Political News

మాట‌కు మాట‌: వాళ్లు మూడేళ్లు ప‌డ్డారు.. బొత్స గారూ!

మాట‌కు మాట‌… సోష‌ల్ మీడియా ప్ర‌భావం రాజ‌కీయాల‌పై ఎక్కువ‌గానే ఉంది. నాయ‌కులు చేసే వ్యాఖ్య‌లు ఇట్టే వైర‌ల్ అవుతుండ‌డం ఒక ఎత్త‌యితే.. నాయ‌కులు చేసే వ్యాఖ్య‌ల‌పై మేదావులు, సాధార‌ణ ప్ర‌జ‌లు కూడా అంతే వేగంగా రియాక్ట్ అవుతున్నారు. వారు రాజ‌కీయ నేత‌లే కాన‌వ‌స‌రం లేదు..బుద్ధి జీవులు కావొచ్చు. వారు త‌ల‌లు పండిన నేతాశ్రీలే కాక‌పోవ‌చ్చు.. రాజ‌కీయాల పై అవ‌గాహ‌న ఉన్న‌వారు. దీంతో కొంద‌రు నేత‌లు చేసే కామెంట్ల‌కు నెటిజ‌న్లు కూడా అంతే స్థాయిలో స్పందిస్తున్నారు. తాజాగా ఏపీ మాజీ మంత్రి, వైసీపీ సీనియ‌ర్ నేత బొత్స నారాయ‌ణ చేసిన వ్యాఖ్య‌ల‌కు కొంద‌రు నెటిజ‌న్లు మాట‌కు-మాట అన్న‌ట్టు రియాక్ట్ అయ్యారు. అవేంటంటే!

బొత్స‌: రాష్ట్రంలో గత 20 రోజులుగా జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే బాధగా ఉంది. మా పార్టీ కార్యాలయాల్లోకి అధికార పార్టీ నేతలు చొరబడుతున్నారు. గతంలో ఎప్పుడూ ఇలాంటి పరిణామాలు చోటుచేసుకోలేదు.
నెటిజ‌న్‌: ఎంత మాట‌.. ఎంత మాట‌.. జోగి ర‌మేష్ ఏకంగా చంద్ర‌బాబు ఇంటిపై దండెత్తిన విష‌యం మ‌రిచిపోయారా? లేళ్ల అప్పిరెడ్డి బృందం .. మంగ‌ళ‌గిరిలోని టీడీపీ ఆఫీసుపైకి ఎగ‌బ‌డి.. కుప్పిగంతులువేసిన విష‌యం మ‌రిచారా? బొత్స‌గారూ! అయినా.. వాళ్లు మూడేళ్లు మీ బాధ‌లు ప‌డ్డారు. కొట్టించుకున్నారు. కేసులు పెట్టించుకున్నారు. మీరు 20 రోజుల‌కే అల్లాడిపోతే ఎలా?

బొత్స‌: నిబంధనలకు లోబడే వైసీపీ కార్యాలయాల నిర్మాణాలు జరుగుతున్నాయి.
నెటిజ‌న్‌: అయితే.. అనుమ‌తుల ప‌త్రాల‌ను మీరే బ‌య‌ట‌కు ఎందుకు పెట్ట‌కూడ‌దు.? నిబంధ‌న‌ల‌కు విరుద్ధం కాక‌పోతే.. తాడేప‌ల్లిలోని చెరువును ఎలా ఆక్ర‌మించారు. రుషి కొండను బోడిగుండు చేసి.. ఇంద్ర‌భ‌వ‌నాన్ని ఎలా నిర్మించారు. మ‌రిచిపోతే ఎలా స‌ర్‌!!

బొత్స‌: యూనివర్సిటీల్లో వీసీలపైనా దౌర్జన్యాలు జరుగుతున్నాయి. వీసీలను నామినేట్ చేయడం అనేది ఒక విధానం.
నెటిజ‌న్‌: అస‌లు వీసీల‌పై దౌర్జ‌న్యాలు మొద‌లైందే.. 2020లో స‌ర్‌. విశాఖ‌ప‌ట్నం ఆంధ్ర యూనివ‌ర్సిటీ వీసీ.. ఏపీపీఎస్సీ చైర్మ‌న్ వంటివారిని రాత్రికిరాత్రి బెదిరించి పంపేయ‌లేదా? గుర్తు చేసుకోండి.

బొత్స‌: విద్యాశాఖలో నాపై వచ్చిన ఆరోపణలు పట్ల స్పందించాల్సిన అవసరం లేదు.
నెటిజ‌న్‌: మీపై వ‌చ్చిన ఆరోప‌ణ‌లకు స్పందించ‌రు. పాల‌న బాగోలేద‌న్నా.. స్పందించ‌రు.. అందుకే ప్ర‌జ‌లు ఎప్పుడు ఎక్క‌డ ఎలా స్పందించాలో స్పందించేశారు స‌ర్‌. ఇప్పుడు మీరు స్పందించినా.. వేస్టేనేమో.. బెస్ట్ డెసిష‌న్‌!!

బొత్స‌: కొందరు రిటైర్డ్ ఐఏఎస్‌లు(ఎల్వీ సుబ్ర‌హ్మ‌ణ్యం) నాటి జగన్ ప్రభుత్వం గురించి ఇప్పుడు బయటికి వచ్చి మాట్లాడుతున్నారు. అధికారంలో ఉన్నప్పుడు మాట్లాడొచ్చు క‌దా!?
నెటిజ‌న్: హ‌మ్మో.. మాట్లాడితే బ‌త‌క‌నిస్తారా? ఏం చెబుతున్నారండీ. అప్పుడు మాట్లాడ‌లేకే.. ఇప్పుడు నోరు విప్పుతున్నారు. కొంత ఓర్పు వ‌హించండి బొత్స‌స‌ర్‌!!

Satya

Recent Posts

స‌మంత స్టార్ ప‌వర్ క‌నిపిస్తోంది

తెలుగులో చాలా కొద్ది మంది హీరోయిన్ల‌కు మాత్ర‌మే సాధ్య‌మైన స్టార్ ఇమేజ్ సంపాదించింది స‌మంత‌. విజ‌య‌శాంతి, అనుష్క‌ల త‌ర్వాత హీరోల‌తో…

30 minutes ago

ఇండియాలో ఆల్ టైం రికార్డు దిశ‌గా అబ్సెష‌న్

కేవ‌లం ప‌ది కోట్ల బ‌డ్జెట్లో తెర‌కెక్కిన సినిమా.. అబ్సెష‌న్. ఈ హాలీవుడ్ హార్ర‌ర్ మూవీ విడుద‌లైన‌ప్ప‌టి నుంచి వ‌ర‌ల్డ్ వైడ్…

3 hours ago

తొందరపాటు ఎందుకు పెద్ది

స్టార్ హీరో సినిమాల రిపీట్ వేల్యూకి ప్రధానంగా దోహదం చేసేది పాటలే. ఫైట్లు, ఎలివేషన్లు, యాక్షన్ ఎపిసోడ్లు ఎక్కువ లేని…

4 hours ago

వరప్రసాద్ స్నేహితులకు క్లాష్ తప్పదా

సంక్రాంతికి రిలీజైన మన శంకరవరప్రసాద్ గారులో ప్రాణ స్నేహితులుగా నటించిన చిరంజీవి, వెంకటేష్ మొదటిసారి స్క్రీన్ పంచుకుని ఎంత పెద్ద…

5 hours ago

ఫౌజీ బాటలో ముళ్లచెట్ల బ్రేకులు

హెడింగ్ చూడగానే ఏవో ముళ్లచెట్ల వల్ల ఎవరికో ఏదో అయిపోయి షూటింగ్ బ్రేక్ పడిందని అనుకోకండి. ఇక్కడ అడ్డంకులనే కోణంలో…

6 hours ago

ఆంధ్రాకి ఆరు ఆడ పులులు కోరిన పవన్

రాష్ట్రంలో అట‌వీ సంప‌ద‌ను కాపాడ‌డంతోపాటు.. వన్య‌ప్రాణుల సంర‌క్ష‌ణ‌కు సైతం ప్రాధాన్యం ఇస్తున్న ఉప ముఖ్య‌మంత్రి, అట‌వీ శాఖ మంత్రి ప‌వ‌న్…

6 hours ago