వ్యక్తిగతంగా అయినా.. సంస్థాగతంగా అయినా.. అప్డేషన్(ఆధునీకరణ) అనేది కీలకం. ఇక, రాజకీయాల్లోనూ నూతన నిర్ణయాలు.. నూతన పంథాలను ఎంచుకుని ముందుకు సాగాల్సి ఉంటుంది. అలా చేయని పార్టీలు… మనుగడలో లేని విషయం.. ప్రజల ఆదరణకు నోచుకోని విషయం మనకు తెలిసిందే. దీనికి ప్రత్యక్ష ఉదాహరణ కాంగ్రెస్ పార్టీనే. అదేసమయంలో కమ్యూనిస్టు పార్టీలు కూడా. తాము నమ్మడిన సిద్ధాంతానికి పరిమితమై.. అప్డేట్ కాకుండా.. ప్రజల ఆలోచనా ధోరణులతో మమేకం కాని నేపథ్యంలో ఆయా పార్టీలు ప్రజాదరణను కోల్పోయింది.
ఇప్పుడు వైసీపీ విషయానికి వస్తే.. ఇప్పటి వరకు అనుసరించిన విధానాలు ఎలా ఉన్నా.. మున్ముందు మాత్రం ఆ పార్టీ వ్యూహాలు మారాల్సి ఉంది. మార్చుకోవాల్సి కూడా ఉంది. గతంలో ఎన్టీఆర్ కూడా.. నిర్ణయాలను కేంద్రీకృతం చేశారు. ఫలితంగా ఆయనకు తొలిసారి దక్కిన విజయం రెండోసారి దోబూచులాడింది. దీంతో మండలస్థాయిలో పార్టీని పటిష్టం చేసి.. నాయకులకు కొన్ని స్వేచ్ఛలు కల్పించారు. ఫలితంగానే మండలస్థాయిలో పార్టీ ముందుకు సాగింది. దీంతో టీడీపీకి బలమైన క్షేత్రస్థాయి నాయకత్వం ఏర్పడింది. ఇప్పటికీ చెక్కుచెదరలేదు.
ఇప్పుడు వైసీపీ కూడా కేంద్రీకృతమైన అధికార నిర్ణయాలను మండలాలు.. నగరాలు.. పంచాయతీల స్థాయికి విస్తరించాలి. పార్టీ అంటే.. జగన్ది! అనే భావన ను పోగొట్టి.. పార్టీ అంటే.. మనది అనుకునేలా వ్యవహరించాల్సి ఉంటుంది. అలా చేస్తే.. పార్టీ మనుగడకు ప్రాధాన్యం ఉంటుందని గుర్తించాలి. అదే సమయంలో జిల్లాల స్థాయిలో నాయకత్వాలను ప్రక్షాళన చేయడం ఇప్పుడు ప్రధమకర్తవ్యంగా జగన్ చేప ట్టాలి. ఎక్కడెక్కడ తప్పులు జరుగుతున్నాయో తెలుసుకుని వాటిని సరిచేయాల్సి ఉంది.
అలానే.. ప్రస్తుతం ఉన్న నాయకుల పనితీరును అసెస్ చేయాల్సి ఉంది. తరచుగావీడియో.. టెలిఫోన్ కాన్ఫరెన్సులు నిర్వహిస్తూ.. పార్టీ పక్షాన కార్యకర్తలకు అండగా ఉండేలా నిర్ణయాలు తీసుకోవాలి. అప్పుడు పార్టీ బలపడతుంది. కొత్త రక్తానికి చోటు ఇవ్వాలన్న కాంక్ష వారసులకు పరిమితం కావడం సరికాదన్న విషయాన్ని టీడీపీ గుర్తించింది. అదేసయమంలో ఆశావహులను కూడా ఈ ఎన్నికల్లో ప్రోత్సహించింది. మనం అధికారంలోకి రావాలి! అనే కోరికను పెంచేలా చేసింది. ఇప్పుడు వైసీపీ కూడా.. అదే పంథాను అనుసరిస్తే.. ఇబ్బందులు తప్పి.. మరోసారి అధికారంలోకి వచ్చే చాన్స్ ఉంటుంది.
This post was last modified on July 6, 2024 10:58 am
తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్కు అత్యంత ఆప్తులైన అధికారులు చాలా మంది ఉన్నారు. ఆయన వస్తే.. పొర్లు దండాలు పెట్టినవారు…
తిరుపతికి చెందిన జూనియర్ ఎన్టీఆర్ అభిమాని కౌశిక్ రెండు పదుల వయసులో కూడా లేని స్థితిలో క్యాన్సర్ బారిన పడి…
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఇంట్లో ఉన్న గోశాలకు పండగ వచ్చింది. సుమారు 30 గోవులను ఈ గోశాలలో పెంచు తున్నారు.…
డెబ్యూతోనే సెన్సేషనల్ హిట్ అందుకుని ఆ తర్వాత వరస డిజాస్టర్లతో టాలీవుడ్ మార్కెట్ కోల్పోయిన హీరోయిన్ కృతి శెట్టి మలయాళం…
"తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఓ.. చిట్టినాయుడు. మేం చంద్రబాబు నాయుడితోనే కొట్టాడినం. ఈయనెం త?" అని బీఆర్ ఎస్…
హీరోయిన్గా రెజీనా కసాండ్రా.. ముఖ్య పాత్రల్లో ప్రకాష్ రాజ్, రాజేంద్ర ప్రసాద్, నాజర్, బ్రహ్మానందం, ఆలీ.. ఇంకా చాలామంది ప్రముఖ…