ఏపీలో జరిగిన ఎన్నికల్లో కూటమి 164 సీట్లతో విజయం దక్కించుకున్న విషయం తెలిసిందే. ఇదే సమయంలో వైసీపీ 11 స్థానాలకే పరిమితం అయింది. దీంతో ప్రధాన ప్రతిపక్షం హోదా వైసీపీకి ఇవ్వాలా? వద్దా? అనే చర్చ తెరమీదికి వచ్చింది. తమకు ప్రధాన ప్రతిపక్షం హోదా ఇవ్వాల్సందేనని వైసీపీ అధినేత జగన్ పట్టుబట్టారు. దీనికి సంబంధించి రూల్స్ ప్రస్తావిస్తూ.. ఆయనకు స్పీకర్ అయ్యన్న పాత్రుడికి ఆయన లేఖ రాశారు. కానీ, ఇప్పటి వరకు దీనికి ప్రత్యుత్తరం స్పీకర్ ఇవ్వలేదు.
మరో 20 రోజుల్లో సభ ప్రారంభం కానుంది. బడ్జెట్ సమావేశాలను కూటమి సర్కారు ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఈ నేపథ్యంలో తమకు ప్రధాన ప్రతిపక్షం హోదా కావాలన్నది వైసీపీ డిమాండ్ . కానీ, ఇప్పటికే సభా వ్యవహారాల మంత్రి పయ్యావుల కేశవ్.. వైసీపీ ప్రధాన ప్రతిపక్ష హోదా ఇవ్వబోమని తేల్చి చెప్పారు. కేవలం ఫ్లోర్ లీడర్గా మాత్రమే జగన్ను చూస్తామన్నారు. ఇది జరిగిన తర్వాతే.. జగన్ స్పీకర్ అయ్యన్నకు లేఖ సంధించారు. తమకు ప్రధాన ప్రతిపక్ష హోదా ఇవ్వాలన్నారు.
దీనిపై సుదీర్ఘ చర్చలు జరిగినట్టు తెలిసింది. గత రెండు రోజులుగా న్యాయ నిపుణులతోనూ అయ్యన్న చర్చించినట్టు పార్టీ వర్గాల్లో చర్చ సాగుతోంది. జగన్ రాసిన లేఖ, స్పీకర్ విచక్షణాధికారాలు, హక్కులు, రూల్స్, చట్ట నిబంధనలు వంటి అనేక అంశాలపై.. న్యాయ నిపుణుల సలహాలను స్పీకర్ తీసుకున్నారని.. టీడీపీ వర్గాలు చెబుతున్నాయి. ప్రధాన ప్రతిపక్షం అనే దానికి రూల్స్ అంటూ ఏమీలేవని.. సభలో సంఖ్యా బలాన్ని బట్టి ఇది ఉంటుందని న్యాయ నిపుణులు స్పష్టం చేసినట్టు తెలిసింది.
దీని ప్రకారం.. వైసీపీకి ఉన్నది 11 మంది సభ్యులే కావడంతో ప్రధాన ప్రతిపక్షం హోదా ఇచ్చినా.. ఇవ్వక పోయినా.. ఇబ్బంది లేదన్నది న్యాయ నిపుణుల మాట. దీనికి 2014, 2019లో పార్లమెంటులో జరిగిన వ్యవహారాలను వారు ఉటంకించారు. లోక్సభలో ప్రధాన ప్రతిపక్షం లేకుండానే.. మోడీ 10 సంవత్సరాలు పాలించారని.. దీనిపై కోర్టులు సైతం ఎలాంటి తీర్పులు ఇవ్వలేదని పేర్కొన్నట్టు తెలిసింది. అంటే.. వైసీపీ రేపు కోర్టు కువెళ్లినా.. ప్రయోజనం లేదని తేల్చి చెప్పారు. ఈ నేపథ్యంలో బడ్జెట్ సమావేశాల సమయంలో వైసీపీ ఎలాంటి పాత్ర పోషిస్తుందనేది ఆసక్తిగా మారింది.
This post was last modified on July 6, 2024 11:08 am
అయేషా మీరా. ఉమ్మడి ఏపీలో 2007లో ఓ వ్యక్తి కామ దాహానికి బలి అయిపోయిన బీఫార్మసీ విద్యార్థిని. ఈ కేసులో…
గత వారం విడుదలైన సినిమాల్లో మంచి టాక్, రివ్యూస్ తెచ్చుకుంది కపుల్ ఫ్రెండ్లీకి ఒకటే. అయితే ఆశించిన పెద్ద మొత్తంలో…
గత నలభై ఏడు సంవత్సరాలుగా ఎదురు చూస్తున్న సిల్వర్ స్క్రీన్ కాంబినేషన్ ఎట్టకేలకు ప్రారంభం కాబోతోంది. రజనీకాంత్, కమల్ హాసన్…
అంతా నా ఇష్టం…అంతా నా ఇష్టం…ఎడాపెడా ఏది చేసినా అడిగేదెవడ్రా నా ఇష్టం అంటూ కౌరవుడు సినిమాలో నాగబాబు మాదిరిగా…
చరిత్రలో ముందు నుంచీ మహిళా దర్శకురాళ్లు తెలుగులోనే కాదు ఏ భాషలో అయినా తక్కువే. కేవలం విజయనిర్మల గారు ఒక్కరే…
చాలాకాలంగా కాంగ్రెస్ పార్టీపై, సీఎం రేవంత్ రెడ్డిపై మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేస్తున్న సంగతి…