పీహెచ్డీ చేసే విద్యార్థులకు గైడ్గా ఉండాలంటే సబ్జెక్టుపై లోతైన అవగాహన, ఎంతో అనుభవం ఉండాలి. అందుకు సరైన అర్హతలు ఉండాలి. కానీ అవేమీ లేకున్నా సరే జగన్ అండ ఉంటే చాలు ఏ పదవి అయినా పట్టేయొచ్చు అనేందుకు ఇది మరో రుజువు. జగన్ అధికారంలో ఉన్నప్పుడు ఆయన కటాక్షం కోసం అధికారులు ఏం చేయాలో అంతా చేశారు. ఆ క్రమంలోనే వైసీపీ మహిళా నాయకురాలు లక్ష్మీపార్వతిని ఏయూ తెలుగు శాఖ ప్రొఫెసర్గానూ నియమించారు. ఎలాంటి అర్హతలు లేకున్నా ఆమెకు ఆ బాధ్యతలు కట్టబెట్టడంతో పాటు చెల్లింపులు కూడా జరిపినట్లు వెలుగులోకి రావడం ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది.
పీహెచ్డీ విద్యార్థులకు గైడ్గా ఉండాలంటే పీజీ విద్యార్థులకు అయిదేళ్ల పాటు బోధించిన అనుభవం ఉండాలి. కానీ ఆ అర్హత లేకుండానే లక్ష్మీపార్వతికి ఏయూ అధికారులు రాచబాట పరిచారు. విశ్వవిద్యాలయంలో పరిశోధన చేసే విద్యార్థుల్లో కొంతమందికి ఆమెను గైడ్గా నియమించారు. ఈ విషయంపై గతంలోనే విద్యార్థులు అప్పటి వీసీ ప్రసాద్రెడ్డికి కంప్లయింట్ చేసినా ఆయన పట్టించుకోలేదని తెలిసింది. పూర్తిగా వైసీపీ పెద్దల ఆదేశాలతోనే నిబంధనలకు విరుద్ధంగా పనిచేసిన ప్రసాద్ రెడ్డి.. లక్ష్మీపార్వతిని గైడ్గా నియమించారు.
పీహెచ్డీ గైడ్గా నియమితురాలైన తర్వాత లక్ష్మీపార్వతి ఆ పోస్ట్కు ఏదైనా న్యాయం చేశారా అంటే అదీ లేదు. ఆమె అందుబాటులో ఉండటం లేదని విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేసినా అప్పటి వీసీ నోరు మెదపలేదని టాక్. ఇతర ఉద్యోగాలు చేస్తూ పరిశోధనలపై ఆసక్తి ఉన్నవాళ్ల కోసం ఏయూలో టీడీఆర్ హబ్ ఏర్పాటు చేశారు. కానీ వైసీపీ అనుకూల ఉద్యోగుల ప్రమోషన్ల కోసం పీహెచ్డీలు పొందేందుకు మాత్రమే ఇది పని చేస్తోందని గతంలో ఆరోపణలు వచ్చాయి.
This post was last modified on July 11, 2024 6:56 pm
నిన్నటివరకు టీవీకే అధ్యక్షుడు, దళపతి విజయ్ ఎవరితో పొత్తు పెట్టుకుంటారని కేవలం తమిళనాట ప్రజలు మాత్రమే కాదు, దక్షిణ భారత…
మెగాస్టార్ చిరంజీవి అభినందన అంటే యువ నటీనటులకు ఒక సర్టిఫికెట్ లాంటిదే. ఐతే ఏదైనా ఈవెంట్లకు వచ్చినపుడు అక్కడున్న వారిని…
సినీ పరిశ్రమలో కాస్టింగ్ కౌచ్ లేదు అని చెప్పలేమని సీనియర్ దర్శక నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ స్పష్టం చేశారు. ఇటీవల…
బరామతి విమాన ప్రమాదంలో దుర్మరణం చెందిన మహారాష్ట్ర డిప్యూటీ ముఖ్యమంత్రి అజిత్ పవార్ స్థానాన్ని ఇప్పుడు ఆయన భార్య సునేత్ర…
తన సొంత నియోజకవర్గం కుప్పాన్ని ప్రయోగశాలగా మార్చనున్నట్టు సీఎం చంద్రబాబు తెలిపారు. తాజాగా శుక్రవారం రాత్రి తన నియోజకవర్గానికి వచ్చిన…
ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణ విషయంలో తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పంతం నెగ్గలేదు. తనను ఎర్రవెల్లిలోని తన ఫామ్…