వైసీపీ నాయకులు ఏమయ్యారు? ఎక్కడున్నారు? తమ పార్టీ పేరులోనే ఉన్న ‘వైఎస్సార్’ 75వ జయంతి రోజును పురస్కరించుకుని వారు ఏం చేస్తున్నారు? అంటే.. కేవలం ప్రశ్నలు తప్ప.. సమాధానాలు కనిపించడం లేదు. వినిపించడమూ లేదు. కేవలం తిరుపతి, శ్రీకాళహస్తి ప్రాంతాల్లో మాత్రమే పార్టీ నాయకులు బయటకు వచ్చి..రాజన్న చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళుర్పించారు. ఇతర ప్రాంతాల్లో మాత్రం ఎక్కడా ఏ నాయకుడూ.. అసలు వైఎస్ గురించి పట్టించుకున్న పరిస్థితి కూడా కనిపించలేదు.
వైఎస్సార్కు వీరాభిమానినని.. ఆయన సీఎంగా ఉన్నప్పుడు.. తనను ప్రత్యేకంగా పిలిచి వెంట బెట్టుకుని తిరిగారని చెప్పుకొన్న మాజీ మంత్రి కొడాలి నాని కూడా ఎక్కడా వైఎస్సార్ జయంతిని నిర్వహించలేదు. ఇక, వైఎస్ పేరును చేతిపై పచ్చ వేయించుకున్న మాజీ డిప్యూటీ సీఎం పుష్ప శ్రీవాణి కూడా ఎక్కడా కనిపించలేదు, ఇక, వైఎస్తో అనుబంధం ఉన్న ఒకప్పటి కాంగ్రెస్ నాయకులు, ఇప్పుడు వైసీపీ నేతలుగా ఉన్న వారు కూడా ఎవరూ రియాక్ట్ కావడం లేదు. దీంతో వైఎస్ జయంతి ఏపీలో ఒక్క కడప, తిరుపతి, శ్రీకాళహస్తి, అనంతపురం వంటి నగరాలకు మాత్రమే పరిమితమైంది.
గతంలో..
గత ఐదేళ్లపాటు.. వైఎస్ జయంతి(జూలై 8)ని రాష్ట్ర ప్రభుత్వం ఘనంగా నిర్వహించింది. ‘రైతు దినోత్సవం’ పేరుతో ఊరూ వాడా ఘనంగా నిర్వహించింది. ఆదర్శ రైతులకు బహుమతులు కూడా ఇచ్చి ప్రోత్సహించారు. అదేవిధంగా రైతులకు ఇన్ పుట్ సబ్సిడీని కూడా అందించారు. ఇలా ఐదేళ్ల పాటు ఘనంగా నిర్వహించిన వైఎస్ జయంతిపై తాజా ఎన్నికల ఎఫెక్ట్ భారీగా పడింది. వైసీపీ ఈ ఎన్నికల్లో చిత్తుగా ఓడి పోవడంతో నాయకులు కూడా అడ్రస్ లేకుండా పోయారు. మరి పార్టీ పని అయిపోయిందని అనుకున్నారో.. లేక వైఎస్ జయంతి అవసరం లేదనుకున్నారో.. మొత్తానికి కరడు గట్టిన వైఎస్ అభిమానులు కూడా మౌనంగా ఉండిపోవడం గమనార్హం.
This post was last modified on July 8, 2024 2:47 pm
పవన్ కళ్యాణ్ కొత్త సినిమా నుంచి పాట వస్తోందంటే అభిమానులకు ఎక్కడ లేని హుషారు పుట్టుకొస్తుంది. అందులోనూ గబ్బర్ సింగ్…
నెల్లూరు పార్లమెంటు సభ్యుడు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి వ్యవహారం వైసీపీలో హాట్ టాపిక్గా మారింది. ఇటీ వల వేమిరెడ్డి ప్రభాకర్రెడ్డి,…
వైసీపీ హయాంలో అప్పటి సీఎం జగన్ కనుసన్నల్లో పనిచేసిన అధికారులు రూల్స్ను పక్కన పెట్టి ఇష్టానుసారంగా వ్యవహరించారని ఆరోపణలు ఉన్నాయి.…
జగన్ హయాంలో తీసుకున్న పలువురు నిర్ణయాలు రాష్ట్రాన్ని వెనక్కి నెట్టాయని, ముఖ్యంగా ఆర్థికంగానే కాకుండా రాజధాని పరంగా కూడా రాష్ట్రానికి…
రాజస్థాన్ రాష్ట్రంలోని జోధ్పూర్ జిల్లా మనాయ్ గ్రామంలో శనివారం జరగాల్సిన వివాహ కార్యక్రమాలకు కొద్దిగంటల ముందు ఇద్దరు అక్కచెల్లెళ్లు అనుమానాస్పద…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రకటనలు చేస్తానంటే ఆయనకు భారీ పారితోషకం ఇవ్వడానికి బోలెడన్ని కంపెనీలు ముందుకు వస్తాయి. కానీ…