ఏపీకి నిధులు ఇవ్వక తప్పని పరిస్థితి మోడీకి ఏర్పడిందా? అమరావతి రాజధానికి మోడీ ఇప్పుడు కనీసం 100 కోట్లయినా.. కేటాయించక తప్పదా? అంటే.. తప్పదనే అంటున్నారు పరిశీలకులు. ఎందుకంటే.. ఇప్పుడు ఎన్డీయే కూటమిలో మోడీకి అత్యంత విశ్వసనీయ భాగస్వామ్య పార్టీ కేవలం టీడీపీనే. ఇతర పార్టీలను తీసుకుంటే.. వారి గొంతెమ్మ కోరికలను తీర్చకపోతే.. ఏ క్షణమైనా తప్పుకొనే అవకాశం ఉంది. కానీ, బాబు అలా చేయరు.
గతంలో ఇలా చేసే.. చేతులు కాల్చుకున్నారు. సో.. చంద్రబాబు చాలా వ్యూహాత్మకంగా ఇప్పుడు అడుగులు వేస్తున్నారు. అలాగని రాష్ట్ర ప్రయోజనాల విషయంలో ఆయన రాజీ పడే అవకాశం లేదు. బిహార్ విషయాన్ని తీసుకుంటే.. అక్కడి సీఎం నితీష్ కుమార్.. ఇప్పటికే మోడీకి సెగ పెడుతున్నారు. ప్రత్యేక హోదా తుట్టె కదిపేశారు. దీనిపై వచ్చే బడ్జెట్ సమావేశాల్లో కేంద్రాన్ని ప్రశ్నించాలని కూడా నితీష్ నిర్ణయానికి వచ్చారు. అంటే.. భాగస్వామ్య పార్టీ మోడీకి సెగ పెంచుతోంది.
ఇలా చూసుకుంటే.. చంద్రబాబు నుంచి ఈ తరహా డిమాండ్ లేదు. కేవలం రాష్ట్రానికి పరిమితమైన అమరావతి రాజధాని, పోలవరం ప్రాజెక్టులకు సంబంధించిన నిధులను మాత్రమే ఆయన కోరే అవకాశం ఉంది. వీటికి న్యాయం చేయాల్సిన అవసరం ఉందని ఆయన గట్టిగా కోరనున్నారు. ఇది పొత్తు ధర్మం కూడా. ఎందుకంటే.. విభజన చట్టం ప్రకారం చూసుకున్నా.. ఈ రెండు ప్రాజెక్టులను కూడా.. కేంద్రమే చేయాల్సి ఉంది. సో.. మోడీకి ఏపీకి నిధులను కేటాయించక తప్పని పరిస్థితి ఏర్పడింది.
చంద్రబాబు కోసమే అయినా.. ఎన్డీయే కూటమి సర్కారు కోసమే అయినా.. మోడీ ఈ విషయంలో ముందు చూపు ప్రదర్శించాల్సిన అవసరం ఉందని అంటున్నారు పరిశీలకులు. ఎన్నికల హామీల్లో లేక పోయినా.. కీలకమైన ప్రాజెక్టుల విషయంలో మోడీ ముందుకు సాగే విధానాన్ని ఏపీ ప్రజలు కూడా గమనిస్తారు. ఈ నేపథ్యమే వచ్చే ఎన్నికల నాటికి బీజేపీకి ఏపీలో పునాదులు పడేలా చేస్తుంది. సో.. ఎలా చూసుకున్నా.. మోడీకి ఇప్పుడు ఏపీని వదులుకునే పరిస్థితి లేదు. మరి ఏం చేస్తారో చూడాలి.
This post was last modified on July 4, 2024 11:05 am
వైసీపీ హయాంలో తిరుపతి లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి వాడారని వచ్చిన ఆరోపణలపై విచారణ జరిపిన సీబీఐ తాజాగా సుప్రీం…
ఫరియా అబ్దుల్లా అంటే మనందరికీ 'జాతిరత్నాలు' సినిమాలోని చిట్టినే గుర్తొస్తుంది. ఆ సినిమాతో ఓవర్ నైట్ స్టార్ అయిపోయిన ఈ…
దురంధర్.. గత ఏడాది డిసెంబర్లో విడుదలై.. ఇప్పటికీ థియేటర్లలో మంచి వసూళ్లు సాధిస్తున్న సినిమా. ఇంకా థియేట్రికల్ రన్ కొనసాగుతుండగానే…
బులియన్ మార్కెట్లో బంగారం, వెండి ధరలు ఊహించని విధంగా కుప్పకూలాయి. గత రెండు రోజులుగా సాగుతున్న ఈ పతనం శనివారం…
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మళ్లీ వేడి పెరుగుతోంది. 16వ శాసనసభ ఐదో సమావేశాలు ఫిబ్రవరి 11 నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ…
తిరుమల లడ్డు కల్తీ నెయ్యి వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతోంది. విచారణ పరిధి క్రమంగా ఉన్నతాధికారుల వరకు విస్తరిస్తోంది. ఈ…