బీఆర్ఎస్ పార్టీలో నెంబర్ 2గా భాసిల్లుతున్న మాజీ మంత్రి కేటీఆర్.. పాదయాత్రకు సిద్ధమవుతున్నారన్న వార్తలు హోరెత్తుతున్నాయి. ఇప్పటికే ప్లాన్ అంతా రెడీ అయిందని.. రోడ్డు మ్యాప్ కూడా రెడీ అయిందని బీఆర్ఎస్ వర్గాల్లో చర్చసాగుతోంది. అన్నీ కుదిరితే వచ్చే శ్రావణ మాసం నుంచే మాజీ మంత్రి కేటీఆర్ పాదయాత్రకు రెడీ అవుతారని తెలుస్తోంది. బాసర లోని సరస్వతీ ఆలయం నుంచి ఆయన పాదయాత్ర ప్రారంభించనున్నారని.. రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి జిల్లా, ప్రతి మండలం, ప్రతి గ్రామం మీదుగా.. ఆయన పాదయాత్ర సాగనుందని తెలుస్తోంది.
కేటీఆర్ చేపట్టనున్న సుదీర్ఘ పాదయాత్ర వచ్చే మూడున్నరేళ్లపాటు నిర్విఘ్నంగా సాగుతుందని కూడా బీఆర్ఎస్ వర్గాల నుంచి వినిపిస్తున్న మాట. ఈ యాత్ర బాసరతో ప్రారంభమై.. భద్రాద్రిలోని రామయ్య ఆలయం వద్ద ముగుస్తుందని.. ఈ మేరకు రోడ్డు మ్యాప్ను కూడా రెడీ చేస్తున్నారని సమాచారం. ఈ క్రమంలో ప్రతి వర్గాన్ని, ప్రతి కులాన్నీ.. తెలంగాణలోని అన్ని వర్గాలను కూడా కేటీఆర్ కలుస్తారని తెలిసింది. ప్రభుత్వ వైఫల్యాలు, ప్రజల కష్టాలను ఆయన పంచుకోనున్నట్టు సమాచారం. వచ్చే 2028 ఎన్నికల నాటికి క్షేత్రస్థాయిలో పార్టీని బలోపేతం చేయడంతోపాటు.. పార్టీని అదికారంలోకి తీసుకురావడమే లక్ష్యంగా “అడుగులు” పడతాయని అంటున్నారు.
అసలు లక్ష్యాలు ఇవీ!
ఊరకరారు.. మహాను భావులు.. అన్నట్టుగానే కేటీఆర్ కూడా ఊరికేనే ఈ యాత్ర చేపడుతున్నట్టు కనిపించడం లేదు. వచ్చే మూడున్నరేళ్లలో ఆయన పార్టీని బలోపేతం చేయాలని నిర్ణయించుకున్నారనేది పైకి కనిపిస్తున్న లక్ష్యమే. కానీ, వాస్తవ లక్ష్యం వేరేగా ఉందని పరిశీలకులు అంచనా వేస్తున్నారు. పార్టీ పగ్గాల విషయంలో తనకు అడ్డంకిగా ఉన్న హరీష్రావును పక్కకు తప్పించే వ్యూహం ఉండి ఉంటుందని సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం కేసీఆర్ వయసు ముదురుతోంది. మహా అయితే.. మరో నాలుగేళ్లు ఆయన యాక్టివ్గా ఉంటారు.
తర్వాత కేసీఆర్ను వృద్ధాప్య సమస్యలు వెంటాడుతాయి. దీంతో పార్టీ పగ్గాలను వదులుకోవాలి. ఈ విషయంలో హరీష్రావు.. పోటీగా ఉన్నారు. ఈ నేపథ్యంలోనే కేటీఆర్.. చాలా వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారనేది పరిశీలకుల మాట. మరోవైపు స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీని బలోపేతం చేయడం కూడా.. ఆయన ముందున్న ప్రధాన కర్తవ్యం. అలానే.. ఇప్పటి వరకు గ్రూపులను ప్రోత్సహించారన్న అపప్రదను ఎదుర్కొన్న కేటీఆర్.. ఇప్పుడు అందరికీ చేరువ అవ్వాలనేది కూడా.. మరో కీలక వ్యవహారం. అందుకే ఉభయ కుశలోపరిగా ఆయన పాదయాత్రను ఎంచుకున్నారని.. ఇవన్నీ.. కనిపించని లక్ష్యాలని అంటున్నారు పరిశీలకులు.
This post was last modified on July 11, 2024 9:55 am
కూటమిలో భాగస్వామి అయిన జనసేన పార్టీ ఎమ్మెల్యే పనితీరుపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అసంతృప్తి వ్యక్తం చేశారు. పనితీరు బాగోలేని…
ఏపీ వాసులకు బీపీ పెరిగిపోతుంది.. దాంతోపాటు మధుమేహ వ్యాధి కూడా..! రాష్ట్రంలో అసంక్రమిత వ్యాధులను ముందుగానే గుర్తించి సకాలంలో చికిత్స…
సినిమా షూటింగ్ లో భాగంగా ఆర్టిస్టులు కొన్నిసార్లు రిస్కీ స్టంట్లు చెయ్యాల్సి ఉంటుంది. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా సరే కొన్నిసార్లు…
తెలంగాణా కాంగ్రెస్ పార్టీ నాయకులు ఒక్కొక్కరే ఢిల్లీకి చేరుకుంటున్నారు. కొండా సురేఖ కూతురు సుస్మిత కామెంట్స్ పెట్టిన చిచ్చు, చిన్నారెడ్డి…
సెన్సార్ విషయంలో నానా ఇబ్బందులు పడిన రంభ ఊర్వశి మేనక ఎట్టకేలకు అడ్డంకిని తొలగించుకుని యు/ఏ సర్టిఫికెట్ తో సెప్టెంబర్…
వందో సినిమా సంబరానికి రెడీ అవుతున్న నాగార్జున కింగ్ 100 కోసం అభిమానులు పిచ్చ వెయిటింగ్ లో ఉన్నారు. నా…