లోక్సభలో ప్రతిపక్ష నేతగా రాహుల్ గాంధీ చాలాసార్లు అవమానాలే ఎదుర్కొన్నాడు. ఆయన ప్రసంగాల వీడియోలు గతంలో చాలా వరకు ట్రోలింగ్కే ఉపయోగపడ్డాయి. సరిగా మాట్లాడలేడని.. సబ్జెక్ట్ ఉండదని భాజపా వాళ్లు ఆయన్ని ఎప్పుడూ ఎగతాళి చేస్తుంటారు.
ఐతే ఏ నాయకుడైనా కొన్నేళ్ల పాటు కష్టపడితే ఎదుగుదల ఉంటుందని.. సబ్జెక్ట్ పెంచుకోవడానికి ఒక పద్ధతి ప్రకారం కష్టపడితే ఫలితం ఉంటుందని.. జనాల్లో తిరిగితే ఆదరణ దానికంతట అదే వస్తుందని రాహుల్ గాంధీ విషయంలోనూ రుజువవుతోంది.
గత కొన్నేళ్లలో రాహుల్ రాజకీయ నాయకుడిగా ఎంతో ఎదిగాడన్నది స్పష్టం. ఆయన ప్రసంగాలు కూడా ఇప్పుడు బాగా ఆకట్టుకుంటున్నాయి. గతంలో లోక్సభలో మోడీని ఎదుర్కోలేక ఢీలా పడ్డ రాహుల్.. ఇప్పుడు మోడీతో పాటు భాజపా సభ్యులందరినీ ఇరుకున పెట్టి డిఫెన్స్లోకి నెట్టేస్తున్నాడు.
సోమవారం లోక్సభలో రాహుల్ గాంధీ ప్రసంగం చూస్తే బీజేపీ ఎంత డిఫెన్స్లో పడిందో అర్థమవుతుంది. మోడీనే కాక ఆ పార్టీ తరఫున కొత్త స్పీకర్గా నియమితుడైన ఓం బిర్లాను కూడా ఉక్కిరిబిక్కిరి చేసేశాడు రాహుల్ గాంధీ.
ఓం బిర్లా సభాపతిగా నియమితుడైనపుడు.. తనకు షేక్ హ్యాండ్ ఇచ్చినపుడు నిటారుగా నిలబడ్డారని.. కానీ మోడీ వస్తే మాత్రం వంగి వంగి దండాలెట్టారని హావభావాలతో రాహుల్ గాంధీ చూపించినపుడు సభ హోరెత్తింది.
ఇక బీజేపీని యాంటీ హిందుగా రాహుల్ అభివర్ణించగానే.. మోడీ లేచి హిందువులను రాహుల్ అవమానిస్తున్నాడని పేర్కొనగా.. బీజేపీ హిందుత్వానికి పేటెంట్ తీసుకోలేదంటూ ఘాటుగా స్పందించాడు రాహుల్. దీంతో మోడీ సైలెంట్ అయిపోవాల్సి వచ్చింది.
మరోవైపు శివుడి ఫొటో తెచ్చి తన వెనుక ఉన్న బలం ఆయనే అని రాహుల్ చెబుతుండగా.. కెమెరా రాహుల్ మీది నుంచి ఔట్ ఆఫ్ ఫోకస్ అయిపోవడంతో ఆ విషయాన్ని కూడా ఎక్స్పోజ్ చేస్తూ సభను ఎన్డీయే ప్రభుత్వం నిర్వహిస్తున్న తీరును రాహుల్ దుయ్యబట్టాడు. మొత్తంగా సోమవారం నాటి తన ప్రసంగం, చర్యలతో రాహుల్ గాంధీ సోషల్ మీడియాలో హీరో అయిపోయాడనే చెప్పాలి.
This post was last modified on July 2, 2024 9:08 am
తెలంగాణలో ఆక్రమ కట్టడాలకు సింహ స్వప్నంగా మారిన హైడ్రా విధానంపై హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. తమ మాటంటే హైడ్రాకు…
వైసీపీ నేత, ఫైర్ బ్రాండ్ నాయకుడు, మాజీ మంత్రి జోగి రమేష్ ఫ్యామిలీలో కోడలు చేసిన ఆరోపణలు పెను కుదుపునకు…
సినిమాల్లో రాజకీయ అంశాలు పెట్టాలంటే ఒకటికి రెండుసార్లు ఆలోచించుకోవాల్సిన పరిస్థితులున్నాయి ప్రస్తుతం. తమ నాయకుల మీద పొలిటికల్ కౌంటర్లు వేస్తే…
జన నాయకుడు సినిమా ఎలా ఉందనేది మళ్ళీ చెప్పనవసరం లేదు. విజయ్ ఇమేజ్ పుణ్యమాని రెండు వందల కోట్లు దాటేసింది…
ఏపీలో గత 2 మాసాల కిందటి వరకు తీవ్రస్థాయిలో చర్చనీయాంశం అయిన ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా, ఉండి నియోజకవర్గం…
ప్రజలు, శాంతియుతంగా నిరసన చేస్తున్నవారిని కొట్టే హక్కు పోలీసులకు ఉందా? అని సుప్రీంకోర్టు ప్రశ్నించింది. ఇలా అయితే.. దేశం మొత్తం…