తెలంగాణ రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. బీఆర్ఎస్కి చెందిన ఆరుగురు ఎమ్మెల్సీలు సీఎం రేవంత్ ఢిల్లీ నుంచి రాగానే గురువారం అర్దరాత్రి కాంగ్రెస్లోకి తీర్దం పుచ్చుకున్నారు. కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జి దీపాదాస్ మున్షీ వారికి కాంగ్రెస్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. తాజా చేరికలతో మండలిలో కాంగ్రెస్ బలం 12కి చేరింది. ఎమ్మెల్సీలు మీడియా కంట పడకుండా వెనుక గేట్ నుంచి సీఎం రేవంత్ ఇంటి లోపలికి వెళ్లారు. ఇప్పటికే ఆరుగురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్లోకి చేరగా తాజాగా చేరిన ఎమ్మెల్సీలతో రాష్ట్ర వ్యాప్తంగా రాజకీయాలు హీటెక్కాయి.
బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు బస్వరాజు సారయ్య, దండే విఠల్, భానుప్రసాద్, ప్రభాకర్రావు, దయానంద్, ఎగ్గే మల్లేష్ కాంగ్రెస్ లో చేరిన వారిలో ఉన్నారు. తెలంగాణ మండలిలో మొత్తం ఎమ్మెల్సీల సంఖ్య 40 అయితే.. ప్రస్తుతం రెండు స్థానాలు ఖాళీగా ఉన్నాయి. మిగతా 38మందిలో కాంగ్రెస్కు నిజానికి నలుగురు మాత్రమే ఉన్నారు. మిగతా 8మంది బీఆర్ఎస్ నుంచి వచ్చినవాళ్లే. ఇక బీజేపీకి ఒకరు, ఎంఐఎంకు ఒక ఎమ్మెల్సీ ఉండగా.. ఇద్దరు ఇండిపెండెంట్స్ ఉన్నారు.
ప్రస్తుతం మండలిలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీల బలం 21కి తగ్గింది. ఇప్పటి వరకు కాంగ్రెస్ లో ఆరుగురు ఎమ్మెల్యేలు, ఆరుగురు ఎమ్మెల్సీలు చేరారు. పార్లమెంట్ ఎన్నికలకు ముందే ముగ్గురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో చేరారు.
బీఆర్ ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మాజీమంత్రి కేటీఆర్ తాజాగా కీలక వ్యాఖ్యలు చేశారు. అధికారం ఒకరిద్దరి చేతుల్లో ఉంటే.. ఇలాంటి…
తొలి చిత్రం ‘మళ్ళీ రావా’తో దర్శకుడిగా బలమైన ముద్ర వేశాడు గౌతమ్ తిన్ననూరి. సుమంత్ లాంటి ఫాంలో లేని హీరోను పెట్టి,…
ఆరంభ సీజన్లతో పోలిస్తే ‘బిగ్ బాస్’ షోకు ఇప్పుడు ఆదరణ కొంచెం తగ్గిన మాట వాస్తవం. ఒకప్పట్లా సోషల్ మీడియాలో…
దసరాకే రావాల్సిన నందమూరి బాలకృష్ణ సినిమా ‘అఖండ-2’ వాయిదా పడి.. ‘రాజాసాబ్’ డేట్ను తీసుకుంది. ప్రభాస్ సినిమా సంక్రాంతికి వాయిదా పడడంతో డిసెంబరు 5కు…
వచ్చే ఏడాది సంక్రాంతి నుంచి ప్రజల మధ్యకు వస్తున్నానని.. తనతో పాటు 175 నియోజకవర్గాల్లో నాయకులు కూడా ప్రజలను కలుసుకోవాలని…
రాజకీయాల్లో విమర్శలు చేయొచ్చు. ప్రతివిమర్శలు కూడా ఎదుర్కొనచ్చు. కానీ, ప్రతి విషయంలోనూ కొన్ని హద్దులు ఉంటాయి. ఎంత రాజకీయ పార్టీకి…