ఏపీకి నిధులు ఇవ్వక తప్పని పరిస్థితి మోడీకి ఏర్పడిందా? అమరావతి రాజధానికి మోడీ ఇప్పుడు కనీసం 100 కోట్లయినా.. కేటాయించక తప్పదా? అంటే.. తప్పదనే అంటున్నారు పరిశీలకులు. ఎందుకంటే.. ఇప్పుడు ఎన్డీయే కూటమిలో మోడీకి అత్యంత విశ్వసనీయ భాగస్వామ్య పార్టీ కేవలం టీడీపీనే. ఇతర పార్టీలను తీసుకుంటే.. వారి గొంతెమ్మ కోరికలను తీర్చకపోతే.. ఏ క్షణమైనా తప్పుకొనే అవకాశం ఉంది. కానీ, బాబు అలా చేయరు.
గతంలో ఇలా చేసే.. చేతులు కాల్చుకున్నారు. సో.. చంద్రబాబు చాలా వ్యూహాత్మకంగా ఇప్పుడు అడుగులు వేస్తున్నారు. అలాగని రాష్ట్ర ప్రయోజనాల విషయంలో ఆయన రాజీ పడే అవకాశం లేదు. బిహార్ విషయాన్ని తీసుకుంటే.. అక్కడి సీఎం నితీష్ కుమార్.. ఇప్పటికే మోడీకి సెగ పెడుతున్నారు. ప్రత్యేక హోదా తుట్టె కదిపేశారు. దీనిపై వచ్చే బడ్జెట్ సమావేశాల్లో కేంద్రాన్ని ప్రశ్నించాలని కూడా నితీష్ నిర్ణయానికి వచ్చారు. అంటే.. భాగస్వామ్య పార్టీ మోడీకి సెగ పెంచుతోంది.
ఇలా చూసుకుంటే.. చంద్రబాబు నుంచి ఈ తరహా డిమాండ్ లేదు. కేవలం రాష్ట్రానికి పరిమితమైన అమరావతి రాజధాని, పోలవరం ప్రాజెక్టులకు సంబంధించిన నిధులను మాత్రమే ఆయన కోరే అవకాశం ఉంది. వీటికి న్యాయం చేయాల్సిన అవసరం ఉందని ఆయన గట్టిగా కోరనున్నారు. ఇది పొత్తు ధర్మం కూడా. ఎందుకంటే.. విభజన చట్టం ప్రకారం చూసుకున్నా.. ఈ రెండు ప్రాజెక్టులను కూడా.. కేంద్రమే చేయాల్సి ఉంది. సో.. మోడీకి ఏపీకి నిధులను కేటాయించక తప్పని పరిస్థితి ఏర్పడింది.
చంద్రబాబు కోసమే అయినా.. ఎన్డీయే కూటమి సర్కారు కోసమే అయినా.. మోడీ ఈ విషయంలో ముందు చూపు ప్రదర్శించాల్సిన అవసరం ఉందని అంటున్నారు పరిశీలకులు. ఎన్నికల హామీల్లో లేక పోయినా.. కీలకమైన ప్రాజెక్టుల విషయంలో మోడీ ముందుకు సాగే విధానాన్ని ఏపీ ప్రజలు కూడా గమనిస్తారు. ఈ నేపథ్యమే వచ్చే ఎన్నికల నాటికి బీజేపీకి ఏపీలో పునాదులు పడేలా చేస్తుంది. సో.. ఎలా చూసుకున్నా.. మోడీకి ఇప్పుడు ఏపీని వదులుకునే పరిస్థితి లేదు. మరి ఏం చేస్తారో చూడాలి.
This post was last modified on July 4, 2024 11:05 am
బాలీవుడ్ లో సంచలన వసూళ్లు నమోదు చేస్తున్న హనుమాన్ అంశ్ తెలుగులో సెప్టెంబర్ 18 విడుదల కానుంది. ఆశ్చర్యం కలిగించే…
వరుస ఫ్లాపుల కారణంగా గత కొన్నేళ్లలో మాస్ రాజా రవితేజ ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్ బాగా దెబ్బ తిన్న మాట…
అక్టోబర్ 2 జాతిపిత మహాత్మా గాంధీ జయంతి. నేషనల్ హాలిడే. ఆ మహానుభావుడిని ఎందరు గుర్తు చేసుకుంటారో కానీ సెలవు…
సామాజిక మాధ్యమాల్లో ప్రస్తుతం ‘80ల ట్రెండ్’ సందడి చేస్తోంది. సాధారణ ఫొటోలను కృత్రిమ మేధ సాయంతో 1980ల నాటి దుస్తులు,…
చాట్జీపీటీ, జెమినీ, క్లాడ్ లాంటి AI సేవల వెనుక భారీ డేటా సెంటర్లు, ఖరీదైన చిప్స్, విద్యుత్ అవసరం ఉంటుంది.…
నాలాంటి వాళ్ళే కాక్రోచ్ అవుతున్నారంటూ వైసీపీ అధినేత జగన్ చెప్పిన ఈ మాట నెట్టింట తెగ వైరల్ అవుతుంది. నీట్…