Political News

పరదాల సీఎం టు ప్రజా సీఎం

ఏపీ మాజీ సీఎం జగన్ కు పరదాల ముఖ్యమంత్రి అన్న పేరు కూడా ఉన్న సంగతి తెలిసిందే. జగన్ ఎక్కడకు వెళ్లినా పరదాలు కట్టడం, ఆ దారిలో చెట్లు కొట్టడం వంటి కార్యక్రమాలతో ఇటు అధికారులు, అటు పోలీసులు, ఇటు ప్రజలకు విసిగి పోయారు.

కట్ చేస్తే, ఏపీ సీఎంగా చంద్రబాబు రాగానే పరదాలు తీసేసి ప్రజల మధ్య తిరుగుతూ ప్రజా ముఖ్యమంత్రిగా మారారు. ఆ క్రమంలోనే తాను మాట ఇచ్చిన విధంగా ఆంధ్రప్రదేశ్లో జూలై 1వ తేదీ నుంచి రూ.4వేల పెన్షన్ పంపిణీకి స్వయంగా ఆయనే శ్రీకారం చుట్టారు.

ఉదయం 6 గంటలకు స్వయంగా పెన్షన్ పంపిణీ కార్యక్రమాన్ని చంద్రబాబు ప్రారంభించారు. ఎన్టీఆర్ భరోసా సామాజిక పెన్షన్ల పంపిణీని చంద్రబాబు ఈరోజు ఉదయం మంగళగిరిలోని పెనుమాక ఎస్సీ కాలనీల లబ్ధిదారుడి ఇంటికి స్వయంగా వెళ్లి అందించారు.

అతడికి రూ.7000 పెన్షన్ అందజేసిన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్ల పంపిణీ మొదలైంది. రాష్ట్రవ్యాప్తంగా మొదలైన పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో ఎక్కడికక్కడ అధికార పార్టీకి చెందిన ప్రజాప్రతినిధులు పెన్షన్ పంపిణీ చేశారు.

మంగళగిరిలో పెన్షన్ పంపిణీ సందర్భంగా చంద్రబాబు వెంట మంత్రి నారా లోకేష్, పలువురు అధికారులు ఉన్నారు. తొలిరోజే 100% పంపిణీ పూర్తి చేయాలని ఏపీ సిఎస్ నీరభ్ కుమార్ ను చంద్రబాబు ఆదేశించారు.

కొన్నిచోట్ల ఎక్కువ మందికి పెన్షన్ ఇవ్వాల్సిన పరిస్థితుల్లో అంగన్వాడీ, ఆశా కార్యకర్తలను వాడుకోవాలని అధికారులు నిర్ణయించుకున్నట్లుగా తెలుస్తోంది. ఇక, తొలి రోజు పెన్షన్ అందుకోలేకపోయిన వారికి రెండో రోజు ఇళ్ల వద్దకే సిబ్బంది వచ్చి పెన్షన్ అందజేయనున్నారు. ఈ సందర్భంగా చంద్రబాబుపై సోషల్ మీడియాలో ప్రశంసలు కురుస్తున్నాయి పరదాల ముఖ్యమంత్రి పోయి ప్రజా ముఖ్యమంత్రి వచ్చాడని చంద్రబాబుపై నెటిజనులు ప్రశంసలు కురిపిస్తున్నారు.

This post was last modified on July 2, 2024 9:52 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

ఫిక్స్… మూడో భాగం ఛాన్స్ లేదు

బాక్సాఫీస్ వద్ద ర్యాంపేజ్ చూపిస్తున్న దురంధర్ ది రివెంజ్ కు సంబంధించి ఒక ముఖ్యమైన ప్రశ్న అందరి మెదళ్లను తొలిచేసింది.…

2 hours ago

పవన్ పట్టుకు బాలినేని లొంగిపోయారా?

బాలినేని శ్రీనివాస రెడ్డి జనసేనలో చేరిన తర్వాత పెద్దగా యాక్టివ్ గా లేని సంగతి తెలిసిందే. అధికారికంగా జనసేన నిర్వహించే…

3 hours ago

ఊపిరి పీల్చుకుంటున్న తెలుగు థియేటర్లు

ఫిబ్రవరితో మొదలుపెట్టి మార్చి రెండో వారం దాకా పట్టుమని వారం రోజులు హౌస్ ఫుల్ చేసే సినిమా లేక గగ్గోలు…

3 hours ago

డిజిటల్ మోసాల బారిన పడినోళ్లకు పరిహారం, కానీ…

కొన్నిసార్లు అవగాహన రాహిత్యంతో డిజిటల్ మోసాల బారిన పడతాం. అలాంటి వారి విషయంలో ఇప్పటివరకు ఎప్పుడూ లేని విధంగా పరిహారం…

5 hours ago

అసలే కిమ్… ఎన్నికల్లో ఓట్లు వేయకపోతే…

ప్రపంచంలోని మూర్ఖ పాలకుల జాబితాను తీస్తే.. అందులో మొదటి ముగ్గురు పాలకుల్లో ఒకరుగా నిలుస్తారు కింగ్ జోంగ్ ఉన్. తన…

6 hours ago

‘ధూరందర్’ దర్శకుడు… మాములోడు కాదు

బాలీవుడ్‌లో స్టార్ పవర్ కంటే కేవలం కథను నమ్మి సినిమాలు తీసే దర్శకులు చాలా తక్కువ మంది ఉంటారు. అందులో…

6 hours ago