Political News

కలిశెట్టి .. తొలి జీతం అమరావతికే !

2019లో ఏపీలో జగన్ అధికారంలోకి రావడంతో రాజధాని అమరావతి అభివృద్ది పనులు ఆగిపోయాయి.
చంద్రబాబు నాయుడు మళ్లీ అధికారంలోకి కావడంతో రాజధాని అమరావతికి మంచిరోజులు వచ్చాయి. ఆగిపోయిన నిర్మాణ పనులు మళ్లీ మొదలయ్యాయి. అమరావతి నిర్మాణం కోసం పలువురు స్వచ్చంధంగా సొంత నిధులు ఇస్తున్నారు. తాజాగా విజయనగరం టీడీపీ ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు అమరావతి అభివృద్ది కోసం తనవంతు చేయూతనిచ్చారు.

లోక్ సభ సభ్యుడుగా అందుకున్న తొలి నెల వేతనం రూ. 1.57 లక్షల చెక్కును అమరావతి నిర్మాణం కోసం ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడికి అందించారు. అమరావతి నిర్మాణానికి చేయూతనిచ్చిన ఎంపీని చంద్రబాబు అభినందించారు.

ఇటీవల రామోజీరావు సంస్మరణ సభ సందర్భంగా ఈనాడు సంస్థల తరపున అమరావతి కోసం రూ.10 కోట్లు విరాళం అందించిన విషయం తెలిసిందే. ఇక ప్రకాశం జిల్లా కనిగిరికి చెందిన దివ్యాంగుడు మాల్యాద్రి నాలుగు రోజుల క్రితం దాతృత్వం చాటుకున్నాడు. రాజధాని అమరావతి నిర్మాణానికి 10 వేల రూపాయల విరాళమిచ్చాడు. పింఛన్ సొమ్ము 6 వేల రూపాయలకు సొంత డబ్బు మరో 4 వేలను జతచేసి మొత్తం 10 వేల రూపాయలను అమరావతి నిర్మాణం కోసం అందజేశారు. ఆ డబ్బును చెక్కు రూపంలో తెలుగుదేశం ఎమ్మెల్యే ఉగ్రనరసింహారెడ్డికి అందజేయడం విశేషం.

This post was last modified on July 5, 2024 3:54 pm

Share
Show comments
Published by
Satya
Tags: Amaravati

Recent Posts

ఫ్యామిలీ ఆడియన్స్ కనెక్ట్ అయితే రచ్చే

రేపు రాత్రి ప్రీమియర్లతో విడుదల కాబోతున్న మన శంకరవరప్రసాద్ గారు మీద ఆల్రెడీ ఉన్న బజ్ మరింత పెరిగే దిశగా…

51 minutes ago

ప్రతిచోట చీపురు పట్టుకొని పవన్ ఊడవాలా?

పాలన అంటే కార్యాలయాల్లో కూర్చుని సమీక్షలు చేయడమే కాదు. ప్రజల మధ్యకు వెళ్లి వారి సమస్యలను ప్రత్యక్షంగా చూడడమే నిజమైన…

3 hours ago

విమర్శకులను పనితీరుతో కొడుతున్న లోకేష్..!

తనపై విమర్శలు చేసే వారిని సహజంగా ఎవరైనా ప్రతివిమర్శలతో ఎదుర్కొంటారు. మాటకు మాట అంటారు. ఇక రాజకీయాల్లో అయితే ఈ…

5 hours ago

రండి.. కూర్చుని మాట్లాడుకుందాం: ఏపీకి రేవంత్ రెడ్డి పిలుపు

ఇరు తెలుగు రాష్ట్రాల మధ్య ఉన్న జల వివాదాలపై యాగీ చేసుకోకుండా కూర్చుని మాట్లాడుకుంటే సమస్యలు పరిష్కారం అవుతాయని తెలంగాణ…

5 hours ago

షమీ కెరీర్ క్లోజ్ అయినట్టేనా?

టీమ్ ఇండియా సీనియర్ పేసర్ మహమ్మద్ షమీ ఇంటర్నేషనల్ కెరీర్ దాదాపు ముగింపు దశకు చేరుకున్నట్లే కనిపిస్తోంది. గతేడాది జరిగిన…

6 hours ago

‘వైసీపీ చేసిన పాపాలను కడుగుతున్నాం’

రెండు రాష్ట్రాల మధ్య జల వివాదాలపై ఏపీ సీఎం చంద్రబాబు మరోసారి స్పందించారు. నీళ్లు వద్దు, గొడవలే కావాలని కొందరు…

14 hours ago