Political News

మాజీ మంత్రి వ‌ర్సెస్ మ‌హిళా ఎమ్మెల్యే.. కోర్టులో కేసు

అధికారం ఉంద‌నే అహంకారంతో జ‌గ‌న్ అండ్ కో చేసిన అరాచ‌కాలకు జ‌నం ఓటుతో బుద్ధి చెప్పారు. ఏపీ అసెంబ్లీ ఎన్నిక‌ల్లో వైసీపీని పాతాళానికి తొక్కారు. అధికారంలో ఉన్న‌ప్పుడు వైసీపీ నాయ‌కులు కూడా రెచ్చిపోయారు. ప్ర‌త్య‌ర్థి పార్టీల నేత‌ల‌ను ల‌క్ష్యంగా చేసుకుని దాడులు, అస‌భ్య‌క‌ర వ్యాఖ్య‌లు చేశారు. ఇప్పుడు వాట‌న్నింటికీ వైసీపీ నాయ‌కులు మూల్యం చెల్లించుకోక త‌ప్ప‌ని ప‌రిస్థితులు క‌లుగుతున్నాయి. తాజాగా వైసీపీ నేత‌, మాజీ మంత్రి సీద‌రి అప్ప‌ల‌రాజును వ‌దిలేదే లేద‌ని టీడీపీ ఎమ్మెల్యే గౌతు శిరీష న్యాయ పోరాటానికి దిగ‌డం హాట్ టాపిక్‌గా మారింది.

గ‌తంలో సీద‌రి అప్ప‌ల‌రాజు మంత్రిగా ఉన్న‌ప్పుడు ప్ర‌త్యేకంగా 20 మందిని పెట్టి మ‌రీ త‌న‌పైనా, తన తండ్రిపైనా అస‌భ్య‌క‌రంగా మాట్లాడించార‌న్న‌ది శిరీష ప్ర‌ధాన ఆరోప‌ణ‌. త‌న కుటుంబం జోలికి రావ‌డంతో ఈ విష‌యాన్ని చాలా సీరియ‌స్‌గా తీసుకున్నాన‌ని ఆమె చెబుతున్నారు. అందుకే కోర్టును ఆశ్ర‌యించారు. విశాఖ కోర్టులో అప్ప‌ల‌రాజుపై దావా వేశారు. దిగ‌జారుడు వ్యాఖ్య‌లు చేసిన వాళ్ల‌పై కఠిన చ‌ర్య‌లు తీసుకోవాల్సిందేన‌న్నారు. గ‌త అయిదేళ్ల‌లో టీడీపీ మ‌హిళా నాయ‌కులు, కార్య‌క‌ర్త‌ల మీద సోష‌ల్ మీడియాలో అస‌భ్య‌క‌ర పోస్టులు పెట్టి దారుణంగా అవ‌మానించార‌ని శిరీష పేర్కొన్నారు.

రాజ‌కీయ విమ‌ర్శ‌లు హుందాగా ఉండాలి. అధికారంలో ఉన్న పార్టీని ప్ర‌తిప‌క్షాలు ప్ర‌శ్నిస్తాయి. అభివృద్ధి చేయ‌క‌పోతే నిల‌దీస్తాయి. అవినీతికి పాల్ప‌డితే పోరాడ‌తాయి. అలా అని అధికారం ఉంద‌ని ప్ర‌త్య‌ర్థి పార్టీల‌పై క‌క్ష క‌ట్ట‌డం స‌రికాదు. ప్ర‌త్య‌ర్థి పార్టీ నాయ‌కులే ల‌క్ష్యంగా భౌతిక‌, మాన‌సిక దాడులు చేయ‌కూడ‌దు. కానీ ఈ విష‌యం మ‌రిచిన వైసీపీ గ‌త అయిదేళ్ల‌లో ఇష్టారాజ్యంగా వ్య‌వ‌హ‌రించింది. ఇప్పుడు కూట‌మి అధికారంలోకి రావ‌డంతో అలా త‌ప్పుడు మాట‌లు మాట్లాడిన వాళ్ల‌పై, అవినీతికి పాల్ప‌డ్డ వాళ్ల‌పై చ‌ర్య‌లు తీసుకునే దిశ‌గా ప్ర‌భుత్వం క‌స‌ర‌త్తులు చేస్తోంది.

Satya

Recent Posts

గుర్తుకొస్తున్నాయి…: పవన్ ఇంట్రెస్టింగ్ ట్వీట్

పవన్ కళ్యాణ్ స్వయంగా ట్విట్టర్ ఖాతాలో ఈ ఫొటోను పోస్ట్ చేశారు. ఈ ఫొటోలో పవన్ కళ్యాణ్‌తో పాటు కనిపిస్తున్నది…

48 minutes ago

షో క్యాన్సిల్ చేసినందుకు కొరడా దెబ్బ

సోషల్ మీడియాలో ఇప్పుడో టాపిక్ హాట్ డిస్కషన్ గా మారింది. హైదరాబాద్ కు చెందిన ఒక ప్రేక్షకుడు బుక్ మై…

50 minutes ago

సిట్ అదుపులో CI నాగరాజు

ఏపీలో తీవ్ర చర్చనీయాంశంగా మారిన గాదె సాయికృష్ణ అదృశ్యం కేసులో ట్విస్టుల మీద ట్విస్టులు చోటు చేసుకుంటున్నాయి. ఇప్పటికే ఈ…

1 hour ago

వెంటిలేటర్ పై ఉన్న పద్మనాభం గుర్తు లేరా జగన్?

వైసీపీ కీలక నేత, మాజీ మంత్రి, కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం రెడ్డి ప్రస్తుతం వెంటిలేటర్ పై ఉన్నారు.…

2 hours ago

ఓడిన చోటే గెలిచి చూపించింది

శాకుంతలం విడుదలై డిజాస్టరైనప్పుడు దాని ఫలితానికి బాధ్యుడు దర్శకుడు గుణశేఖర్ అయినప్పటికీ టైటిల్ రోల్ పోషించిన సమంత కూడా విమర్శలను…

3 hours ago

చిరు లీక్ చేశాడు… నందిని కన్ఫమ్ చేసింది

మెగాస్టార్ చిరంజీవి సినిమా రహస్యాలను లీక్ చేయడంలో ఫేమస్ అన్న సంగతి తెలిసిందే. ‘ఆచార్య’ సినిమా టైటిల్‌ను అనుకోకుండా రివీల్…

4 hours ago