సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ అధినేత జగన్కు.. ప్రజలు భారీ షాక్ ఇచ్చారు. దీని నుంచి ఆయన ఇంకా కోలుకోలేదు. మనశ్శాంతి కోసం సొంత నియోజకవర్గం పులివెందులకు వెళ్లారు. అక్కడ కాంట్రాక్టర్లు బిల్లుల కోసం.. తిప్పలు పెట్టారు. ఇక, తర్వాత.. బెంగళూరు వెళ్లారు. అక్కడ కూడా.. మనసు స్థిరంగా లేదు. అయినా.. అక్కడే ఉండి తాజాగా 1వ తారీకు.. తాడేపల్లికి వచ్చారు. గతంలో మాదిరిగా ఆయనకు ఘన స్వాగతాలు దక్కలేదు. నాయకులు క్యూలో నిలబడి బొకేలు కూడా ఇవ్వలేదు. ఇదొక షాక్.
మరోవైపు.. ప్రభుత్వం పరంగా..సీఎం చంద్రబాబు మరో భారీ షాక్ ఇచ్చారు. అసలు ఇవ్వరు.. పెంచేయడం అయితే.. పెంచేస్తారు. ఇంటికి కిలో బంగారం కూడా ఇస్తామని చెబుతారని ఎన్నికలకు ముందు చంద్రబాబుపై తీవ్ర ప్రచారం చేసిన.. జగన్కు షాకిస్తూ.. 1వ తేదీ.. పెంచిన పింఛనును.. బకాయిలతో కలిపి ఏకంగా 4 వేల కోట్ల రూపాయలకు పైగా.. లబ్ధిదారులకు చంద్రబాబు పంపిణీ చేశారు. దీంతో జగన్ మాటల డొల్లతనాన్నిఆయన ఎండగట్టినట్టయింది.
ఇదేసమయంలో కేవలం వలంటీర్లు మాత్రమే చేయగలర్న ఈ కార్యక్రమాన్ని సచివాలయ సిబ్బందితో చేయించిన.. చంద్రబాబు రాత్రి 10 గంటల సమయానికి 96 శాతం మందికి పింఛన్లు పంపిణీ చేయడం పూర్తి చేయించారు. ప్రతి గంటకూ మానిటరింగ్ చేశారు. ఫలితంగా.. పింఛన్ల పంపిణీలో వలంటీర్లు లేకపో యినా.. ఇంటింటికీ తిరిగి ఇవ్వొచ్చని చంద్రబాబు నిరూపించారు. ఇది మరింత షాక్. నిజానికి చంద్రబాబు సర్కారు ఏర్పడి 18 రోజులు అయింది. ఫలితాలు వచ్చి 26 రోజులు అయింది.
ఇంతలోనే.. 4 వేల కోట్లను పింఛన్ల రూపంలో పంపిణీ చేయడం అంటే.. తొలి విజయం చంద్రబాబు దక్కించుకున్నట్టు అయింది. అంతేకాదు.. ఊరూవాడా కూడా.. ఆయనకు బ్రహ్మరథం పట్టారు. ఈ పరిణామం.. వైసీపీకి మరింత ఇబ్బందిగా మారింది. సంక్షేమం అంటే.. తమవల్లే సాధ్యమవుతుందని.. తమకే పేటెంట్ ఉందని.. చెప్పుకొన్న జగన్కు.. ఇప్పుడు నోట మాటరాకుండా.. మాట్లాడేందుకు ఏమీ లేకుండా పోయిందని అంటున్నారు పరిశీలకులు. మొత్తానికి ఫస్ట్ స్టెప్లోనే జగన్ కు బాబు భారీ షాక్ ఇచ్చారని అంటున్నారు.
This post was last modified on July 2, 2024 3:03 pm
ఏపీ సీఎం చంద్రబాబుకు ప్రముఖ దినపత్రిక `ఎకనమిక్ టైమ్స్`.. ప్రతిష్టాత్మక వ్యాపార సంస్కర్త-2025 పురస్కారానికి ఎంపిక చేసిన విషయం తెలిసిందే.…
బంగ్లాదేశ్లో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులు భారత్కు పెద్ద తలనొప్పిగా మారాయి. 1971 విముక్తి యుద్ధం తర్వాత మన దేశానికి ఇదే…
ప్రేమ ఎప్పుడు ఎవరి మీద పుడుతుందో చెప్పలేం అంటారు. కానీ జపాన్ లో జరిగిన ఈ పెళ్లి చూస్తే టెక్నాలజీ…
ప్రభుత్వం తరఫున ఖర్చుచేసేది ప్రజాధనమని సీఎం చంద్రబాబు తెలిపారు. అందుకే ఖర్చు చేసే ప్రతి రూపాయికీ ఫలితాన్ని ఆశిస్తానని చెప్పారు.…
`వ్యాపార సంస్కర్త-2025` అవార్డును ఏపీ సీఎం చంద్రబాబు కైవసం చేసుకున్నారు. అయితే.. దేశవ్యాప్తంగా 28 రాష్ట్రాలు, 28 మంది ముఖ్యమంత్రులు…
మెడికల్ కాలేజీలను సొంతం చేసుకున్న వారిని తాను అధికారం లోకి రాగానే రెండు నెలల్లో జైలుకు పంపుతాను అన్న వైఎస్…