Political News

ఎన్నికల తర్వాత వైసీపీలో తొలివేటు !

ఏపీ ఎన్నికల్లో అధికార వైసీపీ ఘోర పరాజయం పాలయింది.  సార్వత్రిక ఎన్నికలు ఫలితాలు వెలువడ్డ నెల రోజుల తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో పార్టీకి వ్యతిరేకంగా పనిచేసిన వారిపై తొలి వేటు వేసింది.

శ్రీ సత్యసాయి జిల్లా కదిరి నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే డాక్టర్ పీవీ సిద్ధారెడ్డిని పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడి పార్టీ అభ్యర్థి ఓటమికి కారణం అయ్యాడని సస్పెన్షన్ వేటు వేసింది. కదిరి శాసనసభ స్థానం నుండి పీవీ సిద్దారెడ్డి 2019 ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి కందికుంట వెంకట ప్రసాద్ పై 27 వేల మెజారిటీతో విజయం సాధించాడు. అయితే ఈ ఎన్నికల్లో సిద్దారెడ్డికి వైసీపీ టికెట్ నిరాకరించింది.

ఈ ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థిగా బీఎస్ మక్బూల్ ను బరిలోకి దించింది. సిద్దారెడ్డి పార్టీకి వ్యతిరేకంగా పనిచేయడంతో టీడీపీ అభ్యర్థి కందికుంట వెంకట ప్రసాద్ కేవలం 6265 ఓట్ల అత్యల్ప మెజారిటీతో విజయం సాధించాడు. ఈ మేరకు సిద్దారెడ్డి టీడీపీకి అనుకూలంగా పనిచేశాడని ఫిర్యాదులు రావడంతో వైసీపీ అధిష్టానం సస్పెన్షన్ నిర్ణయం తీసుకుంది. 2014 ఎన్నికల్లోనూ కదిరి స్థానం నుండి వైసీపీ అభ్యర్థి అత్తర్ చాంద్ బాషా టీడీపీ అభ్యర్థి కందికుంటను ఓడించడం గమనార్హం.

This post was last modified on July 10, 2024 11:09 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

శృతి లాగే శ్రీలీల.. పవన్ హిట్ ఇస్తాడా?

​టాలీవుడ్ సెన్సేషన్ శ్రీలీల ప్రస్తుతం కెరీర్ పరంగా గడ్డు కాలాన్ని ఎదుర్కొంటోంది. 'ధమాకా' సినిమాతో ఓ రేంజ్ క్రేజ్ సంపాదించుకున్న…

19 minutes ago

అమరన్ హీరోకి మిగలని ఆనందం

మొన్న ఏడాది దీపావళికి వచ్చిన డబ్బింగ్ మూవీ అమరన్ ఇక్కడ లక్కీ భాస్కర్, క పోటీని తట్టుకుని మరీ సూపర్…

2 hours ago

సంక్రాంతి వేళ అయినా… సమస్యలపై సీఎం అలర్ట్

సంక్రాంతికి సొంత ఊరిలో గడిపేందుకు సీఎం చంద్రబాబు నాయుడు కుటుంబం నారావారి పల్లెకు చేరుకుంది. దాదాపు నాలుగు రోజులపాటు ఆయన…

3 hours ago

నాన్నమ్మ గారికి పెద్ద బ్యాక్ గ్రౌండ్ ఉంది

ఇటీవలే విడుదలైన సంక్రాంతి సినిమాలు ది రాజా సాబ్, మన శంకరవరప్రసాద్ గారులో ప్రభాస్ కు నాన్నమ్మగా, చిరంజీవికి తల్లిగా…

3 hours ago

తొలి బంతికి సిక్సర్ కొట్టేశారు

మన శంకరవరప్రసాద్ గారు బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతోంది. నిర్మాణ సంస్థ అధికారికంగా ప్రకటించిన దాని ప్రకారం మొదటి రోజు ప్రీమియర్లతో…

4 hours ago

`చ‌లానా` పడిందా… బ్యాంక్ నుండి మనీ కట్

వాహ‌న‌దారుల‌కు షాకిచ్చేలా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కీల‌క నిర్ణ‌యం తీసుకున్నారు. ర‌హ‌దారుల‌పై ట్రాఫిక్ రూల్స్‌కు విరుద్ధంగా వాహ‌నాలు న‌డుపుతూ..…

5 hours ago