చక్కగా కట్టుకుంటున్న ఇంటిని చిందర వందర చేయడం.. పీకేసి పందిరేయడం.. ఈ రెండింటికీ నిలు వెత్తు ఉదాహరణ ఏపీ రాజధాని అమరావతి. వ్యక్తిగత కక్షలు, రాజకీయ మైలేజీలను కొలుచుకుని.. నాటి సీఎం జగన్ చేసిన నిర్వాకంతో ఇప్పుడు.. అమరావతి పరిస్థితి అంతు చిక్కడం లేదు. ఒకప్పుడు అమరావతి అంటే.. పెట్టుబడులు పెట్టేందుకు ప్రముఖ సంస్థలు ముందుకు వచ్చాయి. కానీ.. ఇప్పుడు పిలిచినా వస్తారనే నమ్మకం లేకుండా పోయింది. జగన్ చేసిన నిర్వాకంతో రాజధాని పరిస్థితి తలకిందులైంది.
ఈ నేపథ్యంలో రాజధానిని ఎలా పరుగులు పెట్టించాలన్న విషయంపై మంత్రి నారాయణ సహా.. అధికారులు తలబాదుకుంటున్నారు. ఈ క్రమంలో 8 వేలకుపైగా ఎకరాల భూమిని తాకట్టు పెట్టేందుకు రెడీ అయ్యారు. రాజధాని పరిధిలో కీలకమైన భాగంలో ఉన్న 8274 ఎకరాల భూమిని తాకట్టు పెట్టడం ద్వారా.. రాజధాని నిర్మాణానికి ప్రాథమికంగా నిధులు సమకూర్చుకోవాలని నిర్ణయించారు. ఈ పరిణామాల నేపథ్యంలో అసలు ఏం జరుగుతుంది? అనేది ఆసక్తిగా మారింది.
రాజధాని పరిధిలో ఉన్న భూమి 53,748 ఎకరాలు. దీనిలో రైతులు ఇచ్చింది.. 34 వేల ఎకరాలు. మిగిలినది .. అటవీ భూములను డీ నోటిఫై చేసి తెచ్చుకున్నారు. సో.. రైతులకు ప్లాట్లను రిజిస్ట్రేషన్ చేయించి ఇవ్వాలి. దీనికి ప్రభుత్వమే ఖర్చు చేయాల్సి ఉంది. అదేసమయంలో రోడ్లు ఇతర సదుపాయాల కోసం 27,885 ఎకరాలు, రైతులకు ప్లాట్లు తిరిగి ఇచ్చేందుకు 11,826 ఎకరాలు, ఇతర అవసరాల కోసం 14,037 ఎకరాలు కేటాయించాలి.
ఇవి పోగా మిగిలిన 8 వేల ఎకరాలను తాకట్టు పెట్టుకుని తద్వారా వచ్చే ఆదాయం వినియోగించుకునేందుకు ప్రయత్నించాలి. అయితే.. మనుగడలో ఉన్న భూమికి ఉండే విలువ.. ప్రస్తుత మూలనపడిన రాజధాని ప్రాంతానికి ఉంటుందా? అనేది ప్రశ్న. ఈ నేపథ్యంలో ముందుగా. .. కేటాయించిన సంస్థలను పిలిచి.. కార్యకలాపాలు నిర్వహించుకునేలా.. వారిని ప్రోత్సహించాలన్నది సర్కారు యోచన.
తర్వాత.. ఐఏఎస్, ఐపీఎస్ సహా ఉద్యోగులకు వసతి ఏర్పాటు చేసి.. కార్యకలాపాలు నిర్వహించేలా చేయాలన్నది మరో ఆలోచన. తద్వారా.. రాజధాని ప్రాంత మనుగడ పెరిగి.. అప్పు పుట్టే అవకాశం ఉంటుందన్నది బాబు సర్కారు వ్యూహం. మరి ఏమేరకు సాకారం అవుతుందో చూడాలి. ఏదేమైనా.. జగన్ చేసిన పని.. రాజధానికి పెద్ద డ్యామేజీనే మిగిల్చిందనడంలో సందేహం లేదు.
This post was last modified on July 4, 2024 3:00 pm
ఇంకో పది రోజుల్లో టాక్సిక్ విడుదల కానుంది. కెజిఎఫ్ తర్వాత సుమారు నాలుగేళ్ల విలువైన కాలాన్ని దీని కోసమే ఖర్చు…
ఏపీలో వచ్చే సెప్టెంబరులో నిర్వహించాలని భావిస్తున్న స్థానిక సంస్థల ఎన్నికలను బ్యాలెట్ విధానంలోనే నిర్వహించాలని రాష్ట్ర ఎన్నికల సంఘం నిర్ణయించింది. దీంతో…
తెలంగాణాలో స్థానిక ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్ది అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య విమర్శలు జోరందుకుంటున్నాయి. దీంతో రాజకీయ వేడి రాజుకుంటుంది.…
విజయనగరం జిల్లాలోని భోగాపురంలో అధునాతన వసతులతో నిర్మించిన అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ గ్రీన్ ఫీల్డ్ విమానాశ్రయం కార్యకలాపాలు ఆదివారం అర్ధరాత్రి…
బండ్ల గణేష్ అనే నటుడు ఎప్పుడూ తెలుగులో పెద్ద పాత్రలు చేసింది లేదు. నటుడిగా అతడిది గొప్ప కెరీర్ కాదు.…
కవితకు, షర్మిలకు మధ్య పోలిక పెట్టొద్దని ఒక టీవీ ఛానెల్ కు ఇచ్చిన ఇంటర్యూలో టీఆర్ఎస్ అధినేత్రి కల్వకుంట్ల కవిత…