ఏపీ విషయంలో వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్కు, ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఉన్న తేడా ఏంటి? ఇద్దరూ ఏపీ ప్రజలు ఎంచుకున్నవారే.. ఘన విజయం అందించిన వారే. అయినప్పటికీ.. రాష్ట్రం విషయంలో ఎక్కడో తేడా .. ఇద్దరి ఆలోచనల మధ్య చాలా వ్యత్యాసం.. ఇదే ఇప్పుడు రాజకీయంగానే కాకుండా.. అభివృద్ది పరంగా కూడా చర్చకు వస్తోంది. రాష్ట్రాన్ని ఆదాయవనరుగా మార్చుకోవాలన్నది.. చంద్రబాబు ఆలోచన.
ఇది భేష్ అయిన ఆలోచన. ఎందుకంటే.. బ్యాంకులో కోటిరూపాయలు ఉన్నాయనుకుంటే.. వాటిని తీసి ఖర్చు చేసేస్తూ.. పోతే.. ఏదో ఒక నాటికి జీరో అవుతుంది. ఇది సింపుల్ లాజిక్. అందుకే.. రూ.కోటిని కూడా.. పది కోట్లు చేసే ఆలోచన చేస్తే.. ఆదిశగా అడుగులు వేస్తే.. అప్పుడు ఆదాయానికి.. ఆర్థిక కష్టాలకు కూడా.. ఇబ్బంది లేకుండా పోతుంది. ఈ చిన్నపాటి ఆలోచన విషయంలోనే అటు జగన్ను.. జనాలకు దూరం చేస్తే.. చంద్రబాబును చేరువ చేసింది.
ఏపీలో ఉన్న వనరులను వినియోగించేసి.. ఉన్న వాటిని వాడేసుకుని దీనిని అభివృద్ధి అని చూపించాలని జగన్ ప్రయత్నించారు. అంటే.. అప్పటికే ఉన్న వనరులను ఆయన వినియోగించుకునే ప్రయత్నం చేశారు. అందుకే.. మూడు రాజధానుల కాన్సెప్టును తీసుకువచ్చారు. ఆయన దృష్టిలో ఇది మంచిది కావొచ్చు. కానీ, ఇది బెడిసి కొట్టింది. పైన చెప్పుకొన్న కోటి రూపాయల తరహాలోనే ఉంటుంది. అందుకే.. దీనిని ప్రజలు యాక్సప్ట్ చేయలేక పోయారు.
అలాకాకుండా.. కొత్త ప్రాంతాన్ని సృష్టించి.. దానిని డెవలప్ చేయడం ద్వారా.. అభివృద్ధి దిశగా రాష్ట్రాన్ని ముందుకు నడిపించాలనేది చంద్రబాబు ఆలోచన. అంటే.. ఉన్న కోటి రూపాయలతో పిల్లలను పెట్టించడం అన్నమాట. అదే.. అమరావతి. ఇక్కడ పెట్టుబడులు వచ్చేలా చేసి.. తద్వారా రాష్ట్రం మొత్తానికి పంచాలన్న చిన్న ఆలోచన చంద్రబాబును హీరోను చేసింది. దీనిని అందరూ యాక్సప్ట్ చేశారు కూడా.
అయితే.. మధ్యలో 2019లో తలెత్తిన ఎన్నికల సునామీ ఒక్కటే బ్రేకులు వేసింది. అయితే.. ఇప్పుడు మరో చాన్స్ చంద్రబాబుకు వచ్చింది. కానీ, ఇక్కడ జగన్కు, చంద్రబాబుకు ఉన్న చిన్న తేడానే రాష్ట్రానికి శాపంగా మారింది.. రాష్ట్రం వెనుకబడేలా చేసింది. ఏదేమైనా.. ఇప్పుడు ఆశాజీవులకు.. ఒకింత.. ఉపశమనే చెప్పాలి. ఇది చంద్రబాబు అనుభవం తెచ్చిన ప్రయోజనం అయితే.. అది దూకుడు తెచ్చిన తంటా!!
This post was last modified on July 4, 2024 1:59 pm
ఎప్పుడో ఆరేళ్ళ క్రితం రిలీజైన సినిమా. ఓటిటిలో వచ్చేసి అక్కడా మిలియన్ల వ్యూస్ సాధించుకుంది. ఇప్పుడు కొత్తగా రీ రిలీజ్…
సెప్టెంబర్ నెల సగానికి పైనే అయిపోయింది. ఇకపై ఆకాశమే హద్దుగా గేమ్ ఛేంజర్ నాన్ స్టాప్ అప్డేట్స్ ఉంటాయని దిల్…
యూత్ హీరో సుహాస్ కొత్త సినిమా గొర్రె పురాణం ఇంకో నాలుగు రోజుల్లో విడుదల కానుంది. ట్రైలర్ కూడా వచ్చేసింది.…
జనసేన పార్టీ నాయకుడు, ప్రముఖ సినీ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్పై పార్టీ వేటు వేసింది. ఆయనను పార్టీ కార్యక్రమాలకు దూరంగా…
కొన్ని నెలల క్రితం లాల్ సలామ్ అనే సినిమా ఒకటొచ్చిందనే సంగతే చాలా మంది సగటు ప్రేక్షకులు మర్చిపోయి ఉంటారు.…
స్టార్ హీరోలు నటించిన సినిమాలకు పాజిటివ్ టాక్ వచ్చి భారీ వసూళ్లు సాధించడంలో ఆశ్చర్యం లేదు. కానీ చిన్న బడ్జెట్…