు వెళ్లాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు. కానీ అక్కడ కొన్నాళ్లు గడిపాక…
వైసీపీ అధినేత జగన్ ఇలానే ఉండాలి అంటూ టీడీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి కారణం రాజకీలంలో ఎవరూ ఎవరినీ దెబ్బతీయరు.…
రాయ్పూర్ వన్డేలో 359 పరుగులు చేసినా టీమిండియా ఓడిపోవడం బిగ్ షాక్ అనే చెప్పాలి. బ్యాటర్లు అదరగొట్టినా, బౌలర్లు చేతులెత్తేయడంతో…
కాసేపు అఖండ 2 విషయం పక్కనపెట్టి నిజంగా ఇలాంటి పరిస్థితి టాలీవుడ్ లో మొదటిసారి చూస్తున్నామా అనే ప్రశ్న వేసుకుంటే…
ఉండవల్లిలోని చంద్రబాబు క్యాంపు కార్యాలయానికి తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి ఈ రోజు వెళ్లారు. తెలంగాణ రైజింగ్ సమిట్కు…