Political News

అమరావతిపై చంద్రబాబు శ్వేతపత్రం

అమరావతి రాజధానిని వైసీపీ అధినేత జగన్ అధ:పాతాళానికి తొక్కేశారని తీవ్ర స్థాయిలో విమర్శలు వచ్చిన సంగతి తెలిసిందే. రాష్ట్రానికి నడిబొడ్డున ఉన్న ప్రజా రాజధాని అమరావతిని కాదని మూడు రాజధానులు అంటూ జగన్ మూడు ముక్కలాట ఆడి ప్రజాగ్రహానికి గురయ్యారు. ఈ క్రమంలోనే జగన్ ను ప్రజలు గద్దె దించి కనీసం ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వకుండా చేశారు. ఈ క్రమంలోనే అమరావతి అభివృద్ధికి నడుం బిగించిన ఏపీ సీఎం చంద్రబాబు తాజాగా అమరావతిపై శ్వేతపత్రం విడుదల చేశారు.

రాష్ట్ర భవిష్యత్తు కోసం కరుడుగట్టిన తీవ్రవాదులు కూడా అమరావతికి ఆమోదం తెలుపుతారని, కానీ, జగన్ మాత్రం అమరావతి రాజధానిని నాశనం చేశారని చంద్రబాబు దుయ్యబట్టారు. రాష్ట్రానికి మధ్యలో రాజధాని ఉంటే బాగుంటుందని అందరూ చెబుతున్నా సరే జగన్ మాత్రం కాదంటున్నారని విమర్శలు గుప్పించారు. అమరావతి చరిత్ర సృష్టించే నగరం అని గుర్తు చేశారు. గతంలో టీడీపీ హయంలో సైబరాబాద్ సృష్టించామని, వాస్తు ప్రకారం సైబరాబాద్ నిర్మాణం సరికాదని అంతా చెప్పినా భూమి అందుబాటులో ఉండటంతో అక్కడే ముందుకు వెళ్లామని అన్నారు. ఈ రోజు హైదరాబాద్ ను ప్రపంచపటంలో నిలిపింది సైబరాబాద్ అని చెప్పారు.

ప్రపంచంలో అత్యధిక భూమి సేకరించి ప్రాజెక్టు అమరావతి ఒక్కటేనని చంద్రబాబు అన్నారు. ప్రపంచ బ్యాంకు కూడా ఈ భూ సమీకరణ విధానాన్ని కేస్ స్టడీగా తీసుకుందని, భూములు ఇచ్చిన రైతులతో ఒప్పందాలను కుదుర్చుకునేలా చట్టాలు రూపొందించాలని చెప్పారు. పదేళ్లపాటు రైతులకు కౌలు ఇచ్చామని, దాంతోపాటు రైతులకు కమర్షియల్, రెసిడెన్షియల్ ఏరియాలలో రిటర్నబుల్ ప్లాట్లు కూడా ఇచ్చామని చంద్రబాబు గుర్తు చేశారు. రైతు కూలీలకు కూడా అమరావతి రైతులతో పాటు పెన్షన్ ఇచ్చామని ఆయన అన్నారు.

స్వయం సమృద్ధి సాధించేలా, ఆదాయం పెరిగేలా అమరావతి రాజధానిని రూపొందించామని అన్నారు. అమరావతి రాష్ట్రం నడిబొడ్డున రాజధాని ఉండాలని చెప్పిన జగన్ అధికారంలోకి రాగానే మాట మార్చారని విమర్శించారు.

This post was last modified on July 3, 2024 5:55 pm

Share
Show comments
Published by
satya

Recent Posts

బింబిసార కాదు….ఇది అంతకు మించి

నందమూరి కళ్యాణ్ రామ్ కెరీర్లోనే పెద్ద బ్లాక్ బస్టర్ గా నిలిచిన బింబిసారకు కొనసాగింపు కోసం అభిమానుల ఎదురుచూపులు రెండేళ్లకు…

9 mins ago

సమంత VS డాక్టర్ – ఎవరు రైటు

ఇన్ఫెక్షన్స్ వచ్చినప్పుడు ఖరీదైన మందులు వాడలేని పరిస్థితిలో నీటిలో హైడ్రోజిన్ పెరాక్సాడ్ కలిపి దాన్ని నెబ్యులైజర్ ద్వారా పీల్చాలని సమంతా…

10 mins ago

1000 కోట్ల మైలురాయి సాధ్యమేనా

బాక్సాఫీస్ వద్ద విజయ విహారం చేస్తున్న కల్కి 2898 ఏడి రెండో వారంలోనూ దూకుడు కొనసాగించనుంది. నిర్మాణ సంస్థ అధికారిక…

3 hours ago

రవితేజ వయసు గురించి డిబేట్ ఎందుకు

అదేంటో కొన్ని విషయాల్లో మాస్ మహారాజా రవితేజని మాత్రమే టార్గెట్ చేయడం విచిత్రంగా అనిపిస్తుంది. నిన్న మిస్టర్ బచ్చన్ ఫస్ట్…

3 hours ago

ఆకాశం నీ హద్దురా కలయికకు కాంట్రవర్సి ముప్పు

సూర్య హీరోగా సుధా కొంగర దర్శకత్వంలో రూపొందిన ఆకాశం నీ హద్దురా (సూరారై పోట్రు) నేరుగా ఓటిటిలో రిలీజైనా ప్రేక్షకుల…

3 hours ago

పిన్నెల్లి బ‌య‌ట‌కు రావ‌డం క‌ష్ట‌మే: జ‌గ‌న్‌కు స‌మాచారం

వైసీపీ సీనియ‌ర్ నేత‌, మాచ‌ర్ల నియోజ‌క‌వ‌ర్గం మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామ‌కృష్ణారెడ్డి వ్య‌వ‌హారం ముదురు తున్న‌ట్టు తెలుస్తోంది. ఆయ‌న ప్ర‌స్తుతం…

4 hours ago