చట్టసభలైన పార్లమెంటు, అసెంబ్లీలలో అధికార పక్షం ఒకవైపు ఉంటుంది. మరోవైపు.. సభలకు ఎంపికైన ప్రతిపక్షం ఉంటుంది. చట్ట సభ దృష్టిలో ఇద్దరికీ ఒకే అధికారం ఉంటుంది. అంటే.. చట్టసభల్లో గౌరవం నుంచి లభించే వెసుబాట్ల వరకు కూడా.. అధికార పక్షమైనా.. ప్రతిపక్షమైనా.. చట్ట ప్రకారం.. రాజ్యాంగం ప్రకారం ఒక్కటే. ఈ విషయంలో తేడా లేదు. అయితే.. అధికార పక్షానికి లభించే అవకాశం చట్టాలు చేయడం. వాటిని ఆమోదించుకోవడం వరకు పరిమితం.
కానీ, అధికార పక్షాన్ని ఇరుకున పెట్టే ప్రధాన అవకాశం ప్రతిపక్షానిదే. అంతేకాదు.. ప్రజాప్రాతినిధ్య చట్టం లోని పలు అంశాలను పరిశీలిస్తే.. ప్రతిపక్షం అడిగే ప్రతి ప్రశ్నకు అదికార పక్షం సమాధానం చెప్పాలి. అంతేకాదు.. అవిశ్వాస తీర్మానం కనుక పెడితే.. (దీనిని అడ్డుకునే అధికారం స్పీకర్కు కూడా లేదు) ఖచ్చి తంగా చర్చ చేపట్టి.. ఓటింగ్ నిర్వహించాల్సి ఉంటుంది. అదే సమయంలో ప్రతిపక్షం కొన్ని అంశాలను ప్రస్తావిస్తే.. పార్లమెంటరీ రూల్స్ 47, 142 ప్రకారం.. వాటిపైనా చర్చ చేపట్టాలి.
ఇది.. ఇతమిత్థంగా రాజ్యాంగం చెబుతున్న మాట. కానీ.. ఇప్పుడు ఏం జరుగుతోందంటే.. బుల్ డోజ్ చేస్తున్నారు. అంటే.. మాటలు, విమర్శలతోనే సభలను గడిపేస్తున్నారు. ఇదేసమయంలో సంఖ్యా బలంతో కూడా.. సభలకు సంబంధం ఉండదు. అధికార పక్షం-ప్రతిపక్షం.. అనే రెండుకాన్సెప్టులు మాత్రమే సభ చూస్తుంది. ఉదాహరణకు ఉమ్మడి ఏపీలో లోక్సత్తా పార్టీ నుంచి జయప్రకాశ్ నారాయణ విజయం దక్కించుకున్నారు. ఆయన ఒక్కరు మాత్రమే ఆ పార్టీ నుంచి విజయం దక్కించుకున్నారు.
ఇదేసమయంలో అనేక పార్టీలు ప్రతిపక్షంలో ఉన్నాయి. కానీ, సభ విషయానికి వస్తే.. ఆయన రూల్స్ను వినియోగించుకుని.. సభలో ఎక్కువ సేపు మైకు తెచ్చుకున్నారు. ఎక్కువ గంటల పాటు ప్రజల సమస్యలను ప్రస్తావించారు. మరి ఒక్కరే ఉన్నారు కదా.. అని మైకు ఇవ్వకుండా తప్పించుకునే ప్రయత్నం చేయలేదు. ఎందుకంటే.. బలమైన రూల్స్ ఉన్నాయి. వాటిని ఆయన వినియోగించుకుని ప్రశ్నలు లేవనెత్తారు.
ఇలానే ఇప్పుడు సంఖ్యా బలం ఉందా లేదా? అనే విషయాన్ని పక్కన పెడితే.. ప్రజాప్రాతినిధ్య చట్టంలోని రూల్స్ను వినియోగించుకుంటే.. వైసీపీ కూడా బలమైన గళం వినిపించే అవకాశం ఉంది. ఈ విషయాన్ని జగన్ తెలుసుకుంటే.. బలమైన సంఖ్యాబలం లేకుండా.. బలమైన గళంతో తన వాణిని సభలోనే వినిపించే అవకాశం ఉంటుందని రాజ్యాంగం గురించి, సభల గురించి అనుభవం ఉన్నవారు చెబుతున్నారు. మరి ఏం చేస్తారో చూడాలి.
This post was last modified on July 6, 2024 11:02 am
దేశంలో గతంలో ఎన్నడూ లేని విధంగా పలు కీలక అంశాలు చోటు చేసుకుంటున్నాయి. ఏకంగా ప్రధాని పైనే గత ఐదేళ్లలో…
ఏపీలో కడుపేదల కోసం పీ 4 ఫార్ములాను రూపొందించి దానిని అమలు చేస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇప్పుడు కలెక్టర్ల…
మార్చి 15 నుంచి థియేటర్లలో ప్రదర్శించే సినిమాలకు సబ్ టైటిల్స్, క్లోజ్డ్ క్యాప్షన్స్ తప్పనిసరి చేయనుండటం మూవీ లవర్స్ లో…
పెళ్లి అనేది జీవితంలో ఒక్కసారే వచ్చే ఘట్టం. దాన్ని ఘనంగా చేసుకోవాలని ప్రతి ఒక్కరూ అనుకుంటారు. ప్రతి కుటుంబంలోనూ పెళ్లిని…
టాలీవుడ్ కు సంబంధించి హైదరాబాద్ ఇవాళ రెండు కీలక ఘట్టాలకు సాక్ష్యంగా నిలబడుతోంది. నెట్ ఫ్లిక్స్ కార్యాలయాన్ని తెలంగాణ ముఖ్యమంత్రి…
మార్చి 19 విడుదల కాబోతున్న ఉస్తాద్ భగత్ సింగ్ నుంచి 'మెడ ముట్టుకుంటే తొడ కొట్టినట్టే' పాట వచ్చినప్పుడు పాజిటివిటీ…