ఏపీలో వ్యవస్థలు ధ్వంస మయ్యాయని, గాడితప్పాయని.. ఎన్నికలకు ముందు ప్రచారం చేసిన చంద్రబా బు.. తాను అధికారంలోకి వచ్చిన తర్వాత.. వాటిని గాడిలో పెట్టే ప్రయత్నం చేస్తున్న విషయం తెలిసిం దే. ఈ క్రమంలో ఇప్పటికే.. ఐఏఎస్, ఐపీఎస్లను మార్పు చేశారు. కీలక పోస్టుల్లో ఉండి.. అవినీతి, అక్ర మాల ఆరోపణలు ఎదుర్కొంటున్న అధికారులను పక్కకు పెట్టి.. నిజాయితీగా వ్యవహరించే వారికి అవకా శం కల్పించారు. అదేవిధంగా ఉద్యోగుల విషయంలోనూ.. పెద్ద మార్పులకు శ్రీకారం చుట్టారు.
ఒక రకంగా.. వ్యవస్థను చక్కదిద్దుతానన్న చంద్రబాబు.. ఆదిశగా బలమైన అడుగులు వేశారు. ఇక, ఇప్పు డు ప్రక్షాళన దాదాపు పూర్తయింది. ఇంటెలిజెన్స్ నుంచి ఏసీబీ వరకు.. సీఐడీ నుంచి సాధారణ పోలీసు వరకు కూడా.. చంద్రబాబు మార్పులు చేశారు. ఈ నేపథ్యంలో ఇప్పుడు ఆయన పూర్తి స్థాయిలో పాలనపై దృష్టి పెట్టారు. గత ఐదేళ్లుగా ఎదుర్కొంటున్న కీలక సమస్యలను పరిష్కరించేందుకు ప్రాధాన్యం ఇస్తు న్నారు. దీనిలో భాగంగా.. ఇసుకను పేదలకు ఉచితంగా ఇచ్చే పాలసీపై అధ్యయనం చేయాలని.. అధికా రులను పురమాయించారు.
వర్షాకాలం ముగిసే నాటికి ఉచిత ఇసుక విధానాన్ని అందుబాటులోకి తీసుకురానున్నారు. ఇది అందు బాటులోకి రావడం ద్వారా.. భవన నిర్మాణ రంగం పుంజుకుంటుందని చంద్రబాబు అంచనా వేస్తున్నారు. అదేవిధంగా నిత్యావసరాల ధరల తగ్గింపుపైనా..చంద్రబాబు దృష్టి పెట్టారు. కూరగాయలు, నూనె, పంచదార, బియ్యం ధరలను బహిరంగ మార్కెట్లో కట్టడి చేసేందుకు యుద్ధప్రాతిపదికన చర్యలు తీసుకోవాలని ఆయన సంబంధిత అదికారులను ఆదేశించారు.
ఇది నాణేనికి ఒక వైపు అయితే.. మరోవైపు రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకువచ్చేందుకు కూడా.. చంద్రబా బు ప్రయత్నిస్తున్నారు. రాష్ట్రంలో పెట్టుబడులకు ఉన్న అవకాశాలు.. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ద్వా రా.. అందించే సౌలభ్యాలను ఆయన విదేశీ పత్రికల్లో ప్రకటనల ద్వారా.. వివరించాలని నిర్ణయించారు. తద్వారా.. రాష్ట్రానికి పెట్టుబడులు సాదించేందుకు అవకాశం ఉంటుందని లెక్కలు వేసుకుంటున్నారు. పైగా సుదీర్ఘ తీర ప్రాంతం కూడా కలిసి రానుంది. ఇలా.. అటు ప్రజలు-ఇటు పెట్టుబడులు-మరోవైపు పాలన దిశగా చంద్రబాబు అడుగులు ప్రారంభించారు.
ఇండస్ట్రీ, ప్రేక్షకుల్లో టాపిక్ పాతదే అయినా మరోసారి కొత్త డిబేట్ మొదలయ్యింది. లెనిన్ ప్రమోషన్లలో భాగంగా ఒక ఇంటర్వ్యూలో నిర్మాత…
ఈ నెల విడుదలవుతున్న సినిమాల్లో చెన్నై లవ్ స్టోరీ మీద మంచి అంచనాలున్నాయి. దర్శకుడు రవి నంబూరి అయినప్పటికీ, కథ…
సలార్ లో వరదరాజ మన్నార్ గా తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన మలయాళ హీరో పృథ్విరాజ్ సుకుమారన్ ఆ తర్వాత తెలుగులో…
మొన్న విడుదలైన రావు బహదూర్ సినిమాకు కొందరు విమర్శకుల ప్రశంసలు దక్కాయి. ఫస్ట్ హాఫ్ మరీ నెమ్మదిగా ఉన్నా సెకండాఫ్…
తెలుగులో ఒకప్పుడు చిన్న సినిమాల కథానాయకుడిగా చాలా ఏళ్ల పాటు కెరీర్ను నడిపించాడు శివాజీ. కానీ తర్వాత అతడి మనసు…
ఏపీలో ప్రతిపక్షంగా ఉన్న వైసీపీలో చీలిక రానుందా? ఆ పార్టీ నాయకులు చీలిపోవడమో.. లేక కూటమిలోని ఓ పార్టీలో చేరిపోవడమో…