రాష్ట్ర వ్యాప్తంగా గత రెండు రోజులుగా కలకలం రేపిన విశాఖ ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణ అంశానికి దాదాపు తెరపడింది. గత రెండేళ్లుగా.. విశాఖ ఉక్కును ప్రైవేటీకరించేందుకు మోడీ సర్కారు ప్రయత్నిస్తోందన్న వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. దీనిపై పార్లమెంటులోనూ మోడీ ప్రభుత్వం క్లారిటీ ఇచ్చింది. ఎట్టి పరిస్థితిలోనూ విశాఖ ఉక్కును ప్రైవేటీకరించి తీరుతామని చెప్పారు. దీనిపై అప్పట్లో వైసీపీ సర్కారు లేఖలు రాసి సరిపుచ్చింది.
ప్రైవేటీకరణ చేయొద్దని అప్పటి సీఎం జగన్ లేఖ రాశారు. ఆ తర్వాత కూడా.. కేంద్రం అడుగులు వేగం గానే పడ్డాయి. ఇదిలావుంటే.. కూటమి సర్కారు రావడంతో విశాఖ ఉక్కు ప్రైవేటీకరణకు బ్రేకులు పడతాయని అందరూ అనుకున్నారు. కానీ ఇంతలోనే పెను దుమారం రేగింది. దెక్కన్ క్రానికల్ పత్రికలో దీనికి సంబంధించి వచ్చిన వార్త.. రాష్ట్ర వ్యాప్తంగా కలకలం రేపింది. సీఎం చంద్రబాబు విశాఖ ఉక్కు ప్రైవేటీకరణకు ఓకే చెప్పారన్నది వార్త సారాంశం.
ఇక, దీనిపై రాజకీయ రగడ కూడా చోటు చేసుకుంది. అయితే.. దీనిని చంద్రబాబు ఖండించారు. కొందరు దొంగలు చేస్తున్న ప్రచారాన్ని నమ్మరాదంటూ.. ఆయన వ్యాఖ్యానించారు. మరో వైపు తాజాగా విశాఖ కర్మాగారంలో పర్యటించిన కేంద్ర భారీ పరిశ్రమల శాఖ మంత్రి కుమారస్వామి కూడా సంచలన ప్రకటన చేశారు. విశాఖ ఉక్కును ప్రైవేటీకరించేది లేదన్నారు. దీనిపై ఇప్పటికీ నిర్ణయం తీసుకోలేదని.. ప్రతిపాదన అయితే ఉందని వ్యాఖ్యానించారు.
కానీ.. తాను క్షేత్రస్తాయిలో పర్యటించి కొన్ని విషయాలు తెలుసుకున్న మీదట.. దీనిని ప్రైవేటీకరించకుండా ఆపేందుకు శాయశక్తులా ప్రయత్నిస్తానని చెప్పారు. ఇక్కడ జరుగుతున్న పరిణామాలను ప్రధాని మోడీకి వివరిస్తానని.. విశాఖ ఉక్కు ఫ్యాక్టరీకి వచ్చిన నష్టం లేదన్నారు. ఈ వ్యాఖ్యలు విశాఖ ఉక్కు కర్మాగారం కార్మికులకు ఊపిరి లూదింది. మున్ముందు దీనిపై బలమైన ప్రకటన వచ్చేలా మంత్రి ఇచ్చిన హామీలు నిజమయ్యేలా మోడీ ప్రకటన చేసే అవకాశం ఉంది.
This post was last modified on July 12, 2024 7:06 am
హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…
అధికారంలో ఉన్న నాయకులు, అధికారంలో లేని నాయకులు ఇలా రెండు వర్గాలుగా విభజించినప్పుడు సాధారణంగా పదవులు పొందిన వారు సంతృప్తి…
మూడు రోజుల తెలుగు వారి పెద్ద పండుగ.. సంక్రాంతి. ఇళ్లకే కాదు.. గ్రామాలకు సైతం శోభను తీసుకువచ్చే సంక్రాంతికి.. కోడి…
ఈ సంక్రాంతికి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించబోతోంది డింపుల్ హయతి. కెరీర్లో ఆమెకు ఇంకా పెద్ద బ్రేక్ రాలేదు. ఇప్పటికే ఖిలాడి,…
బీజేపీ కురువృద్ధ నాయకుడు, దేశ మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు.. ప్రస్తుతం ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పుకొన్నారు. అయితే.. ఆయన…
చుక్క పడందే నిద్ర పట్టని వారు చాలా మంది ఉన్నారు. వీరిలో చిన్న చితకా మందుబాబులను పక్కన పెడితే, మద్యం…