Political News

జ‌గ‌న్ మ‌ళ్లీ గెలిచి ఉంటే.. 17 వేల కోట్లు వేసేసేవారా?

వైసీపీ ప్రభుత్వ 2019 – 24 మధ్య కాలంలో విద్యుత్ ను అడ్డు పెట్టుకుని ప్ర‌జ‌ల ర‌క్తం పీల్చింద‌ని ప్ర‌స్తుత ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు అన్నారు. తాజాగా ఆయ‌న విద్యుత్ రంగంపై శ్వేతపత్రం విడుదల చేశారు. ఈ సంద‌ర్భంగా జ‌గ‌న్ హ‌యాంలో విద్యుత్ చార్జీల పెంపు, ఏయే రూపంలో ఎలాంటి భారం మోపారు? ఎంత మేర‌కు నిధులు రాబ‌ట్టారు? అనే కీల‌క విష‌యాల‌ను చంద్ర‌బాబు వివ‌రించారు. గత 5 ఏళ్లలో… 9 సార్లు విద్యుత్ చార్జీలు పెంచి ప్రజలను బాదేశార‌ని చంద్ర‌బాబు వ్యాఖ్యానించారు. త‌మ హ‌యాంలో 2014-19 మ‌ధ్య విద్యుత్ చార్జీల‌ను ఒక్క‌సారి కూడా పెంచ‌లేద‌ని చెప్పారు.

జ‌గ‌న్ పెంచిన విధానం ఇదీ..

టారిఫ్ పెంపు పేరుతో రూ.16,699 కోట్లు రాబ‌ట్టారు. ట్రూఅప్ / ఫ్యూయల్ సర్ ఛార్జ్ పేర.. 5,886 కోట్లు, మ‌రోసారి ట్రూఅప్ చార్జీలు అంటూ… 3,977 కోట్లు, ఎలక్ట్రిసిటీ డ్యూటీ పేరుతో 5,604 కోట్లు, ఇలా మొత్తం.. రూ.32,166 కోట్లు ప్రజల నుంచి విద్యుత్ చార్జీల రూపంలో రాబ‌ట్టిన‌ట్టు గ‌ణాంకాల‌తో స‌హా చంద్ర‌బాబు వివ‌రించారు. 2019 వరకూ యూనిట్‌ రూ.3.87పైగా ఉన్న సగటు విద్యుత్ చార్జీలను… రూ.5.83 పెంచార‌ని చంద్ర‌బాబు చెప్పారు. అంటే 45 శాతం అధికంగా పెంచేశారని, దీంతో ప్ర‌జ‌ల‌కు విద్యుత్ స్విచ్ వేయాలంటేనే షాక్ కొట్టింద‌ని చంద్ర‌బాబు చెప్పారు.

78 నుంచి 98 శాతం మంది పేద వినియోగదారులపై చార్జీల భారం మోపార‌ని సీఎం చంద్ర‌బాబు విమ‌ర్శించారు. ప్ర‌స్తుత‌ 2023-24 ఆర్ధిక సంవత్సరానికి.. ట్రూఅప్/ ఫ్యూయల్ సర్ ఛార్జ్ పేరిట రూ.17,137 కోట్ల భారం మోపేందుకు అన్నీ సిద్ధం చేసిన‌ట్టు వివ‌రించారు. వైసీపీ అధికారంలోకి వచ్చి ఉంటే… ఈ 17,137 కోట్లు కూడా ప్రజల నుండి బాదేసేవారని చంద్ర‌బాబు త‌న శ్వేత ప‌త్రంలో వివ‌రించారు. కానీ, ప్ర‌జ‌లు విజ్ఞ‌త‌తో ఆలోచించి కూట‌మిని గెలిపించార‌ని తెలిపారు. తాము ఎన్నిక‌ల‌కు ముందు ఇచ్చిన హామీ మేర‌కు విద్యుత్ చార్జీల‌ను పెంచ‌బోమ‌ని చంద్ర‌బాబు చెప్పారు. అయితే.. ప్ర‌స్తుతం ఉన్న ధ‌ర‌ల‌ను ఎలా త‌గ్గించాల‌నే విష‌యంపై త్వ‌ర‌లోనే నిర్ణ‌యం తీసుకుంటామ‌న్నారు.

This post was last modified on July 9, 2024 9:36 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

రాజా సాబ్ ను లైట్ తీసుకున్న‌ హిందీ ఆడియ‌న్స్

బాహుబ‌లి, బాహుబ‌లి-2 చిత్రాల‌తో దేశ‌వ్యాప్తంగా తిరుగులేని ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్ సంపాదంచుకున్నాడు ప్ర‌భాస్. ఇదంతా రాజ‌మౌళి పుణ్యం అంటూ కొంద‌రు…

2 hours ago

వింటేజ్ మెగాస్టార్ బయటికి వచ్చేశారు

చాలా గ్యాప్ తర్వాత చిరంజీవి సినిమాకు సోషల్ మీడియాలో విపరీతమైన పాజిటివ్ వైబ్స్ కనిపిస్తున్నాయి. ప్రీమియర్లతో విడుదలైన మన శంకరవరప్రసాద్…

2 hours ago

సంక్రాంతిలో శర్వా సేఫ్ గేమ్

సంక్రాంతి అంటేనే సినిమాల పండగ. ఈసారి బాక్సాఫీస్ వద్ద రద్దీ మామూలుగా లేదు. ప్రభాస్ 'రాజా సాబ్', మెగాస్టార్ 'MSG'…

3 hours ago

‘నదీ తీర ప్రాంతంలో ఉన్న తాడేపల్లి ప్యాలెస్ మునిగిందా?’

వరద భయం లేకుండా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అమరావతి నగరాన్ని నిర్మిస్తున్నట్లు కూటమి ప్రభుత్వం హామీ ఇస్తోంది. మరోవైపు అమరావతి…

4 hours ago

ఇలాంటి సీక్వెన్స్ ఎలా తీసేశారు సాబ్‌?

మూడేళ్ల‌కు పైగా టైం తీసుకుని, 400 కోట్ల‌కు పైగా బ‌డ్జెట్ పెట్టి తీసిన సినిమా.. రాజాసాబ్. కానీ ఏం లాభం?…

5 hours ago

రామ్ దెబ్బ తిన్నాడు… మరి రవితేజ?

హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…

7 hours ago