Political News

అమరావతిపై చంద్రబాబు శ్వేతపత్రం

అమరావతి రాజధానిని వైసీపీ అధినేత జగన్ అధ:పాతాళానికి తొక్కేశారని తీవ్ర స్థాయిలో విమర్శలు వచ్చిన సంగతి తెలిసిందే. రాష్ట్రానికి నడిబొడ్డున ఉన్న ప్రజా రాజధాని అమరావతిని కాదని మూడు రాజధానులు అంటూ జగన్ మూడు ముక్కలాట ఆడి ప్రజాగ్రహానికి గురయ్యారు. ఈ క్రమంలోనే జగన్ ను ప్రజలు గద్దె దించి కనీసం ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వకుండా చేశారు. ఈ క్రమంలోనే అమరావతి అభివృద్ధికి నడుం బిగించిన ఏపీ సీఎం చంద్రబాబు తాజాగా అమరావతిపై శ్వేతపత్రం విడుదల చేశారు.

రాష్ట్ర భవిష్యత్తు కోసం కరుడుగట్టిన తీవ్రవాదులు కూడా అమరావతికి ఆమోదం తెలుపుతారని, కానీ, జగన్ మాత్రం అమరావతి రాజధానిని నాశనం చేశారని చంద్రబాబు దుయ్యబట్టారు. రాష్ట్రానికి మధ్యలో రాజధాని ఉంటే బాగుంటుందని అందరూ చెబుతున్నా సరే జగన్ మాత్రం కాదంటున్నారని విమర్శలు గుప్పించారు. అమరావతి చరిత్ర సృష్టించే నగరం అని గుర్తు చేశారు. గతంలో టీడీపీ హయంలో సైబరాబాద్ సృష్టించామని, వాస్తు ప్రకారం సైబరాబాద్ నిర్మాణం సరికాదని అంతా చెప్పినా భూమి అందుబాటులో ఉండటంతో అక్కడే ముందుకు వెళ్లామని అన్నారు. ఈ రోజు హైదరాబాద్ ను ప్రపంచపటంలో నిలిపింది సైబరాబాద్ అని చెప్పారు.

ప్రపంచంలో అత్యధిక భూమి సేకరించి ప్రాజెక్టు అమరావతి ఒక్కటేనని చంద్రబాబు అన్నారు. ప్రపంచ బ్యాంకు కూడా ఈ భూ సమీకరణ విధానాన్ని కేస్ స్టడీగా తీసుకుందని, భూములు ఇచ్చిన రైతులతో ఒప్పందాలను కుదుర్చుకునేలా చట్టాలు రూపొందించాలని చెప్పారు. పదేళ్లపాటు రైతులకు కౌలు ఇచ్చామని, దాంతోపాటు రైతులకు కమర్షియల్, రెసిడెన్షియల్ ఏరియాలలో రిటర్నబుల్ ప్లాట్లు కూడా ఇచ్చామని చంద్రబాబు గుర్తు చేశారు. రైతు కూలీలకు కూడా అమరావతి రైతులతో పాటు పెన్షన్ ఇచ్చామని ఆయన అన్నారు.

స్వయం సమృద్ధి సాధించేలా, ఆదాయం పెరిగేలా అమరావతి రాజధానిని రూపొందించామని అన్నారు. అమరావతి రాష్ట్రం నడిబొడ్డున రాజధాని ఉండాలని చెప్పిన జగన్ అధికారంలోకి రాగానే మాట మార్చారని విమర్శించారు.

This post was last modified on July 3, 2024 5:55 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

డాలర్లు, మంచి లైఫ్ కోసం విదేశాలకు వెళ్ళాక నిజం తెలిసింది

డాలర్లు, మంచి లైఫ్ స్టైల్ కోసం విదేశాలకు వెళ్లాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు. కానీ అక్కడ కొన్నాళ్లు గడిపాక…

53 minutes ago

జగన్ ఇలానే ఉండాలి టీడీపీ ఆశీస్సులు

వైసీపీ అధినేత జగన్ ఇలానే ఉండాలి అంటూ టీడీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి కారణం రాజకీలంలో ఎవరూ ఎవ‌రినీ దెబ్బతీయరు.…

4 hours ago

టీం ఇండియా ఇప్పటికైన ఆ ప్లేయర్ ను ఆడిస్తుందా?

రాయ్‌పూర్ వన్డేలో 359 పరుగులు చేసినా టీమిండియా ఓడిపోవడం బిగ్ షాక్ అనే చెప్పాలి. బ్యాటర్లు అదరగొట్టినా, బౌలర్లు చేతులెత్తేయడంతో…

4 hours ago

చరిత్ర ఎన్నోసార్లు హెచ్చరిస్తూనే ఉంది

కాసేపు అఖండ 2 విషయం పక్కనపెట్టి నిజంగా ఇలాంటి పరిస్థితి టాలీవుడ్ లో మొదటిసారి చూస్తున్నామా అనే ప్రశ్న వేసుకుంటే…

6 hours ago

చంద్రబాబును కలిసిన కాంగ్రెస్ మంత్రి

ఉండవల్లిలోని చంద్రబాబు క్యాంపు కార్యాలయానికి తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఈ రోజు వెళ్లారు. తెలంగాణ రైజింగ్ సమిట్‌కు…

8 hours ago

సైకో హంతకుడిగా నటించిన స్టార్ హీరో

మలయాళం మెగాస్టార్ గా అభిమానులు పిలుచుకునే మమ్ముట్టి కొత్త సినిమా కలం కవల్ ఇవాళ ప్రేక్షకుల ముందుకొచ్చింది. అఖండ 2…

9 hours ago