Political News

అమరావతిపై చంద్రబాబు శ్వేతపత్రం

అమరావతి రాజధానిని వైసీపీ అధినేత జగన్ అధ:పాతాళానికి తొక్కేశారని తీవ్ర స్థాయిలో విమర్శలు వచ్చిన సంగతి తెలిసిందే. రాష్ట్రానికి నడిబొడ్డున ఉన్న ప్రజా రాజధాని అమరావతిని కాదని మూడు రాజధానులు అంటూ జగన్ మూడు ముక్కలాట ఆడి ప్రజాగ్రహానికి గురయ్యారు. ఈ క్రమంలోనే జగన్ ను ప్రజలు గద్దె దించి కనీసం ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వకుండా చేశారు. ఈ క్రమంలోనే అమరావతి అభివృద్ధికి నడుం బిగించిన ఏపీ సీఎం చంద్రబాబు తాజాగా అమరావతిపై శ్వేతపత్రం విడుదల చేశారు.

రాష్ట్ర భవిష్యత్తు కోసం కరుడుగట్టిన తీవ్రవాదులు కూడా అమరావతికి ఆమోదం తెలుపుతారని, కానీ, జగన్ మాత్రం అమరావతి రాజధానిని నాశనం చేశారని చంద్రబాబు దుయ్యబట్టారు. రాష్ట్రానికి మధ్యలో రాజధాని ఉంటే బాగుంటుందని అందరూ చెబుతున్నా సరే జగన్ మాత్రం కాదంటున్నారని విమర్శలు గుప్పించారు. అమరావతి చరిత్ర సృష్టించే నగరం అని గుర్తు చేశారు. గతంలో టీడీపీ హయంలో సైబరాబాద్ సృష్టించామని, వాస్తు ప్రకారం సైబరాబాద్ నిర్మాణం సరికాదని అంతా చెప్పినా భూమి అందుబాటులో ఉండటంతో అక్కడే ముందుకు వెళ్లామని అన్నారు. ఈ రోజు హైదరాబాద్ ను ప్రపంచపటంలో నిలిపింది సైబరాబాద్ అని చెప్పారు.

ప్రపంచంలో అత్యధిక భూమి సేకరించి ప్రాజెక్టు అమరావతి ఒక్కటేనని చంద్రబాబు అన్నారు. ప్రపంచ బ్యాంకు కూడా ఈ భూ సమీకరణ విధానాన్ని కేస్ స్టడీగా తీసుకుందని, భూములు ఇచ్చిన రైతులతో ఒప్పందాలను కుదుర్చుకునేలా చట్టాలు రూపొందించాలని చెప్పారు. పదేళ్లపాటు రైతులకు కౌలు ఇచ్చామని, దాంతోపాటు రైతులకు కమర్షియల్, రెసిడెన్షియల్ ఏరియాలలో రిటర్నబుల్ ప్లాట్లు కూడా ఇచ్చామని చంద్రబాబు గుర్తు చేశారు. రైతు కూలీలకు కూడా అమరావతి రైతులతో పాటు పెన్షన్ ఇచ్చామని ఆయన అన్నారు.

స్వయం సమృద్ధి సాధించేలా, ఆదాయం పెరిగేలా అమరావతి రాజధానిని రూపొందించామని అన్నారు. అమరావతి రాష్ట్రం నడిబొడ్డున రాజధాని ఉండాలని చెప్పిన జగన్ అధికారంలోకి రాగానే మాట మార్చారని విమర్శించారు.

This post was last modified on July 3, 2024 5:55 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

సర్ప్రైజు పబ్లిసిటీ వచ్చేసింది కానీ

నిన్న రాబిన్ హుడ్ నుంచి అదిదా సర్ప్రైజ్ లిరికల్ సాంగ్ విడుదల చేశారు. కేతిక శర్మ నటించిన ఈ ప్రత్యేక…

9 minutes ago

OG 2 వెనుక గూఢచారి హస్తం ?

అసలు ఓజి ఎప్పుడు విడుదలవుతుందో తెలియదు కానీ అప్పుడే ఓజి 2 గురించి ప్రచారాలు ఊపందుకున్నాయి. ఎన్నికల ముందు వరకు…

42 minutes ago

రోజా, బైరెడ్డిలకు కష్గాలు… ఏం జరుగుతోంది?

ఏపీలో విపక్షం వైసీపీలో ఫైర్ బ్రాండ్ నేతలుగా మాజీ మంత్రి, నగరి మాజీ ఎమ్మెల్యే ఆర్కే రోజా, నంద్యాల జిల్లాకు…

2 hours ago

నాని నమ్మకానికి ప్రీమియర్ల పరీక్ష

నిర్మాతగా నాని విపరీతమైన నమ్మకం పెట్టుకున్న కోర్ట్ ఇంకో మూడు రోజుల్లో విడుదల కానుంది. ఇంతకు ముందు ప్రొడ్యూసర్ గా…

2 hours ago

సాయిరెడ్డి వంతు వచ్చేసింది!

వైసీపీ హయాంలో ఇష్టారాజ్యంగా వ్యవహరించిన ఆ పార్టీ నేతలు ఒక్కొక్కరుగానే బుక్ అయిపోతున్నారు. వైసీపీ జమానాలో ఆయా నేతలు సాగించిన…

3 hours ago

అమ‌రావ‌తి పై అనుమానాలొద్దు.. ఇక పరుగులే

ఏపీ రాజ‌ధాని అమ‌రావ‌తి విష‌యంలో ప్ర‌తిప‌క్షం వైసీపీ నాయ‌కులు సృష్టిస్తున్న విషప్ర‌చారాన్ని ప్ర‌జ‌లు నమ్మ‌రాద‌ని ఏపీ మంత్రులు కోరారు. రాజ‌ధాని…

3 hours ago