పరదాల ముఖ్యమంత్రి అంటూ ఏపీ మాజీ సీఎం జగన్ పై గత ప్రభుత్వంలో ట్రోలింగ్ జరిగిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ఐటీ శాఖా మంత్రి నారా లోకేష్ కొద్ది రోజుల క్రితం తిరుమల పర్యటన సందర్భంగా జగన్ పరదాలపై చేసిన కామెంట్లు వైరల్ అయ్యాయి. పరదాలు కట్టొద్దన్నా కడుతున్నారేంటి అని అధికారులను అడిగితే…అలవాటులో పొరపాటు అని అధికారులు సమాధానమిచ్చారు. ఇక, తాజాగా ఏపీలో మొదలైన ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ కార్యక్రమం సందర్భంగా పరదాలపై మరోసారి జగన్ సెటైర్లు వేశారు.
ఈ సారి సీఎం చంద్రబాబుకు కూడా అధికారులపై లోకేష్ సున్నితమైన కంప్లయింట్ ఇచ్చారు. ఇంకా కొందరు అధికారులు మారలేదు సార్…పరదాలు కట్టొద్దని చెబుతున్నా వినడం లేదని…బ్రతిమిలాడి తీయిస్తున్నామని లోకేష్ అన్నారు. దీనికి చంద్రబాబుతోపాటు సభలో ఉన్న వారంతా నవ్వారు. ‘సార్.. సెట్ అయ్యేందుకు టైమ్ పడుతుంది అనుకుంటా.?’ అని లోకేష్ అనగానే.. ‘లేదు సెట్ అయ్యారు’ అని సీఎం చంద్రబాబు బదులిచ్చారు.
ఈ ప్రభుత్వంలో ఎలాంటి ఆర్భాటాలు ఉండవని, మళ్లీ అలాంటివి పునరావృతమైతే పరదాలు కట్టిన వారిని సస్పెండ్ చేయడం తప్ప వేరే మార్గం ఉండదని చంద్రబాబు వార్నింగ్ ఇచ్చారు. తాము ఎప్పటికీ ప్రజలకు సేవకులుగానే ఉంటామని, ప్రజలకు ఎప్పుడూ అందుబాటులో ఉంటూ సమస్యల పరిష్కారానికి చర్యలు చేపడతామని చెప్పారు. అలా కాకుండా గత ప్రభుత్వం మాదిరిగా పెత్తందారులుగా ప్యాలెస్లో ఉండబోమని, చరిత్రలో ఎన్నడూ లేని విధంగా కూటమికి ఘన విజయం అందించిన ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకుంటామని చెప్పారు. ప్రస్తుతం జగన్ పరదాలపై లోకేశ్, జగన్ ప్యాలెస్ పాలనపై చంద్రబాబు ర్యాగింగ్ చేసిన వీడియో వైరల్ గా మారింది.
ఏపీలో టీడీపీ-వైసీపీల మధ్య మాటల తూటాలు.. మరింత భారీ రేంజ్లో పేలుతున్నాయి. నిన్న మొన్నటి వరకు టీడీపీ చేసిన వ్యాఖ్యలపై…
వైసీపీ ప్రభుత్వాన్ని మరోసారి రానివ్వను. వైసీపీ వ్యతిరేక ఓటు చీలనివ్వను అంటూ.. 2024 ఎన్నికలకు ముందు భీషణ ప్రతిజ్ఞ చేసిన…
ఏపీ ప్రతిపక్షం(ప్రధాన కాదు) వైసీపీ సోషల్ మీడియాలో దూకుడుగా ఉంటున్న విషయం తెలిసిందే. యూట్యూబ్, ఇన్స్టా, వాట్సాప్, ఫేస్బుక్, ఎక్స్..…
గత ఏడాది తమిళ, తెలుగు భాషల్లో పెద్ద హిట్ అయిన సినిమాల్లో ‘డ్యూడ్’ ఒకటి. లవ్ టుడే, డ్రాగన్ చిత్రాలతో…
బాక్సాఫీస్ వద్ద అద్భుతాలు చేస్తున్న హాలీవుడ్ మూవీ అబ్సెషన్ ఇప్పుడప్పుడే ఆగేలా లేదు. రెండు గంటల లోపే నిడివితో థ్రిల్లర్…
ఏపీలో అధికార కూటమిలో కీలక భాగస్వామి అయిన జనసేన.. దేశ రాజధాని ఢిల్లీలో రేపు ఓ కీలక సమావేశాన్ని నిర్వహిస్తోంది.…