Political News

ఊపిరి పీల్చుకున్న విశాఖ ఉక్కు.. మారిన ప‌రిణామాలు!

రాష్ట్ర వ్యాప్తంగా గ‌త రెండు రోజులుగా క‌ల‌క‌లం రేపిన విశాఖ ఉక్కు క‌ర్మాగారం ప్రైవేటీక‌ర‌ణ అంశానికి దాదాపు తెర‌ప‌డింది. గ‌త రెండేళ్లుగా.. విశాఖ ఉక్కును ప్రైవేటీక‌రించేందుకు మోడీ స‌ర్కారు ప్ర‌య‌త్నిస్తోంద‌న్న వార్త‌లు వ‌చ్చిన విష‌యం తెలిసిందే. దీనిపై పార్ల‌మెంటులోనూ మోడీ ప్ర‌భుత్వం క్లారిటీ ఇచ్చింది. ఎట్టి ప‌రిస్థితిలోనూ విశాఖ ఉక్కును ప్రైవేటీక‌రించి తీరుతామ‌ని చెప్పారు. దీనిపై అప్ప‌ట్లో వైసీపీ స‌ర్కారు లేఖ‌లు రాసి స‌రిపుచ్చింది.

ప్రైవేటీక‌ర‌ణ చేయొద్ద‌ని అప్ప‌టి సీఎం జ‌గ‌న్ లేఖ రాశారు. ఆ త‌ర్వాత కూడా.. కేంద్రం అడుగులు వేగం గానే ప‌డ్డాయి. ఇదిలావుంటే.. కూటమి స‌ర్కారు రావ‌డంతో విశాఖ ఉక్కు ప్రైవేటీక‌ర‌ణ‌కు బ్రేకులు ప‌డ‌తాయ‌ని అంద‌రూ అనుకున్నారు. కానీ ఇంత‌లోనే పెను దుమారం రేగింది. దెక్క‌న్ క్రానిక‌ల్ ప‌త్రిక‌లో దీనికి సంబంధించి వ‌చ్చిన వార్త‌.. రాష్ట్ర వ్యాప్తంగా క‌ల‌కలం రేపింది. సీఎం చంద్ర‌బాబు విశాఖ ఉక్కు ప్రైవేటీక‌ర‌ణ‌కు ఓకే చెప్పార‌న్న‌ది వార్త సారాంశం.

ఇక‌, దీనిపై రాజ‌కీయ ర‌గ‌డ కూడా చోటు చేసుకుంది. అయితే.. దీనిని చంద్ర‌బాబు ఖండించారు. కొంద‌రు దొంగ‌లు చేస్తున్న ప్ర‌చారాన్ని న‌మ్మ‌రాదంటూ.. ఆయ‌న వ్యాఖ్యానించారు. మ‌రో వైపు తాజాగా విశాఖ క‌ర్మాగారంలో ప‌ర్య‌టించిన కేంద్ర భారీ ప‌రిశ్ర‌మ‌ల శాఖ మంత్రి కుమార‌స్వామి కూడా సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేశారు. విశాఖ ఉక్కును ప్రైవేటీక‌రించేది లేద‌న్నారు. దీనిపై ఇప్ప‌టికీ నిర్ణ‌యం తీసుకోలేద‌ని.. ప్రతిపాద‌న అయితే ఉంద‌ని వ్యాఖ్యానించారు.

కానీ.. తాను క్షేత్ర‌స్తాయిలో ప‌ర్య‌టించి కొన్ని విష‌యాలు తెలుసుకున్న మీద‌ట‌.. దీనిని ప్రైవేటీక‌రించ‌కుండా ఆపేందుకు శాయ‌శ‌క్తులా ప్ర‌య‌త్నిస్తాన‌ని చెప్పారు. ఇక్క‌డ జ‌రుగుతున్న ప‌రిణామాల‌ను ప్ర‌ధాని మోడీకి వివ‌రిస్తాన‌ని.. విశాఖ ఉక్కు ఫ్యాక్ట‌రీకి వ‌చ్చిన న‌ష్టం లేద‌న్నారు. ఈ వ్యాఖ్య‌లు విశాఖ ఉక్కు క‌ర్మాగారం కార్మికుల‌కు ఊపిరి లూదింది. మున్ముందు దీనిపై బ‌ల‌మైన ప్ర‌క‌ట‌న వ‌చ్చేలా మంత్రి ఇచ్చిన హామీలు నిజ‌మ‌య్యేలా మోడీ ప్ర‌క‌ట‌న చేసే అవ‌కాశం ఉంది.

Satya

Recent Posts

తెలుగమ్మాయి… హాలీవుడ్‌లో ఇంకాస్త హై లెవెల్

'బ్రహ్మోత్సవం' సినిమాలో చిన్న పాత్రతో కెరీర్ స్టార్ట్ చేసిన అవంతికా వందనపు, ఇప్పుడు అమెరికన్ మెయిన్ స్ట్రీమ్ మీడియాలో తనకంటూ…

1 hour ago

చరణ్ పాప్ కార్న్ పాయింట్ – ఒప్పుకోవాల్సిన లాజిక్కేనా

ఇండస్ట్రీలో ఎప్పటి నుంచో డిబేట్ ఒకటుంది. జనం మునుపటిలా థియేటర్లకు ఎక్కువ సంఖ్యలో ఎందుకు రావడం లేదనేది అందులో మెయిన్…

3 hours ago

షిరిడీ సాయి ఆలయాలకు ‘శ్రీవాణి’ నగదు అవసరం లేదా?

కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామి ఆలయానికి భక్తుల నుంచి భారీ సంఖ్యలో విరాళాలు అందుతున్నాయి. ఈ నిధులతో…

4 hours ago

మార్కెట్ వెలుగుతోంది చూడు లెనిన్

ఇంకో పద్దెనిమిది రోజుల్లో లెనిన్ విడుదల. అక్కినేని అభిమానులు బాగా ఎగ్ జైట్మెంట్ తో ఉన్నారు. ఇప్పటికే పలు వాయిదాలు…

5 hours ago

యూకేలో కొత్త ప్రధాని.. భారత విద్యార్థులపై ప్రభావం ఉంటుందా?

అభివృద్ధి చెందిన దేశాల్లో రాజకీయ స్థిరత్వం ఎక్కువగా ఉంటుందని భావిస్తారు. కానీ గత పదేళ్లుగా యునైటెడ్ కింగ్‌డమ్ పరిస్థితి మాత్రం…

8 hours ago

భాగ్యశ్రీ మాటతో… మళ్ళీ రామ్ ట్రేండింగ్

టాలీవుడ్ స్టార్ రామ్ పోతినేని, యంగ్ హీరోయిన్ భాగ్యశ్రీ బోర్సే మధ్య ప్రేమాయణం నడుస్తోందంటూ గతంలోనే సోషల్ మీడియాలో చాలా…

9 hours ago