Political News

త్యాగానికి పెద్దపీట వేసిన చంద్రబాబు

1999 సెప్టెంబరు 4న హైదరాబాదులోని సంజీవరెడ్డి నగర్ ట్రాఫిక్ కూడలి వద్ద ఐపీఎస్ అధికారి ఉమేశ్ చంద్రను నలుగురు నక్సలైట్లు కాల్చి చంపిన విషయం తెలిసిందే.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లో క్రిమినల్స్, ఫ్యాక్షనిస్టు లు, మావోయి స్టులపై ఉక్కు పాదం మోపిన దివంగత ఐపీఎస్,ఆఫీసర్ ఉమేశ్ చంద్ర భార్య నాగరాణి తాజాగా పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ గా నియమి తులయ్యారు.

ఉమేష్ చంద్ర హత్య జరిగినప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు ఆయన సేవలకు గౌరవంగా ఆయన సతీమణి నాగరాణికి అప్పట్లో డిప్యూటీ కలెక్టర్ ఉద్యోగం ఇచ్చారు.

ఆమె అనేక పదోన్నతులు పొందుతూ వస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇటీవల ఆంధ్రప్రదేశ్ లో అధికారంలోకి తెలుగుదేశం ప్రభుత్వం రావడం, చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిన నేపథ్యంలో పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ గా బాధ్యతలు బాధ్యతలు అప్పగించడం విశేషం. ఉమేష్ చంద్ర త్యాగాన్ని గుర్తుపెట్టుకుని చంద్రబాబు పోస్టింగ్ ఇచ్చారని ప్రశంసలు కురిపిస్తున్నారు.

1991 ఐపీఎస్ బ్యాచ్ కు చెందిన ఉమేష్ చంద్ర కడప జిల్లా ఎస్పీగా శాంతిభద్రతలు నెలకొల్పి “కడప పులి” అనే పేరు తెచ్చుకున్నాడు. 1999 సెప్టెంబరు 4న హైదరాబాదులో కారులో వెళ్తూ సంజీవరెడ్డి నగర్ ట్రాఫిక్ కూడలి వద్ద ఆగగా నలుగురు నక్సలైట్లు ఆ కారుపై కాల్పులు జరిపారు. అతని అంగ రక్షకుడు, డ్రైవరు వెంటనే మరణించారు. ఉమేశ్ చంద్ర కారు దిగి నక్సలైట్లను తరిమి వెంటాడారు. అతని వద్ద పిస్తోలు లేదని గ్రహించిన నక్సలైట్లు ఆగి లు కాల్పులు జరపడంతో ఆయన మరణించారు.

This post was last modified on July 3, 2024 12:56 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

ఐపీఎస్ సునీల్.. అలా రిటైర్ కావాల్సిందేనా?

వైసీపీ హయాంలో అప్పటి సీఎం జగన్ కనుసన్నల్లో పనిచేసిన అధికారులు రూల్స్‌ను పక్కన పెట్టి ఇష్టానుసారంగా వ్యవహరించారని ఆరోపణలు ఉన్నాయి.…

5 hours ago

అమరావతిలో కొత్త నిర్ణయం: పేదలకు నష్టం లేకుండా మార్పు

జగన్ హయాంలో తీసుకున్న పలువురు నిర్ణయాలు రాష్ట్రాన్ని వెనక్కి నెట్టాయని, ముఖ్యంగా ఆర్థికంగానే కాకుండా రాజధాని పరంగా కూడా రాష్ట్రానికి…

6 hours ago

మరి కొద్ది గంటల్లో పెళ్లి.. అక్కచెల్లెళ్లు మృతి?

రాజస్థాన్ రాష్ట్రంలోని జోధ్‌పూర్ జిల్లా మనాయ్ గ్రామంలో శనివారం జరగాల్సిన వివాహ కార్యక్రమాలకు కొద్దిగంటల ముందు ఇద్దరు అక్కచెల్లెళ్లు అనుమానాస్పద…

6 hours ago

ప‌వ‌న్‌కు షారుఖ్ రేంజిలో ఇస్తామ‌న్నా..

ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ ప్ర‌క‌ట‌న‌లు చేస్తానంటే ఆయ‌న‌కు భారీ పారితోష‌కం ఇవ్వ‌డానికి బోలెడ‌న్ని కంపెనీలు ముందుకు వ‌స్తాయి. కానీ…

6 hours ago

కోర్టు హీరోయిన్ నెమ్మదిగా నడవాలంట

గత ఏడాది నాని నిర్మించిన కోర్టుతో పరిచయమైన హీరోయిన్ శ్రీదేవి అప్పల అందులో టీనేజ్ కొచ్చిన కాలేజీ అమ్మాయిగా నటనతో…

7 hours ago

సూపర్ 8లో టీమిండియాకు సఫారీ షాక్

టీ20 వరల్డ్ కప్ గ్రూప్ స్టేజ్ లో వరుస విజయాలతో దూసుకువచ్చిన టీమిండియాకు సూపర్ 8 ఆరంభంలోనే ఊహించని ఎదురుదెబ్బ…

7 hours ago