Political News

ఎన్నాళ్ల‌కెన్నాళ్ల‌కు.. చంద్ర‌బాబుపై నింగినంటిన అభిమానం!

టీడీపీ అధినేత‌, ఏపీ సీఎం చంద్ర‌బాబుకు చాలా ఏళ్ల త‌ర్వాత‌.. హైద‌రాబాద్‌లో ఘ‌న స్వాగ‌తం ల‌భించింది. 2014లో ఆయ‌న అప్ప‌టి విభ‌జిత ఏపీ ముఖ్య‌మంత్రిగా గెలిచిన త‌ర్వాత‌.. ఒక‌సారి, 2015లో జ‌రిగిన స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల్లో ఎల్ బీ న‌గ‌ర్‌లో ప‌ర్య‌టించిన‌ప్పుడు మ‌లి సారి ఆయ‌న‌కు ఘ‌న స్వాగ‌తం ల‌భించింది. త‌ర్వాత‌.. అప్ప‌టి సీఎం కేసీఆర్ తో విభేదాలు.. ఓటు కు నోటు కేసు.. ఎమ్మెల్యేల ఫిరాయింపులు.. త‌దిత‌ర అంశాల‌తో చంద్ర‌బాబుకు ఘ‌న స్వాగ‌తం ప‌లికేందుకు పార్టీ నాయ‌కులే జంకాల్సిన ప‌రిస్థితి ఏర్ప‌డింది. ఎవ‌రైనా చంద్ర‌బాబుకు స్వాగ‌తం ప‌లికితే..వారిపై కేసులు న‌మోదైన చ‌రిత్ర కూడా క‌నిపించింది.

అయితే.. తాజాగా ప‌దేళ్ల‌కు చంద్ర‌బాబుకు మ‌రోసారి హైద‌రాబాద్‌లో ఘ‌న స్వాగ‌తం ల‌భించింది. ఏపీకి రెండోసారి(వ్య‌క్తిగ‌తంగా నాలుగోసారి ముఖ్య‌మంత్రి) సీఎం అయిన‌.. చంద్ర‌బాబు తొలిసారి నిన్న మొన్న‌టి వ‌ర‌కు ఉమ్మ‌డి రాజ‌ధానిగా ఉన్న హైద‌రాబా ద్‌కు వ‌చ్చారు. రెండు రోజుల ఢిల్లీ ప‌ర్య‌ట‌న‌ను ముగించుకుని.. ఆయ‌న నేరుగా శుక్ర‌వారం రాత్రి 7 గంట‌ల స‌మ‌యంలో బేగంపేట లోని విమానాశ్ర‌యానికి చేరుకున్నారు. అక్క‌డ నుంచి జూబ్లీ హిల్స్‌లోని చంద్ర‌బాబు నివాసం వ‌ర‌కు.. పార్టీ అభిమానులు, కార్య‌కర్త‌ల‌కు, ఐటీ ఉద్యోగులు.. వేలాది గా పాల్గొని సంబ‌రాల న‌డుమ చంద్ర‌బాబును జూబ్లీ హిల్స్ వ‌ర‌కు తీసుకువెళ్లారు.

ఓపెన్ టాప్ వాహ‌నంలో నిల‌బ‌డిన చంద్ర‌బాబు అంద‌రికీ అభివాదం చేస్తూ ముందుకు సాగారు. బేగం పేట నుంచి జూబ్లీ హిల్స్ వ‌ర‌కు ఇసుక వేస్తే.. రాల‌నంత‌గా అభిమానులు త‌ర‌లి వ‌చ్చారు. జై చంద్ర‌బాబు, జై టీడీపీ నినాదాల‌తో బేగంపేట‌ హోరెత్తిపోయిం ది. నిత్యం వాహ‌నాల ర‌ద్దీతో ఉండే ఈ ప్రాంతం ఎటు చూసినా..ప‌సుపు వ‌ర్ణంతో నిండిపోయి.. అభిమానుల ఆనందంతో క‌ళ‌క‌ళ‌లా డింది. కాగా, చంద్ర‌బాబు స్వాగ‌త యాత్ర‌కు రేవంత్ స‌ర్కారు ఒక రోజు ముందు ప‌ర్మిష‌న్ ఇచ్చిన విష‌యం తెలిసిందే.

దీంతో పోలీసులు బేగం పేట నుంచి జూబ్లీ హిల్స్ వ‌ర‌కు ట్రాఫిక్‌ను దారి మ‌ళ్లించారు. అదేవిధంగా భారీ సంఖ్య‌లో పోలీసుల‌ను ఏర్పాటు చేసి భ‌ద్ర‌త క‌ల్పించారు. ఏదేమైనా.. దాదాపు ప‌దేళ్ల త‌ర్వాత‌.. ల‌భించిన ఈ ఘ‌న స్వాగ‌తంతో చంద్ర‌బాబు ఉబ్బిత బ్బిబ్బ‌య్యారు. కాగా, శ‌నివారం.. ఏపీ, తెలంగాణ సీఎంలు రెండు రాష్ట్రాల విబ‌జ‌న స‌మ‌స్య‌ల‌పై ప్ర‌త్యేకంగా చ‌ర్చించ‌నున్న విష‌యం తెలిసిందే. ఈ భేటీ ప్ర‌జాభ‌వ‌న్‌లో జ‌ర‌గ‌నుంది. ఇరు రాష్ట్రాల‌కు చెందిన ప్ర‌భుత్వ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శులు ఈ భేటీలో పాల్గొన‌నున్నారు.

This post was last modified on July 6, 2024 7:06 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

ఆవిడ వల్లే ఎన్టీఆర్‌కు భారత రత్న రావట్లేదా?

టీడీపీ వ్యవస్థాపకుడు, ఉమ్మడి ఏపీకి పలుమార్లు ముఖ్యమంత్రిగా వ్యవహరించిన దివంగత నందమూరి తారక రామారావుకు భారత దేశ అత్యున్నత పురస్కారం భారత రత్న ఇవ్వాలన్నమాట నిత్యం…

4 minutes ago

పిఠాపురం ఫ్లెక్సీల రగడ… వర్మదే తప్పన్న బాబు

జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ప్రాతినిధ్యం వహిస్తున్న పిఠాపురంలో కూటమి పార్టీలకు చెందిన నేతల మధ్య…

17 minutes ago

సినిమా చేయనందుకు హీరో 10 కోట్ల పరిహారం

ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో ఎక్కడైనా హీరోల ఆధిపత్యమే నడుస్తుంటుంది. దర్శక నిర్మాతలు వాళ్ల మాటను అనుసరించే నడుచుకోవాల్సి ఉంటుంది. హీరోలు మాట తప్పినా..…

1 hour ago

IPL: ఛాన్స్ మిస్ చేసుకుంటున్న పెద్ది

ఒక పాట థియేటర్లలో కంటే బయట ఎంతలా వినిపిస్తుందనే దానిపైనే ఆ సినిమా క్రేజ్ ఆధారపడి ఉంటుంది. తాజాగా ఉప్పల్…

2 hours ago

ఈ నలుగురు కొడితే 10 వేల కోట్లా?

తెలుగు సినిమా మార్కెట్ ఇప్పుడు మునుపెన్నడూ లేని విధంగా విస్తరించింది. ఒకప్పుడు వందల కోట్లతో ముగిసిపోయే లెక్కలు, ఇప్పుడు వేల…

2 hours ago

కన్నడ హీరోయిన్ ప్రశ్న… జవాబు చెప్పగలమా?

దేశంలో ఎక్కడికి వెళ్లినా వారి మాతృభాష మీద అమితమైన ప్రేమ చూపిస్తారు. ఆ భాష నేర్చుకోవడానికి, అందులో నైపుణ్యం చేయడానికి…

2 hours ago