2019లో ఏపీలో జగన్ అధికారంలోకి రావడంతో రాజధాని అమరావతి అభివృద్ది పనులు ఆగిపోయాయి.
చంద్రబాబు నాయుడు మళ్లీ అధికారంలోకి కావడంతో రాజధాని అమరావతికి మంచిరోజులు వచ్చాయి. ఆగిపోయిన నిర్మాణ పనులు మళ్లీ మొదలయ్యాయి. అమరావతి నిర్మాణం కోసం పలువురు స్వచ్చంధంగా సొంత నిధులు ఇస్తున్నారు. తాజాగా విజయనగరం టీడీపీ ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు అమరావతి అభివృద్ది కోసం తనవంతు చేయూతనిచ్చారు.
లోక్ సభ సభ్యుడుగా అందుకున్న తొలి నెల వేతనం రూ. 1.57 లక్షల చెక్కును అమరావతి నిర్మాణం కోసం ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడికి అందించారు. అమరావతి నిర్మాణానికి చేయూతనిచ్చిన ఎంపీని చంద్రబాబు అభినందించారు.
ఇటీవల రామోజీరావు సంస్మరణ సభ సందర్భంగా ఈనాడు సంస్థల తరపున అమరావతి కోసం రూ.10 కోట్లు విరాళం అందించిన విషయం తెలిసిందే. ఇక ప్రకాశం జిల్లా కనిగిరికి చెందిన దివ్యాంగుడు మాల్యాద్రి నాలుగు రోజుల క్రితం దాతృత్వం చాటుకున్నాడు. రాజధాని అమరావతి నిర్మాణానికి 10 వేల రూపాయల విరాళమిచ్చాడు. పింఛన్ సొమ్ము 6 వేల రూపాయలకు సొంత డబ్బు మరో 4 వేలను జతచేసి మొత్తం 10 వేల రూపాయలను అమరావతి నిర్మాణం కోసం అందజేశారు. ఆ డబ్బును చెక్కు రూపంలో తెలుగుదేశం ఎమ్మెల్యే ఉగ్రనరసింహారెడ్డికి అందజేయడం విశేషం.
This post was last modified on July 5, 2024 3:54 pm
ఏపీ డిప్యూటీ సీఎం, అటవీ శాఖ మంత్రి పవన్ కల్యాణ్.. తాజాగా అటవీ సంపదపై సమీక్షించారు. ఈ సమీక్షకు అటవీ…
తన హయాంలో ఆంధ్రప్రదేశ్లో అభివృద్ధిని తిరోగమనం పట్టించి.. కొత్త పరిశ్రమలు రానివ్వకుండా, ఉన్నవి పారిపోయేల చేశారనే అపప్రదను మూటగట్టుకున్నారు మాజీ…
భారతీయుడు 2 కన్నా 3 కోసమే ఎక్కువ ఎదురు చూస్తున్నానని కమల్ హాసన్ ఒక ఇంటర్వ్యూలో అన్న మాటల మీద…
తమిళ సీనియర్ హీరో సిద్దార్థ్ సినిమాల్లో చాలా వరకు కూల్ క్యారెక్టర్లలో కనిపిస్తాడు కానీ.. బయట మాత్రం అతనో ఆటంబాంబు…
టాలీవుడ్ యువ కథానాయకుడు రాజ్ తరుణ్ తాజాగా అనుకోని వివాదంలో చిక్కుకున్న సంగతి తెలిసిందే. లావణ్య అనే అమ్మాయి రాజ్…
‘బాహుబలి’ సినిమాతో ప్రభాస్ సాధించిన క్రేజ్, ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్ చూసి వేరే ప్టార్ హీరోలకు కళ్లు కుట్టి ఉంటే…