వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్.. తన తండ్రి వైఎస్సార్ జయంతిని సమాధాకే పరిమితం చేస్తున్నారు. తాజాగా ఆయన సొంత నియోజకవర్గం పులివెందులకు వెళ్లిపోయారు. ఇక్కడ వచ్చే మూడు రోజుల పాటు మకాం వేయనున్నారు. వాస్తవానికి 8వ తేదీన వైఎస్ జయంతి ఉంది. 75వ జయంతిని పురస్కరించుకుని.. జగన్ రాష్ట్ర వ్యాప్తంగా కార్యక్రమాలు నిర్వహిస్తారని పార్టీ వర్గాలు భావించాయి. అయితే.. పార్టీ ఘోర ఓటమి.. మరోవైపు.. ప్రధాన ప్రతిపక్షం హోదా దక్కకపోవడం వంటి కారణాలతో మానసికంగా జగన్ ఇంకా కోలుకోలేదు.
దీనికి తోడు.. రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ నాయకులు కూడా.. అంత ఉత్సాహంగా కనిపించడం లేదు. ఎన్నికల ఫలితాలు వచ్చి పట్టుమని నెల రోజులు మాత్రమే అయిన నేపథ్యంలో ఇప్పటికిప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా కార్యక్రమాలు నిర్వహించమని పిలుపునిస్తే.. ఎంత మంది స్పందిస్తారో..? అనే బెంగ కూడా.. పార్టీ అధినే తను వెంటాడుతున్నట్టుగా ఉంది. ఈ నేపధ్యం చడీ చప్పుడు కాకుండా.. వైఎస్ జయంతిని ఇడుపుల పాయలోని వైఎస్ ఎస్టేట్లో ఉన్న రాజన్న సమాధికే జగన్ పరిచేయనున్నారు.
అయితే.. హైదరాబాద్, తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయాల్లో మాత్రం వైఎస్ చిత్రపటాలకు పూల మాలలు వేసి.. నివాళులర్పించాలని పార్టీ ఆదేశించింది. ఇవి మినహా.. పెద్దగా ఈ ఏడాది వైఎస్ జయింతి ని నిర్వహించడం లేదు. అయితే.. గతంలో మాత్రం ఇలాంటి పరిస్థితి లేదు. పార్టీ ఓడిపోయిన 2014లోనూ వైఎస్ జయంతిని రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగానే నిర్వహించారు. తర్వాత.. 2019 నుంచి మరింత వన్నె తెచ్చారు. వైఎస్సార్ ఎచీవ్మెంట్ అవార్డు ఫంక్షన్ను కూడా చేశారు.
జూలై 8న రాష్ట్ర వ్యాప్తంగా కార్యక్రమం నిర్వహించేలా వైసీపీ ప్రభుత్వం గతంలో ఉత్తర్వులు ఇచ్చింది. వివిధ రంగాల్లో నిష్ణాతులైన వారికి బహుమానాలు, కానుకలు, అవార్డులు ఇచ్చి సత్కరించింది. ఈ కార్యక్ర మానికి మాతృమూర్తి విజయమ్మ ను కూడా.. జగన్ ఆహ్వానించిన విషయం తెలిసిందే. కానీ, ప్రస్తుతం అధికారం కోల్పోవడంతోపాటు.. పార్టీ పరిస్థితి కూడా ఇబ్బందుల్లో ఉన్న నేపథ్యంలో జగన్.. తాజా జయంతిని తూతూ మంత్రంగానే సరిపుచ్చనున్నారు.
This post was last modified on July 6, 2024 1:00 pm
పవన్ కళ్యాణ్ కెరీర్ లో ఎవర్ గ్రీన్ క్లాసిక్స్ అని చెప్పుకోదగ్గ సినిమాల్లో తొలిప్రేమ స్థానం చాలా ప్రత్యేకం. అప్పట్లో…
తమిళనాడు ఎన్నికల తేదీ వచ్చేయడంతో కోలీవుడ్ సినిమాల రిలీజ్ డేట్ల ప్రకటనలు ఊపందుకోబోతున్నాయి. స్థానిక రాజకీయా పార్టీల ప్రాబల్యం తీవ్రంగా…
ఏపీలో ఎన్డీఏ కూటమి పార్టీలపై నమ్మకంతో ప్రజలు 2024 ఎన్నికల్లో అఖండ మెజారిటీతో ఆ పార్టీల నేతలను గెలిపించారు. వైసీపీ…
ఇంట్లో బైక్ను స్టార్ట్లో ఉంచడంతో వెలువడిన కార్బన్ మోనాక్సైడ్ పొగ పీల్చి ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి చెందిన…
క్రీడల నేపథ్యంలో సినిమాలు తీయడం తెలుగులో అయితే ఎంతో కొంత రిస్కుతో కూడుకున్నదే. జెర్సీకి ఎంత గొప్ప పేరు వచ్చినా…
కొన్ని వారాల క్రితం జరిగిన కల్ట్ టీజర్ లాంచ్ ఈవెంట్ లో హీరో విశ్వక్ సేన్ మాట్లాడుతూ ఒక పెద్ద…