వల్లభనేని వంశీ. ఈ పేరుకు పరిచయం అవసరం లేదు. అసెంబ్లీలోను, బయటా.. అప్పటి ప్రతిపక్ష నాయకుడు, ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబును తీవ్ర స్థాయిలో విమర్శించిన విషయం తెలిసిందే. ఆయన కుటుంబాన్ని కూడా టార్గెట్ చేసిన వారిలో వంశీ కూడా ఉన్నారనే విమర్శలు ఉన్నాయి. 2019లో టీడీపీ తరఫున కృష్ణాజిల్లాలోని గన్నవరం నియోజకవర్గం నుంచి విజయం దక్కించుకున్న వంశీ.. తర్వాత కాలంలో వైసీపీ పంచన చేరి ఆ పార్టీ నాయకులతో కలిసి.. చంద్రబాబును తీవ్రస్థాయిలో విమర్శించారు.
అయితే.. తాజా ఎన్నికల్లో వంశీ గన్నవరం నియోజకవర్గంలో ఓడిపోయిన విషయం తెలిసిందే. అప్పటి నుంచి ఆయన కొన్నాళ్లు విజయవాడ, మరికొన్నాళ్లు గన్నవరంలోనే ఉన్నా.. ఇటీవల రెండు మూడు రోజులుగా ఆయన మిస్సయ్యారని పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. 2021లో టీడీపీ కేంద్ర కార్యాలయంపై దాడి జరిగిన విషయం తెలిసిందే. మంగళగిరిలో కేంద్ర కార్యాలయాన్ని వైసీపీ నాయకులు కొందరు ధ్వంసం చేశారు. అయితే.. ఈ కేసును తాజా కూటమి ప్రభుత్వం రీ-ఓపెన్ చేసింది. ఈ క్రమంలో మాజీ మంత్రి జోగి రమేష్ సహా.. ఇతరనేతలు లేళ్ల అప్పిరెడ్డి, దేవినేని అవినాష్ చౌదరి సహా.. పలువురిపై పోలీసులు కేసు నమోదు చేశారు.
దీంతో వారంతా ఇప్పుడు ముందస్తు బెయిల్ కోసం కోర్టుల చుట్టూ తిరుగుతున్నారు. ఇదిలావుంటే.. టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో వల్లభనేని వంశీని కూడా నిందితుడిగా పేర్కొంటూ పోలీసులు కేసు పెట్టారు. వంశీని 71వ నిందితుడిగా పేర్కొన్నారు. టీడీపీ కార్యాలయంపై దాడికి పాల్పడిన వైసీపీ నాయకుల్లో కొందరిని పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. తాజాగా వంశీ వ్యవహారం కూడా తెరమీదకు వచ్చింది. దీంతో రెండు రోజుల కిందటే ఆయన అజ్ఞాతంలోకి వెళ్లిపోయినట్టు తెలుస్తోంది. విజయవాడ బెంజ్ సర్కిల్ సమీపంలోని ఫ్లాట్కు, గన్నవరంలోని నివాసానికి కూడా తాళాలు వేసి ఉన్నట్టు సమాచారం. దీంతో వంశీ ఎక్కడికి వెళ్లి ఉంటారనే విషయంపై పోలీసులు ఆరా తీస్తున్నారు.
This post was last modified on July 11, 2024 7:19 pm
ముద్రగడ పద్మనాభం సంతాప సభకు హాజరైన అంశంపై టీడీపీ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశంగా…
మాస్ మహారాజా రవితేజ ఇరుముడి మీద మంచి బజ్ ఉంది. గత కొన్ని సినిమాలు ఎంత ఫ్లాప్ అయినా దీని…
తమిళ సినిమాల్లో నంబర్ వన్ స్థాయిలో ఉంటూ రాజకీయాల వైపు అడుగులేసిన విజయ్ సినీ రంగాన్ని ఖాళీ చేస్తూ చేసిన…
మూడు రోజుల క్రితం విడుదలైన చెన్నై లవ్ స్టోరీ మొదటి వీకెండ్ ఘనంగా ముగిసింది. ఊహించిన దానికన్నా వసూళ్లు ఎక్కువే…
ఆ నలుగురు అంటే ఏదో రాజేంద్ర ప్రసాద్ సినిమా అనుకునేరు. ఇది దాని గురించి కాదు. ఇప్పుడు ఇండస్ట్రీలో కొత్త…
మహేష్ బాబు ఫ్యాన్స్ మాత్రమే కాకుండా సగటు తెలుగు సినీ ప్రియులంతా ఎదురు చూస్తున్న క్రేజీ మూవీ వారణాసి. ఆర్ఆర్ఆర్…