Political News

ప్ర‌జా సేవ‌లో త‌న‌ను తాను మ‌రిచి.. మంత్రిగారి మంచిత‌నం..!

“సార్ మీరు మంత్రిగారండి. మర్చిపోతున్నారా”! పాలకొల్లు నియోజకవర్గంలో వినిపిస్తున్న మాట ఇదే. దీనికి కారణం పాలకొల్లు ఎమ్మెల్యేగా వరుస విజయాలు దక్కించుకున్న ప్రజానాయకుడు నిమ్మల రామానాయుడు తాను మంత్రి అయినప్ప‌టికీ కార్యకర్తగానే వ్యవహరిస్తున్నారు. వాస్తవానికి ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఆయన స్థానికంగా అందరిలోనూ కలిసిపోయి, అందరితోనూ కలిసిపోయి వ్యవహరించేవారు. ప్రజలంతా నా వాళ్లే, నేను ప్రజల మనిషిని అనే దృక్పథం ఆయన ముందుకు సాగారు. దీంతో చిన్న చిన్న పనులు కానీ పెద్ద పెద్ద పనులు గానీ ఆయన సాధారణ కార్యకర్తలతో కలిసి చేసేశారు.

పార్టీ కార్యక్రమాలు చేయాల్సి వచ్చినప్పుడు జెండాలు కట్టాల్సి వస్తే ఆయనే మైదా పూసి తాళ్ల‌కు జండాలు అంటించారు. పరిశుభ్రత విషయానికి వస్తే రహదారులు బాగోలేదని ప్రజలు కంప్లైంట్ చేస్తే ప్రభుత్వం దానికి స్పందించకపోతే ఆయన నేరుగా దిగి రోడ్లు శుభ్రం చేసేవారు. స్మశానాల్లో శుభ్రం చేసినటువంటి సందర్భాలు గత ఐదేళ్లగా మనం చూసాం. అయితే ఆ వాసన ఆయ‌న‌లో పోయినట్లు లేదు. నేను ఇంకా సామాన్యంగానే ఉండాలి అని ఆయన అనుకుంటున్నారేమో మొత్తానికి మంత్రి అన్న విషయాన్ని ఆయన పక్కన పెట్టారు.

తాజాగా పొలాల్లో రైతులతో కలిసి ప‌నిచేసి అంద‌రినీ ఆశ్చ‌ర్యానికి గురి చేశారు నిమ్మ‌ల‌. క‌లుపు మొక్కలు తీస్తూ ఉత్సాహపరిచారు. నేను సాధారణ వ్యక్తినే. నేను మంత్రిని అయినప్పటికీ నేను సామాన్యుడిని. అని చెప్తున్నారు. కానీ సమస్య ఏంటంటే ఆయన చేయాలని ప్రజలు కోరుకోవట్లేదు. అధికారుల‌తో ప‌నులు చేయించాలని కోరుకుంటున్నారు. జలవనులు శాఖ మంత్రిగా ఆయన మీద గురుతర‌ బాధ్యతలు చాలా ఉన్నాయి. సీమ, ఉత్తరాంధ్ర జిల్లాల్లో కరువు పీడిత ప్రాంతాల్లో ఆయన ప‌ర్య‌టించి.. అక్కడి రైతులను ఉత్సాహపరచాల్సిన అవసరం ఉంది.

అదేవిధంగా రాష్ట్రవ్యాప్తంగా నీటి వ‌న‌రుల‌ను పెంచ‌డం, నీటి సంరక్షణ వంటి కార్యక్రమాలను ముందుకు తీసుకువెళ్లాల్సిన బాధ్యత జలవనరుల శాఖ మంత్రిగా నిమ్మ‌ల‌ బాధ్యత. అయితే ఆయన సామాన్య కార్యకర్తనే అంటూ పొలాల్లోకి దిగి పనులు చేయటం, కలుపు మొక్కలు పీకటం, చెత్త చెదారాన్ని తీయ‌డం వంటివి ఆస‌క్తిగా మారాయి. ఇవి చేయడం మంచిదే అయినా ఇప్పుడు మంత్రిగా ఆ స్థాయిని ఆయన అందుపుచ్చుకుని రాష్ట్రవ్యాప్తంగా ప్రజలకు మరింత‌ మేలు జ‌రిగేలాగా వ్యవహరించాలని పాలకొల్లు నియోజకవర్గ ప్రజలు కోరుతున్న మాట. మరి ఆయన ఏం చేస్తారో చూడాలి.

This post was last modified on July 8, 2024 11:58 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

తిరుమల లడ్డు వ్యవహారం… టీటీడీ ఈవో బదిలీ?

తిరుమల లడ్డు కల్తీ నెయ్యి వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతోంది. విచారణ పరిధి క్రమంగా ఉన్నతాధికారుల వరకు విస్తరిస్తోంది. ఈ…

19 minutes ago

నేనే ‘కింగ్’ అంటున్న దళపతి విజయ్

నిన్నటివరకు టీవీకే అధ్యక్షుడు, దళపతి విజయ్ ఎవరితో పొత్తు పెట్టుకుంటారని కేవలం తమిళనాట ప్రజలు మాత్రమే కాదు, దక్షిణ భారత…

2 hours ago

ఈ తరంలో చిరుకు నచ్చిన యంగ్ హీరో

మెగాస్టార్ చిరంజీవి అభినందన అంటే యువ నటీనటులకు ఒక సర్టిఫికెట్ లాంటిదే. ఐతే ఏదైనా ఈవెంట్లకు వచ్చినపుడు అక్కడున్న వారిని…

4 hours ago

‘అమ్మాయిలను అనుభవించడానికే సినిమాలు తీస్తున్నారు’

సినీ ప‌రిశ్ర‌మ‌లో కాస్టింగ్ కౌచ్ లేదు అని చెప్ప‌లేమ‌ని సీనియ‌ర్ ద‌ర్శ‌క నిర్మాత త‌మ్మారెడ్డి భ‌ర‌ద్వాజ స్ప‌ష్టం చేశారు. ఇటీవ‌ల…

10 hours ago

డిప్యూటీ సీఎంగా అజిత్ పవార్ సతీమణి

బరామతి విమాన ప్రమాదంలో దుర్మరణం చెందిన మహారాష్ట్ర డిప్యూటీ ముఖ్యమంత్రి అజిత్ పవార్ స్థానాన్ని ఇప్పుడు ఆయన భార్య సునేత్ర…

12 hours ago

చంద్రబాబు ప్రయోగశాలగా మారిన కుప్పం

త‌న సొంత నియోజ‌కవ‌ర్గం కుప్పాన్ని ప్ర‌యోగ‌శాల‌గా మార్చ‌నున్న‌ట్టు సీఎం చంద్ర‌బాబు తెలిపారు. తాజాగా శుక్ర‌వారం రాత్రి త‌న నియోజ‌క‌వర్గానికి వ‌చ్చిన…

13 hours ago