Political News

టీడీపీ ఆఫీసుపై దాడి చేసిన వారి అరెస్టు

జగన్ హయాంలో టీడీపీ నేతలు మొదలు టీడీపీ ఆఫీసుల వరకు అన్నింటిపై దాడులు చేయడమే వైసీపీ నేతలు పనిగా పెట్టుకున్న సంగతి తెలిసిందే. నాటి మాజీ ముఖ్యమంత్రి, ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు ఇంటిపై వైసీపీ ఎమ్మెల్యే జోగి రమేష్ దాడికి పాల్పడే ప్రయత్నం చేయడం అప్పట్లో సంచలనం రేపింది. ఇక అదే రీతిలో 2021లో టీడీపీ కేంద్ర కార్యాలయంపై కూడా గతంలో వైసీపీ కార్యకర్తలు దాడి చేసి ఫర్నిచర్, అద్దాలు ధ్వంసం చేశారు. ఈ నేపథ్యంలోనే వైసీపీ పాలనలో ఆ కేసు ఓ కొలిక్కి రాలేదు. నిందితులు అరెస్ట్ కాలేదు.

ప్రస్తుతం ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి రావడంతో తాజాగా ఆ కేసుకు సంబంధించి ఐదుగురు వైసీపీ కార్యకర్తలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారందరినీ మంగళగిరి రూరల్ పోలీస్ స్టేషన్ కు తరలించారు. గుంటూరుకు చెందిన వెంకటరెడ్డి, మస్తాన్ వలి, దేవానందం, రాంబాబు, మొహిద్దీన్ తదితరులు టీడీపీ కేంద్ర కార్యాలయంపై దాడి చేసినట్లుగా పోలీసులు గుర్తించారు. 2021 అక్టోబర్ 19న టీడీపీ కేంద్ర కార్యాలయం పై రాడ్లు, కర్రలు, రాళ్లతో వైసీపీ మూకలు దాడికి తెగ బడ్డాయి.

అయితే, ప్రభుత్వం మారిన నేపథ్యంలో పోలీసులు నాలుగు బృందాలుగా విడిపోయి నిందితులను గుర్తుపట్టే పనిలో పడ్డారు. సీసీ కెమెరాల ద్వారా ఈ విధ్వంసానికి పాల్పడిన వారిని గుర్తించి వారిని అదుపులోకి తీసుకున్నారు. ఈ నేపథ్యంలోనే గుంటూరుకు చెందిన వైసీపీ నేతలు, కార్యకర్తలు, ఈ దాడిలో ఎక్కువగా పాల్గొనట్టుగా పోలీసులు నిర్ధారించారు. ఆ క్రమంలో గాలింపు చర్యలు చేపట్టుగా నిందితుల్లో చాలామంది అజ్ఞాతంలోకి వెళ్లినట్టుగా తెలుస్తోంది.

మరికొందరు టిడిపిలో చేరుతామని, అరెస్టు చేయొద్దని రాయబారాలు కూడా పంపుతున్నట్టుగా తెలుస్తోంది. అయినప్పటికీ గుంటూరుకు చెందిన కార్పొరేటర్లు, మాజీ కార్పొరేటర్లు, వైసిపి నేతలు, విద్యార్థి విభాగం నాయకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్టుగా తెలుస్తోంది. వారిలో కొందరిని అరెస్టు చేయగా మరికొందరి కోసం ముమ్మరంగా గాలింపు చర్యలు చేపట్టినట్టుగా తెలుస్తోంది.

This post was last modified on July 3, 2024 3:21 pm

Share

Recent Posts

ప్రభాస్ సినిమాల లెక్కలన్నీ తారుమారు

కొన్ని రోజులుగా ఉన్న అనుమానాలు ఈ రోజు మరింత బలపడిపోయాయి. ప్రభాస్ కొత్త సినిమా ‘ఫౌజి’ మరోసారి వాయిదా పడబోతోందని…

40 minutes ago

అమరావతి సౌండ్ లడఖ్ వరకు వెళ్లిందా?

అమరావతి సౌండ్ లడఖ్ వరకు వినిపిస్తోందా..? ఇక్కడి విపక్షానికి మాత్రం అది వినిపించడం లేదా..? అమరావతి రాజధాని అంశానికి సంబంధించిన…

1 hour ago

జనసేనకు 50 నుంచి 60.. బొలిశెట్టి వారి లెక్క‌లు!

జ‌న‌సేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ల్యాణ్ ఎంత చెబుతున్నా.. కొంద‌రు నాయ‌కులు త‌మ పంథాను మార్చుకోవ‌డం లేదు.…

3 hours ago

ఢిల్లీ అష్ట‌దిగ్భంధం… ఏంటీ `బ్రిక్స్ స‌ద‌స్సు`?

దేశ రాజ‌ధాని ఢిల్లీ.. ఈ నెల 11 నుంచి 14వ తేదీ వ‌ర‌కు పోలీసుల ప‌హారాలో ఉండ‌నుంది. దాదాపు న‌గ‌రం…

7 hours ago

చిన్న శ్రీను శాంపిల్ మాత్ర‌మే.. మ‌రింత మంది సైకిల్ ఎక్కేస్తారా?

వైసీపీకి డేంజ‌ర్ బెల్స్ మోగుతున్నాయా.. ఉత్త‌రాంధ్రలో తాజాగా చోటు చేసుకున్న చిన్న శ్రీను వ్య‌వ‌హారంతో పాటు.. పార్టీలో మ‌రింత మంది…

11 hours ago

ఏఐ వాడకం… ముంచుకొస్తున్న ప్రమాదం

జాంబీ సినిమాలో వైరస్ లాగా ఏఐ వాడకం క్రమంగా టెకీస్ నుంచి సామాన్యుల చేతుల్లోకి వెళ్ళిపోతోంది. ఒకరేమో వారణాసిలో మహేష్…

11 hours ago