ఏపీ ఎన్నికల్లో అధికార వైసీపీ ఘోర పరాజయం పాలయింది. సార్వత్రిక ఎన్నికలు ఫలితాలు వెలువడ్డ నెల రోజుల తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో పార్టీకి వ్యతిరేకంగా పనిచేసిన వారిపై తొలి వేటు వేసింది.
శ్రీ సత్యసాయి జిల్లా కదిరి నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే డాక్టర్ పీవీ సిద్ధారెడ్డిని పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడి పార్టీ అభ్యర్థి ఓటమికి కారణం అయ్యాడని సస్పెన్షన్ వేటు వేసింది. కదిరి శాసనసభ స్థానం నుండి పీవీ సిద్దారెడ్డి 2019 ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి కందికుంట వెంకట ప్రసాద్ పై 27 వేల మెజారిటీతో విజయం సాధించాడు. అయితే ఈ ఎన్నికల్లో సిద్దారెడ్డికి వైసీపీ టికెట్ నిరాకరించింది.
ఈ ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థిగా బీఎస్ మక్బూల్ ను బరిలోకి దించింది. సిద్దారెడ్డి పార్టీకి వ్యతిరేకంగా పనిచేయడంతో టీడీపీ అభ్యర్థి కందికుంట వెంకట ప్రసాద్ కేవలం 6265 ఓట్ల అత్యల్ప మెజారిటీతో విజయం సాధించాడు. ఈ మేరకు సిద్దారెడ్డి టీడీపీకి అనుకూలంగా పనిచేశాడని ఫిర్యాదులు రావడంతో వైసీపీ అధిష్టానం సస్పెన్షన్ నిర్ణయం తీసుకుంది. 2014 ఎన్నికల్లోనూ కదిరి స్థానం నుండి వైసీపీ అభ్యర్థి అత్తర్ చాంద్ బాషా టీడీపీ అభ్యర్థి కందికుంటను ఓడించడం గమనార్హం.
తప్పు చేసింది కేంద్ర ప్రభుత్వం. తన తప్పును ఏమాత్రం పట్టించుకోని కేంద్రం… విద్యార్థులు చేసిన చిన్నపాటి తప్పులకూ పెద్ద శిక్షలేసింది.…
ఇటీవలే విడుదలైన బాలీవుడ్ మూవీ 'మై వాపస్ ఆవుంగా'కు తొలి రోజు రివ్యూలు ఏమంత ఆశాజనకంగా లేవు. పబ్లిక్ టాక్…
సాయిధరమ్ తేజ్ హీరోగా రెండేళ్ల ముందు మొదలైన సినిమా.. సంబరాల యేటిగట్టు. తన మార్కెట్ స్థాయికి మించి పెద్ద బడ్జెట్లో…
పెద్ది మొదటి రెండు వారాలు బాగా సందడి చేసి కలెక్షన్ల వర్షం కురిపించాక మళ్ళీ దాన్ని కొనసాగించే సినిమా ఏది…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కెరీర్లో ‘ఉస్తాద్ భగత్ సింగ్’యే చివరి చిత్రం అవుతుందనే అంచనాలు కలిగాయి ఒక దశలో.…
తెలుగు రాష్ట్రాలకు చెందిన విద్యార్థులు, యువ ఉద్యోగుల మరణ వార్తలు అమెరికా నుంచి వరుసగా వస్తుండటం ఆందోళన కలిగిస్తోంది. రోడ్డు…