Political News

ఊపిరి పీల్చుకున్న విశాఖ ఉక్కు.. మారిన ప‌రిణామాలు!

రాష్ట్ర వ్యాప్తంగా గ‌త రెండు రోజులుగా క‌ల‌క‌లం రేపిన విశాఖ ఉక్కు క‌ర్మాగారం ప్రైవేటీక‌ర‌ణ అంశానికి దాదాపు తెర‌ప‌డింది. గ‌త రెండేళ్లుగా.. విశాఖ ఉక్కును ప్రైవేటీక‌రించేందుకు మోడీ స‌ర్కారు ప్ర‌య‌త్నిస్తోంద‌న్న వార్త‌లు వ‌చ్చిన విష‌యం తెలిసిందే. దీనిపై పార్ల‌మెంటులోనూ మోడీ ప్ర‌భుత్వం క్లారిటీ ఇచ్చింది. ఎట్టి ప‌రిస్థితిలోనూ విశాఖ ఉక్కును ప్రైవేటీక‌రించి తీరుతామ‌ని చెప్పారు. దీనిపై అప్ప‌ట్లో వైసీపీ స‌ర్కారు లేఖ‌లు రాసి స‌రిపుచ్చింది.

ప్రైవేటీక‌ర‌ణ చేయొద్ద‌ని అప్ప‌టి సీఎం జ‌గ‌న్ లేఖ రాశారు. ఆ త‌ర్వాత కూడా.. కేంద్రం అడుగులు వేగం గానే ప‌డ్డాయి. ఇదిలావుంటే.. కూటమి స‌ర్కారు రావ‌డంతో విశాఖ ఉక్కు ప్రైవేటీక‌ర‌ణ‌కు బ్రేకులు ప‌డ‌తాయ‌ని అంద‌రూ అనుకున్నారు. కానీ ఇంత‌లోనే పెను దుమారం రేగింది. దెక్క‌న్ క్రానిక‌ల్ ప‌త్రిక‌లో దీనికి సంబంధించి వ‌చ్చిన వార్త‌.. రాష్ట్ర వ్యాప్తంగా క‌ల‌కలం రేపింది. సీఎం చంద్ర‌బాబు విశాఖ ఉక్కు ప్రైవేటీక‌ర‌ణ‌కు ఓకే చెప్పార‌న్న‌ది వార్త సారాంశం.

ఇక‌, దీనిపై రాజ‌కీయ ర‌గ‌డ కూడా చోటు చేసుకుంది. అయితే.. దీనిని చంద్ర‌బాబు ఖండించారు. కొంద‌రు దొంగ‌లు చేస్తున్న ప్ర‌చారాన్ని న‌మ్మ‌రాదంటూ.. ఆయ‌న వ్యాఖ్యానించారు. మ‌రో వైపు తాజాగా విశాఖ క‌ర్మాగారంలో ప‌ర్య‌టించిన కేంద్ర భారీ ప‌రిశ్ర‌మ‌ల శాఖ మంత్రి కుమార‌స్వామి కూడా సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేశారు. విశాఖ ఉక్కును ప్రైవేటీక‌రించేది లేద‌న్నారు. దీనిపై ఇప్ప‌టికీ నిర్ణ‌యం తీసుకోలేద‌ని.. ప్రతిపాద‌న అయితే ఉంద‌ని వ్యాఖ్యానించారు.

కానీ.. తాను క్షేత్ర‌స్తాయిలో ప‌ర్య‌టించి కొన్ని విష‌యాలు తెలుసుకున్న మీద‌ట‌.. దీనిని ప్రైవేటీక‌రించ‌కుండా ఆపేందుకు శాయ‌శ‌క్తులా ప్ర‌య‌త్నిస్తాన‌ని చెప్పారు. ఇక్క‌డ జ‌రుగుతున్న ప‌రిణామాల‌ను ప్ర‌ధాని మోడీకి వివ‌రిస్తాన‌ని.. విశాఖ ఉక్కు ఫ్యాక్ట‌రీకి వ‌చ్చిన న‌ష్టం లేద‌న్నారు. ఈ వ్యాఖ్య‌లు విశాఖ ఉక్కు క‌ర్మాగారం కార్మికుల‌కు ఊపిరి లూదింది. మున్ముందు దీనిపై బ‌ల‌మైన ప్ర‌క‌ట‌న వ‌చ్చేలా మంత్రి ఇచ్చిన హామీలు నిజ‌మ‌య్యేలా మోడీ ప్ర‌క‌ట‌న చేసే అవ‌కాశం ఉంది.

This post was last modified on July 12, 2024 7:06 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

ఐపీఎస్ సునీల్.. అలా రిటైర్ కావాల్సిందేనా?

వైసీపీ హయాంలో అప్పటి సీఎం జగన్ కనుసన్నల్లో పనిచేసిన అధికారులు రూల్స్‌ను పక్కన పెట్టి ఇష్టానుసారంగా వ్యవహరించారని ఆరోపణలు ఉన్నాయి.…

6 hours ago

అమరావతిలో కొత్త నిర్ణయం: పేదలకు నష్టం లేకుండా మార్పు

జగన్ హయాంలో తీసుకున్న పలువురు నిర్ణయాలు రాష్ట్రాన్ని వెనక్కి నెట్టాయని, ముఖ్యంగా ఆర్థికంగానే కాకుండా రాజధాని పరంగా కూడా రాష్ట్రానికి…

7 hours ago

మరి కొద్ది గంటల్లో పెళ్లి.. అక్కచెల్లెళ్లు మృతి?

రాజస్థాన్ రాష్ట్రంలోని జోధ్‌పూర్ జిల్లా మనాయ్ గ్రామంలో శనివారం జరగాల్సిన వివాహ కార్యక్రమాలకు కొద్దిగంటల ముందు ఇద్దరు అక్కచెల్లెళ్లు అనుమానాస్పద…

7 hours ago

ప‌వ‌న్‌కు షారుఖ్ రేంజిలో ఇస్తామ‌న్నా..

ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ ప్ర‌క‌ట‌న‌లు చేస్తానంటే ఆయ‌న‌కు భారీ పారితోష‌కం ఇవ్వ‌డానికి బోలెడ‌న్ని కంపెనీలు ముందుకు వ‌స్తాయి. కానీ…

7 hours ago

కోర్టు హీరోయిన్ నెమ్మదిగా నడవాలంట

గత ఏడాది నాని నిర్మించిన కోర్టుతో పరిచయమైన హీరోయిన్ శ్రీదేవి అప్పల అందులో టీనేజ్ కొచ్చిన కాలేజీ అమ్మాయిగా నటనతో…

7 hours ago

సూపర్ 8లో టీమిండియాకు సఫారీ షాక్

టీ20 వరల్డ్ కప్ గ్రూప్ స్టేజ్ లో వరుస విజయాలతో దూసుకువచ్చిన టీమిండియాకు సూపర్ 8 ఆరంభంలోనే ఊహించని ఎదురుదెబ్బ…

8 hours ago