Political News

త్యాగానికి పెద్దపీట వేసిన చంద్రబాబు

1999 సెప్టెంబరు 4న హైదరాబాదులోని సంజీవరెడ్డి నగర్ ట్రాఫిక్ కూడలి వద్ద ఐపీఎస్ అధికారి ఉమేశ్ చంద్రను నలుగురు నక్సలైట్లు కాల్చి చంపిన విషయం తెలిసిందే.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లో క్రిమినల్స్, ఫ్యాక్షనిస్టు లు, మావోయి స్టులపై ఉక్కు పాదం మోపిన దివంగత ఐపీఎస్,ఆఫీసర్ ఉమేశ్ చంద్ర భార్య నాగరాణి తాజాగా పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ గా నియమి తులయ్యారు.

ఉమేష్ చంద్ర హత్య జరిగినప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు ఆయన సేవలకు గౌరవంగా ఆయన సతీమణి నాగరాణికి అప్పట్లో డిప్యూటీ కలెక్టర్ ఉద్యోగం ఇచ్చారు.

ఆమె అనేక పదోన్నతులు పొందుతూ వస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇటీవల ఆంధ్రప్రదేశ్ లో అధికారంలోకి తెలుగుదేశం ప్రభుత్వం రావడం, చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిన నేపథ్యంలో పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ గా బాధ్యతలు బాధ్యతలు అప్పగించడం విశేషం. ఉమేష్ చంద్ర త్యాగాన్ని గుర్తుపెట్టుకుని చంద్రబాబు పోస్టింగ్ ఇచ్చారని ప్రశంసలు కురిపిస్తున్నారు.

1991 ఐపీఎస్ బ్యాచ్ కు చెందిన ఉమేష్ చంద్ర కడప జిల్లా ఎస్పీగా శాంతిభద్రతలు నెలకొల్పి “కడప పులి” అనే పేరు తెచ్చుకున్నాడు. 1999 సెప్టెంబరు 4న హైదరాబాదులో కారులో వెళ్తూ సంజీవరెడ్డి నగర్ ట్రాఫిక్ కూడలి వద్ద ఆగగా నలుగురు నక్సలైట్లు ఆ కారుపై కాల్పులు జరిపారు. అతని అంగ రక్షకుడు, డ్రైవరు వెంటనే మరణించారు. ఉమేశ్ చంద్ర కారు దిగి నక్సలైట్లను తరిమి వెంటాడారు. అతని వద్ద పిస్తోలు లేదని గ్రహించిన నక్సలైట్లు ఆగి లు కాల్పులు జరపడంతో ఆయన మరణించారు.

This post was last modified on July 3, 2024 12:56 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

ప్రసాదుగారు మళ్ళీ సిక్సు కొట్టేశారు

మన శంకరవరప్రసాద్ గారు నుంచి మరో పాట వచ్చేసింది. నిజానికీ రిలీజ్ రేపు జరగాలి. కానీ ఒక రోజు ముందుగా…

44 minutes ago

వరల్డ్ కప్ పై గంభీర్ ఘాటు రిప్లై, వాళ్లిద్దరి గురించేనా?

సౌతాఫ్రికాతో వన్డే సిరీస్ విజయం తర్వాత టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ తనదైన స్టైల్లో స్పందించారు. 2027 వరల్డ్…

1 hour ago

గోవా ప్రమాదం.. అసలు తప్పు ఎక్కడ జరిగింది?

గోవా ట్రిప్ అంటే ఫుల్ ఎంజాయ్ అనుకుంటాం. కానీ ఆరపోరాలోని 'బర్చ్ బై రోమియో లేన్' అనే నైట్ క్లబ్…

2 hours ago

పడయప్ప… తెలుగులో కూడా రావాలప్ప

సూపర్ స్టార్ రజనీకాంత్ కెరీర్ లో బెస్ట్ మూవీస్ అంటే వెంటనే గుర్తొచ్చే పేర్లు భాష, నరసింహ, దళపతి. వీటిని…

2 hours ago

‘చిన్న చోరీ’ చేసిన దొంగకు ఉన్న పశ్చాతాపం జగన్ కు లేదా?

తాను చేసింది మహా పాపమే అంటూ.. పరకామణి చోరీ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న నిందితుడు రవికుమార్ తెలిపారు. ఈ వ్యవహారంలో…

3 hours ago

ఇండి’గోల’పై కేటీఆర్ ‘పెత్తనం’ కామెంట్స్

బీఆర్ ఎస్ కార్యనిర్వాహ‌క అధ్య‌క్షుడు, మాజీమంత్రి కేటీఆర్ తాజాగా కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. అధికారం ఒక‌రిద్ద‌రి చేతుల్లో ఉంటే.. ఇలాంటి…

5 hours ago