వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. పార్టీ నుంచి వెళ్లిపోవాలని అనుకునే వారు ఎప్పుడైనా వెళ్లిపోవచ్చని.. తాను ఎవరినీ బ్రతిమాలబోనని స్పష్టం చేశారు. “చాలా మంది చెబుతా ఉన్నారు. అన్నా.. వాళ్లు వెళ్లిపోతున్నారు అని. నేనేం చేస్తాను. వెళ్లేవాళ్లను వెళ్లమనే చెబుతా. నేను ఆపితే మాత్రం ఉంటారా? ఇక్కడొక కాలు.. అక్కడొక కాలు.. ఎందుకు? వెళ్లేవాళ్లు ఎంతటి వారైనా నేను ఆపను. నాకు చెప్పాల్సిన అవసరం కూడా లేదు” అని జగన్ వ్యాఖ్యానించారు.
తాజాగా ఆయన నెల్లూరులో పర్యటిస్తున్నారు. నెల్లూరు జైల్లో ఉన్న మాచర్ల మాజీ ఎమ్మెల్యే, వైసీపీ నాయకుడు పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని జగన్ పరామర్శించేందుకు నెల్లూరుకు వచ్చారు. ఈ సందర్భంగా కొందరు నాయకులు ఆయనను కలిశారు. ఈ సమయంలో పార్టీ పరిస్థితి బాగోలేదని.. చాలా మంది నాయకులు టీడీపీలోకి వెళ్లేందుకు రెడీ అయ్యారని ఆయనకు చెప్పారు. ముఖ్యంగా వీరిలో కొందరు మాజీ ఎమ్మెల్యేలు ఉన్నారని కూడా తెలిపారు. ఈ సందర్భంగా జగన్ పైవిధంగా వ్యాఖ్యానించారు.
అంతేకాదు.. “మీరేం బాధ పడొద్దబ్బా. ఎవరున్నా.. ఎవరు లేకపోయినా.. ప్రజలు మనతో ఉన్నారు. పార్టీ ఉంటుంది. వెళ్లేవాళ్లను వెళ్లనివ్వడం. మీరు కూడా అడ్డుపడొద్దు. ఎవరినీ బ్రతిమాలొద్దు” అని తేల్చి చెప్పారు. అనంతరం ఆయన నేరుగా నెల్లూరు జైలుకు వెళ్లారు. ఇదిలావుంటే. వైసీపీ నుంచి టీడీపీలోకి వలసలు కొనసాగుతున్నాయి.
బాపట్ల జిల్లా చీరాల మున్సిపల్ కౌన్సిలర్లు వైసీపీ నుంచి టీడీపీలోకి చేరారు. మెుత్తం 11 మంది వైసీపీ, కొందరు ఇండిపెండెంట్ కౌన్సిలర్లు(ఆమంచి కృష్ణ మోహన్ వర్గం) ఎమ్మెల్యే ఎమ్.ఎమ్ కొండయ్య సమక్షంలో టీడీపీలో చేరారు. వారిని ఎమ్మెల్యే పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. కూటమి ప్రభుత్వంలో మెరుగైన పాలనను అందేంచేందుకు తమతో కలిసి ప్రయాణం చేసేందుకు కౌన్సిలర్లు ముందుకు రావడం హర్షణీయమన్నారు.
This post was last modified on July 4, 2024 2:34 pm
వైసీపీ హయాంలో అప్పటి సీఎం జగన్ కనుసన్నల్లో పనిచేసిన అధికారులు రూల్స్ను పక్కన పెట్టి ఇష్టానుసారంగా వ్యవహరించారని ఆరోపణలు ఉన్నాయి.…
జగన్ హయాంలో తీసుకున్న పలువురు నిర్ణయాలు రాష్ట్రాన్ని వెనక్కి నెట్టాయని, ముఖ్యంగా ఆర్థికంగానే కాకుండా రాజధాని పరంగా కూడా రాష్ట్రానికి…
రాజస్థాన్ రాష్ట్రంలోని జోధ్పూర్ జిల్లా మనాయ్ గ్రామంలో శనివారం జరగాల్సిన వివాహ కార్యక్రమాలకు కొద్దిగంటల ముందు ఇద్దరు అక్కచెల్లెళ్లు అనుమానాస్పద…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రకటనలు చేస్తానంటే ఆయనకు భారీ పారితోషకం ఇవ్వడానికి బోలెడన్ని కంపెనీలు ముందుకు వస్తాయి. కానీ…
గత ఏడాది నాని నిర్మించిన కోర్టుతో పరిచయమైన హీరోయిన్ శ్రీదేవి అప్పల అందులో టీనేజ్ కొచ్చిన కాలేజీ అమ్మాయిగా నటనతో…
టీ20 వరల్డ్ కప్ గ్రూప్ స్టేజ్ లో వరుస విజయాలతో దూసుకువచ్చిన టీమిండియాకు సూపర్ 8 ఆరంభంలోనే ఊహించని ఎదురుదెబ్బ…