Political News

జ‌గ‌న్ మ‌ళ్లీ గెలిచి ఉంటే.. 17 వేల కోట్లు వేసేసేవారా?

వైసీపీ ప్రభుత్వ 2019 – 24 మధ్య కాలంలో విద్యుత్ ను అడ్డు పెట్టుకుని ప్ర‌జ‌ల ర‌క్తం పీల్చింద‌ని ప్ర‌స్తుత ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు అన్నారు. తాజాగా ఆయ‌న విద్యుత్ రంగంపై శ్వేతపత్రం విడుదల చేశారు. ఈ సంద‌ర్భంగా జ‌గ‌న్ హ‌యాంలో విద్యుత్ చార్జీల పెంపు, ఏయే రూపంలో ఎలాంటి భారం మోపారు? ఎంత మేర‌కు నిధులు రాబ‌ట్టారు? అనే కీల‌క విష‌యాల‌ను చంద్ర‌బాబు వివ‌రించారు. గత 5 ఏళ్లలో… 9 సార్లు విద్యుత్ చార్జీలు పెంచి ప్రజలను బాదేశార‌ని చంద్ర‌బాబు వ్యాఖ్యానించారు. త‌మ హ‌యాంలో 2014-19 మ‌ధ్య విద్యుత్ చార్జీల‌ను ఒక్క‌సారి కూడా పెంచ‌లేద‌ని చెప్పారు.

జ‌గ‌న్ పెంచిన విధానం ఇదీ..

టారిఫ్ పెంపు పేరుతో రూ.16,699 కోట్లు రాబ‌ట్టారు. ట్రూఅప్ / ఫ్యూయల్ సర్ ఛార్జ్ పేర.. 5,886 కోట్లు, మ‌రోసారి ట్రూఅప్ చార్జీలు అంటూ… 3,977 కోట్లు, ఎలక్ట్రిసిటీ డ్యూటీ పేరుతో 5,604 కోట్లు, ఇలా మొత్తం.. రూ.32,166 కోట్లు ప్రజల నుంచి విద్యుత్ చార్జీల రూపంలో రాబ‌ట్టిన‌ట్టు గ‌ణాంకాల‌తో స‌హా చంద్ర‌బాబు వివ‌రించారు. 2019 వరకూ యూనిట్‌ రూ.3.87పైగా ఉన్న సగటు విద్యుత్ చార్జీలను… రూ.5.83 పెంచార‌ని చంద్ర‌బాబు చెప్పారు. అంటే 45 శాతం అధికంగా పెంచేశారని, దీంతో ప్ర‌జ‌ల‌కు విద్యుత్ స్విచ్ వేయాలంటేనే షాక్ కొట్టింద‌ని చంద్ర‌బాబు చెప్పారు.

78 నుంచి 98 శాతం మంది పేద వినియోగదారులపై చార్జీల భారం మోపార‌ని సీఎం చంద్ర‌బాబు విమ‌ర్శించారు. ప్ర‌స్తుత‌ 2023-24 ఆర్ధిక సంవత్సరానికి.. ట్రూఅప్/ ఫ్యూయల్ సర్ ఛార్జ్ పేరిట రూ.17,137 కోట్ల భారం మోపేందుకు అన్నీ సిద్ధం చేసిన‌ట్టు వివ‌రించారు. వైసీపీ అధికారంలోకి వచ్చి ఉంటే… ఈ 17,137 కోట్లు కూడా ప్రజల నుండి బాదేసేవారని చంద్ర‌బాబు త‌న శ్వేత ప‌త్రంలో వివ‌రించారు. కానీ, ప్ర‌జ‌లు విజ్ఞ‌త‌తో ఆలోచించి కూట‌మిని గెలిపించార‌ని తెలిపారు. తాము ఎన్నిక‌ల‌కు ముందు ఇచ్చిన హామీ మేర‌కు విద్యుత్ చార్జీల‌ను పెంచ‌బోమ‌ని చంద్ర‌బాబు చెప్పారు. అయితే.. ప్ర‌స్తుతం ఉన్న ధ‌ర‌ల‌ను ఎలా త‌గ్గించాల‌నే విష‌యంపై త్వ‌ర‌లోనే నిర్ణ‌యం తీసుకుంటామ‌న్నారు.

This post was last modified on July 9, 2024 9:36 pm

Share

Recent Posts

నాని సినిమా… సూపర్ స్ట్రాటజీ

యుఎస్‌లో పెద్ద పెద్ద స్టార్లను మించి మంచి మార్కెట్ సంపాదించుకున్న హీరో.. నాని. హీరోగా తొలి అడుగులు వేస్తున్న రోజుల్లోనే…

4 hours ago

అవును… సోనియా పుస్త‌కం ప్ర‌చురించం!

కాంగ్రెస్‌పార్టీ మాజీ అధ్య‌క్షురాలు, ప్ర‌స్తుత రాజ్య‌స‌భ స‌భ్యురాలు సోనియా గాంధీ రాసిన ఆత్మక‌థ ..పుస్త‌కం ముద్రణ వ్య‌వ‌హారం వివాదంగా మారింది.…

6 hours ago

సెప్టెంబర్ బోణీ వారం… పోటీ రసవత్తరం

ఆగస్ట్ అయిపోతోంది. ఎన్ని సినిమాలు రిలీజైనా ఇరుముడినే క్లియర్ విన్నర్ గా నిలిచి రికార్డుల భరతం పట్టేసింది. విశ్వనాథ్ అండ్…

6 hours ago

మీ ఫిజిక‌ల్ హెల్ప్ వ‌ద్దు… డ‌బ్బుంటే ఇవ్వండి!

ఆక‌స్మిక ప్ర‌చండ వ‌ర‌ద‌ల‌తో అత‌లాకుత‌ల‌మైన నేపాల్ తాజాగా ప్ర‌పంచ దేశాల‌ను ఉద్దేశించి కీల‌క ప్ర‌క‌ట‌న చేసింది. ``భౌతికంగా మీరు మాకు…

6 hours ago

‘ఇరుముడి’లో చరణ్… రూమర్‌ను నిజం చేద్దామని

ఈ మధ్య కాలంలో టాలీవుడ్ బాక్సాఫీస్‌లో అతి పెద్ద సంచలనం ‘ఇరుముడి’ సినిమానే అని చెప్పాలి. ఈ సినిమా రేంజికి…

7 hours ago

కన్నడిగుల ఆక్రోశం అర్థరహితం

సినిమా బాగుంటే భాషా భేదం లేకుండా తెలుగు ప్రేక్షకులు ఎలా ఆదరిస్తారో కొత్తగా చెప్పాల్సిన పని లేదు. ఇందుకు చరిత్రలో…

7 hours ago