Political News

వైఎస్ జయంతి .. షర్మిల టార్గెట్ ఏంటి ?

జులై 8. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి 75వ జయంతి. సుధీర్ఘ నిరీక్షణ అనంతరం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అయిన వైఎస్ రెండో సారి ముఖ్యమంత్రి అయిన కొద్ది నెలలకే 2009 సెప్టెంబరు 2 హెలికాప్టర్ ప్రమాదంలో మరణించారు. ఆ తర్వాత కాంగ్రెస్ తో విబేధాల నేపథ్యంలో ఆయన కుమారుడు జగన్ వైఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ పెట్టాడు.

ఆ తరువాతి పరిణామాల్లో ఆక్రమాస్తుల కేసుల్లో జగన్ జైలుకు వెల్లడం, షర్మిల పాదయాత్ర, 2014లో ఏపీ, తెలంగాణ విభజన, ఏపీలో జగన్ ఓటమి, 2019 ఎన్నికల్లో జగన్ ఎన్నికల్లో గెలిచి ముఖ్యమంత్రి కావడం, జగన్ తో సోదరి షర్మిలకు విభేదాలు, తెలంగాణలో షర్మిల పార్టీ, తెలంగాణ ఎన్నికల అనంతరం పార్టీ కాంగ్రెస్ లో విలీనం, ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలిగా షర్మిల, కడప ఎంపీగా పోటీ, ఓటమి, జగన్ పార్టీ ఘోర పరాజయం కావడం జరిగింది.

గత ఎన్నికల్లో ఆంధ్రాలో జగన్ పరాజయం వెనక సొంత చెల్లెలు షర్మిల ఆరోపణలు సంచలనంగా నిలిచాయి. ఎన్నికల్లో కేవలం 11 సీట్లకు పరిమితం అయిన జగన్, ఆయన తీవ్ర నైరాశ్యంలో ఉన్నారు.

అయితే ఈ నెల 8న వైఎస్ జయంతి నేపథ్యంలో వైఎస్ షర్మిల విజయవాడలో పెద్ద ఎత్తున జయంతి కార్యక్రమం తలపెట్టింది. దీనికి ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ, కాంగ్రెస్ అధ్యక్షుడు ఖర్గే, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్, ఉప ముఖ్యమంత్రి భట్టి, మంత్రులు పొన్నం, దామోదర రాజనర్సింహలను ఆహ్వానించింది. ఇక కర్ణాటకకు వెళ్లి బుధవారం కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ ను కలిసి వేడుకలకు ఆహ్వానించింది.

ఈ నేపథ్యంలో అసలు షర్మిల వ్యూహం ఏంటి ? ఎన్నికల్లో ఓటమితో సొంత సోదరుడు నిరుత్సాహంగా ఉన్న పరిస్థితుల్లో షర్మిల ఏ ఆలోచనతో ఈ కార్యక్రమం చేస్తుంది అన్న చర్చ నడుస్తుంది. ఏపీలో చంద్రబాబు ఎలాగూ షర్మిలకు సాయం చేసే పరిస్థితి ఉండదు. ఇప్పట్లో అక్కడ కాంగ్రెస్ వచ్చే పరిస్థితి లేదు. మరి షర్మిల హడావిడి ఎందుకు అన్న చర్చ నడుస్తుంది. ఇక షర్మిల ఆహ్వానించిన వారిలో ఎంత మంది ప్రముఖులు వస్తారన్నది అంతుచిక్కని ప్రశ్నే.

This post was last modified on July 3, 2024 3:56 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

ప్రీమియర్లు క్యాన్సిల్… ఫ్యాన్స్ గుండెల్లో పిడుగు

ఊహించని షాక్ తగిలింది. ఇంకో రెండు గంటల్లో అఖండ 2 తాండవంని వెండితెరపై చూడబోతున్నామన్న ఆనందంలో ఉన్న నందమూరి అభిమానుల…

9 minutes ago

‘పరదాల్లో పవన్’ అన్న వైసీపీ ఇప్పుడేమంటుందో?

ఏపీ మాజీ సీఎం జగన్ తన పాలనలో ప్రజా పర్యటనల సందర్భంగా పరదాలు లేనిదే అడుగు బయటపెట్టరు అన్న టాక్…

2 hours ago

చైతూ వివాహ వార్షికోత్సవం… దర్శకుడి పోస్టు వైరల్

ఏడాది కిందట అక్కినేని నాగచైతన్య, శోభిత ధూళిపాళ్ళల పెళ్లి జరిగింది. సన్నిహితుల మధ్య కొంచెం సింపుల్‌‌గా పెళ్లి చేసుకుంది ఈ…

2 hours ago

కోహ్లీ… 2,462 రోజుల సెంటిమెంట్ బ్రేక్

విరాట్ కోహ్లీ సెంచరీ కొట్టాడంటే టీమిండియా గెలిచినట్టే అని ఒక నమ్మకం ఉంది. కానీ రాయ్‌పూర్ వేదికగా జరిగిన రెండో…

2 hours ago

ఉభయకుశలోపరి… తెలంగాణ ‘అఖండ’ 2 ధరలు

ఎప్పుడూ లేనిది ఒక పెద్ద హీరోకు తెలంగాణ టికెట్ రేట్ల పెంపు బాగా ఆలస్యమయ్యింది. జూబ్లీ హిల్స్ ఎన్నికల ప్రచారంలో…

3 hours ago

అఖండ హీరోయిన్ ను ఎందుకు తీసేసారో లీక్ చేసిన బాలయ్య

నందమూరి బాలకృష్ణ-బోయపాటి శ్రీనుల కలయికలో వచ్చిన బ్లాక్ బస్టర్ మూవీ ‘అఖండ’లో ప్రగ్యా జైశ్వాల్  కథానాయికగా నటించిన సంగతి తెలిసిందే.…

3 hours ago