Political News

మాజీ మంత్రి వ‌ర్సెస్ మ‌హిళా ఎమ్మెల్యే.. కోర్టులో కేసు

అధికారం ఉంద‌నే అహంకారంతో జ‌గ‌న్ అండ్ కో చేసిన అరాచ‌కాలకు జ‌నం ఓటుతో బుద్ధి చెప్పారు. ఏపీ అసెంబ్లీ ఎన్నిక‌ల్లో వైసీపీని పాతాళానికి తొక్కారు. అధికారంలో ఉన్న‌ప్పుడు వైసీపీ నాయ‌కులు కూడా రెచ్చిపోయారు. ప్ర‌త్య‌ర్థి పార్టీల నేత‌ల‌ను ల‌క్ష్యంగా చేసుకుని దాడులు, అస‌భ్య‌క‌ర వ్యాఖ్య‌లు చేశారు. ఇప్పుడు వాట‌న్నింటికీ వైసీపీ నాయ‌కులు మూల్యం చెల్లించుకోక త‌ప్ప‌ని ప‌రిస్థితులు క‌లుగుతున్నాయి. తాజాగా వైసీపీ నేత‌, మాజీ మంత్రి సీద‌రి అప్ప‌ల‌రాజును వ‌దిలేదే లేద‌ని టీడీపీ ఎమ్మెల్యే గౌతు శిరీష న్యాయ పోరాటానికి దిగ‌డం హాట్ టాపిక్‌గా మారింది.

గ‌తంలో సీద‌రి అప్ప‌ల‌రాజు మంత్రిగా ఉన్న‌ప్పుడు ప్ర‌త్యేకంగా 20 మందిని పెట్టి మ‌రీ త‌న‌పైనా, తన తండ్రిపైనా అస‌భ్య‌క‌రంగా మాట్లాడించార‌న్న‌ది శిరీష ప్ర‌ధాన ఆరోప‌ణ‌. త‌న కుటుంబం జోలికి రావ‌డంతో ఈ విష‌యాన్ని చాలా సీరియ‌స్‌గా తీసుకున్నాన‌ని ఆమె చెబుతున్నారు. అందుకే కోర్టును ఆశ్ర‌యించారు. విశాఖ కోర్టులో అప్ప‌ల‌రాజుపై దావా వేశారు. దిగ‌జారుడు వ్యాఖ్య‌లు చేసిన వాళ్ల‌పై కఠిన చ‌ర్య‌లు తీసుకోవాల్సిందేన‌న్నారు. గ‌త అయిదేళ్ల‌లో టీడీపీ మ‌హిళా నాయ‌కులు, కార్య‌క‌ర్త‌ల మీద సోష‌ల్ మీడియాలో అస‌భ్య‌క‌ర పోస్టులు పెట్టి దారుణంగా అవ‌మానించార‌ని శిరీష పేర్కొన్నారు.

రాజ‌కీయ విమ‌ర్శ‌లు హుందాగా ఉండాలి. అధికారంలో ఉన్న పార్టీని ప్ర‌తిప‌క్షాలు ప్ర‌శ్నిస్తాయి. అభివృద్ధి చేయ‌క‌పోతే నిల‌దీస్తాయి. అవినీతికి పాల్ప‌డితే పోరాడ‌తాయి. అలా అని అధికారం ఉంద‌ని ప్ర‌త్య‌ర్థి పార్టీల‌పై క‌క్ష క‌ట్ట‌డం స‌రికాదు. ప్ర‌త్య‌ర్థి పార్టీ నాయ‌కులే ల‌క్ష్యంగా భౌతిక‌, మాన‌సిక దాడులు చేయ‌కూడ‌దు. కానీ ఈ విష‌యం మ‌రిచిన వైసీపీ గ‌త అయిదేళ్ల‌లో ఇష్టారాజ్యంగా వ్య‌వ‌హ‌రించింది. ఇప్పుడు కూట‌మి అధికారంలోకి రావ‌డంతో అలా త‌ప్పుడు మాట‌లు మాట్లాడిన వాళ్ల‌పై, అవినీతికి పాల్ప‌డ్డ వాళ్ల‌పై చ‌ర్య‌లు తీసుకునే దిశ‌గా ప్ర‌భుత్వం క‌స‌ర‌త్తులు చేస్తోంది.

This post was last modified on July 11, 2024 6:52 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

‘బుడగ పేలుతుంది… బంగారం కొనొద్దు’

సెన్సెక్స్ మాదిరి బంగారం ధరలు రాకెట్ వేగంతో దూసుకెళుతున్న వైనం ఇటీవల కాలంలో చోటు చేసుకుంటుంది. ఉదయం ఉన్న ధర…

20 minutes ago

అర్ధరాత్రి అల్లకల్లోలం చేసిన కోహ్లీ

భారత్ క్రికెటర్లలో విరాట్ కోహ్లీకి ఉన్న ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు. ఆఫ్ లైన్ లోనే కాదు…

51 minutes ago

అర‌వింద స‌మేత తరువాత బాధపడ్డ హీరోయిన్

త్రివిక్ర‌మ్ ద‌ర్శ‌క‌త్వంలో వ‌చ్చిన అత్యుత్త‌మమైన‌, విభిన్న‌మైన చిత్రాల్లో అర‌వింద స‌మేత ఒక‌టి. అందులో కీల‌క పాత్ర‌లు పోషించిన ఆర్టిస్టులంద‌రికీ మంచి…

4 hours ago

ఎవ‌రా హీరోయిన్… ద‌ర్శ‌కుడికి మినిస్ట‌ర్ల ఫోన్లు

సీనియ‌ర్ ద‌ర్శ‌కుడు గుణ‌శేఖ‌ర్ కెరీర్లో చూడాల‌ని ఉంది, ఒక్క‌డు లాంటి బ్లాక్‌బ‌స్ట‌ర్ల‌తో పాటు సైనికుడు, వ‌రుడు, నిప్పు లాంటి దారుణ‌మైన…

6 hours ago

10 వేల కెపాసిటీ బ్యాటరీతో ఫోన్ వచ్చేసింది

స్మార్ట్‌ఫోన్ ప్రపంచంలో రియల్‌మీ సరికొత్త రికార్డు సృష్టించింది. గురువారం భారత మార్కెట్లో పీ4 పవర్ 5G ఫోన్‌ను విడుదల చేసింది.…

11 hours ago

వెండి కూడా బంగారానికి చేరువయ్యేలా..

​హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో బంగారం, వెండి ధరలు సరికొత్త రికార్డులను సృష్టిస్తున్నాయి. జనవరి 29 నాటి గణాంకాల ప్రకారం, కేవలం…

12 hours ago