‘ఈ నెల 6న ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుతో సమావేశమవుతున్నాం. ఆరో తేదీన మంచి వాతావరణంలో ఇరువురు ముఖ్యమంత్రులం చర్చించుకుంటున్నాం అని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాకు చెప్పాను’ అని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. ప్రధాని మోదీ, అమిత్ షాతో భేటీ అనంతరం ఉపముఖ్యమంత్రి మల్లు భట్టివిక్రమార్కతో కలిసి మీడియా సమావేశంలో మాట్లాడారు.
ఈ సంధర్భంగా ‘మీరు సమస్యలు పరిష్కరించుకుంటామంటే మా సహకారం ఉంటుంది’ అని అమిత్ షా తమకు హామీ ఇచ్చారని రేవంత్ తెలిపారు. నీటి పంపకాలు సహా ఎన్నో అంశాలు ఇరు రాష్ట్రాల మధ్య పెండింగ్లో ఉన్నాయని, ముఖ్యమంత్రులు కూర్చొని చర్చించిన తర్వాత మా స్థాయిలో పరిష్కారమవుతాయా? లేదా? తెలుస్తుంది. ఆ తర్వాత ఏ విషయంలోనైనా భిన్నాభిప్రాయాలు ఉంటే కేంద్రం సహకరిస్తుందన్నారు. ఇంకా సమస్య ఉంటే చట్టం ఉందని రేవంత్ అన్నారు.
అయితే చంద్రబాబుతో భేటీ అంశాన్ని అమిత్ షా వద్ద రేవంత్ ప్రస్తావించడం ఏంటన్న చర్చ మొదలయింది. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం పడిపోతుందని తరచూ బీజేపీ నేతలు చెబుతున్న నేపథ్యంలో రేవంత్ ప్రస్తావన వెనక అంతర్యం ఏంటన్న ప్రశ్న ఉండగా, ఢిల్లీలో ప్రధాని, హోంమంత్రులతో ప్రతి భేటీలో ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క ఉండడం కూడా చర్చ మొదలయింది. కాంగ్రెస్ అధిష్టానం రేవంత్ ను నమ్మడం లేదా ? ప్రతి భేటీలో వెంట ఎస్కార్ట్ లా ఎవరో ఒకరిని ఉంచడం ఏంటని గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇటీవలే లోక్ సభ ఎన్నికలు ముగియడం, కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం కొలువుతీరడంతో భవిష్యత్తులో తెలంగాణలో రేవంత్ ప్రభుత్వం పట్ల కేంద్రం ఎలా వ్యవహరిస్తుంది అన్న ఉత్కంఠ మొదలయింది.
This post was last modified on July 4, 2024 8:50 pm
ఏపీ సీఎం చంద్రబాబు తాజాగా పీ-4 విధానంపై దృష్టి పెట్టారు. పబ్లిక్-ప్రైవేట్-పీపుల్-పార్టనర్ షిప్గా పే ర్కొంటున్న ఈ విధానాన్ని ప్రజల్లోకి…
స్థానిక సంస్థలకు సంబంధించి చైర్ పర్సన్, డిప్యూటీ మేయర్ పదవులకు సంబంధించిన పోటీ తీవ్రస్థాయిలో జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం…
అల్లు అర్జున్కు కెరీర్లో మంచి బ్రేక్ ఇచ్చిన సినిమా.. ఆర్య. అదో అందమైన ప్రేమకథ. ఈ చిత్రంతోనే అతను స్టార్…
తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకువచ్చిన కుల గణన, ఎస్సీ రిజర్వేషన్ వర్గీకరణపై బీఆర్ఎస్ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మాజీ మంత్రి…
మాములుగా స్టార్ వారసులంటే జనంలో పిచ్చ క్రేజ్ ఉంటుంది. తాము అభిమానించే హీరోల పిల్లలు తెరమీద ఎలా కనిపిస్తారనే ఉత్సహంతో…
జగన్ హయాంలో తిరుపతి, తిరుమల ప్రతిష్ట మసకబారిందని, తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ) బోర్డులో అవకతవకలు జరిగాయని తీవ్రస్థాయిలో విమర్శలు వచ్చిన…