Political News

తెలంగాణ ఎన్నిక‌ల‌కు గ్రౌండ్ ప్రిపేర్ చేస్తున్న ప‌వ‌న్ క‌ల్యాణ్‌?

జ‌న‌సేన అధినేత‌, ఏపీ డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ళ్యాణ్‌.. ఏపీలో ఎన్నిక‌ల‌కు ఐదారు మాసాల ముందు చేసిన గ్రౌండ్ వ‌ర్క్ ఫ‌లించిన విష‌యం తెలిసిందే. బీజేపీ-టీడీపీల‌ను ఏక‌తాటిపైకి తీసుకువ‌చ్చి.. కూట‌మి క‌ట్టేలా చేసిన ఆయ‌న ఎన్నిక‌ల్లో వైసీపీ ప‌త‌నాని కి నాంది పలికారు. త‌న పార్టీ 21 స్థానాలు తీసుకున్నా.. అన్నిచోట్లా గెలిపించుకున్నారు. అదేవిధంగా రెండు పార్ల‌మెంటు స్థానాలే ద‌క్కించుకున్నా.. వాటిని కూడా గెలిపించుకున్నారు. ఈ వ్యూహం ఏపీలో ఇప్ప‌టి వ‌ర‌కు ఎవ‌రూ వేయ‌క‌పోగా.. ఇలాంటి స్ట్రైక్ రేట్ విజ‌యం కూడా ఎవ‌రికీ సాధ్యం కాలేదు. దీంతో ప‌వ‌న్ ఇమేజ్ జాతీయ స్థాయిలో వినుతికెక్కింది.

అయితే.. ఇప్పుడు ఇదే వ్యూహాన్ని ఆయ‌న తెలంగాణ‌లోనూ ప్లే చేస్తారా? అనేది రాజ‌కీయంగా జ‌రుగుతున్న చ‌ర్చ‌. తాజాగా కొండ‌గ‌ట్టు ఆంజ‌నేయ‌స్వామి ఆల‌యాన్ని సంద‌ర్శించిన ఆయ‌న రాజ‌కీయంగా కొన్ని వ్యాఖ్య‌లు చేశారు. తాము తెలంగాణలో నూ విస్త‌రిస్తామ‌ని.. జ‌న‌సేనను బ‌లోపేతం చేస్తామ‌ని చెప్పారు. అంతేకాదు.. గ‌త ఏడాది జ‌రిగిన ఎన్నిక‌ల్లో జ‌న‌సేన ఓడిపోయిన విష‌యాన్ని కూడా ప్ర‌స్తావిస్తూ.. త‌ప్పులు జ‌రిగి ఉంటే వాటిని స‌రిచేసుకుంటామ‌ని చెప్పారు. ఇక‌, ఇదేస‌మ‌యంలో బీజేపీతో క‌లిసి ప‌నిచేయ‌నున్న‌ట్టు ప‌వ‌న్ వెల్ల‌డించారు. దీనిపై బీజేపీ నాయ‌కులు త‌ల‌కోర‌కంగా స్పందిస్తున్నారు.

కేంద్ర మంత్రి, క‌రీంన‌గ‌ర్ ఎంపీ బండి సంజ‌య్ ప‌వ‌న్ వ్యాఖ్య‌ల‌ను స్వాగ‌తిస్తూనే.. తామే ముందుగానే జ‌న‌సేన‌తో చేతులు క‌లిపామ‌ని.. అయితే..ఇప్పుడు జ‌న‌సేన‌తో క‌లిసి ముందుకు వెళ్లే విష‌యాన్ని పార్టీ అధిష్టానం చూసుకుంటుంద‌న్నారు. అయితే.. రాష్ట్రంలో అధికారంలోకి వ‌చ్చేందుకు ఎవ‌రితోనైనా చేతులు క‌లిపే అవ‌కాశం ఉంద‌ని చెప్పుకొచ్చారు. దీనిని బ‌ట్టి.. బీజేపీ కూడా జ‌న‌సేన‌వైపు మొగ్గు చూపుతుంద‌నేది తెలుస్తోంది. ఇక‌, ఏపీలో అధికారంలో ఉన్న టీడీపీ ఎలానూ .. బీజేపీ-జ‌న‌సేన కూట‌మితో క‌లిసే ఉంది. మ‌రోవైపు.. తెలంగాణ‌లోనూ విస్త‌రిస్తామ‌ని.. చంద్ర‌బాబు చెబుతున్నారు.

ఈ నేప‌థ్యంలో తెలంగాణ‌లోనూ.. ప‌వ‌న్ ఏపీ ఫార్ములాను.. అమ‌లు చేస్తే.. కాద‌నేవారు ఎవ‌రూ ఉండ‌రు. ఎవ‌రు మాత్రం అధికారంలోకి వ‌స్తామంటే అడ్డుకుంటారు. ఇప్పుడు ఆదిశ‌గా ఆలోచ‌న చేస్తే.. ఏపీలో క‌లిసి ఉన్న మూడు పార్టీలూ(బీజేపీ+ జ‌న‌సేన‌+టీడీపీ)లు ఉమ్మ‌డిగా తెలంగాణ‌లోనూ పోటీ చేసే అవ‌కాశం క‌నిపిస్తోంది. దీనిని బ‌ట్టి 2029లో వ‌చ్చే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నాటికి ఇప్ప‌టి నుంచి ప‌వ‌న్ గ్రౌండ్ వ‌ర్క్ ప్రారంభిస్తున్నారా? అనే చ‌ర్చ రాజ‌కీయ వ‌ర్గాల్లో చ‌ర్చ‌గా మారింది. ఇదే జ‌రిగితే.. ఇటు కాంగ్రెస్‌కు, అటు బీఆర్ ఎస్ కు కూడా.. ఇబ్బందులు త‌ప్ప‌వు.

పైగా.. మూడు పార్టీలూ క‌లిస్తే.. అధికారంలోకి వ‌చ్చినా ఆశ్చ‌ర్యం లేదు. ఇటీవ‌ల సీఎం రేవంత్ మాట్లాడుతూ.. టీడీపీ పోటీ చేయ‌నుందునే 10 శాతం ఓటు బ్యాంకు తాము ద‌క్కించుకున్నామ‌ని చెప్ప‌డం గ‌మ‌నార్హం. సో.. ఇప్పుడు టీడీపీ స‌హా బీజేపీ, జ‌న‌సేన‌లు క‌లిస్తే.. అధికారంలోకి వ‌చ్చేసినా ఆశ్చ‌ర్యం లేద‌ని అంటున్నారు. ఈ వ్యూహాన్ని దృష్టిలో పెట్టుకునే ప‌వ‌న్ క‌ల్యాణ్ ఈ వ్యాఖ్య‌లు చేసి ఉంటార‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. మ‌రి ఏం జ‌రుగుతుందో చూడాలి.

This post was last modified on July 1, 2024 9:48 am

Share
Show comments

Recent Posts

దురంధ‌ర్ ఇప్పుడు… పవన్ ఎప్పుడో!

దురంధ‌ర్‌.. చాలా ఏళ్ల త‌ర్వాత భార‌తీయ సినిమాలో బాలీవుడ్ త‌లెత్తుకునేలా చేసిన సినిమా. గ‌త ఏడాది ఛావా, సైయారా సినిమాలు…

2 hours ago

జ‌న‌నాయ‌గ‌న్ సంక్షోభం… నోరు విప్పిన విజ‌య్

త‌మిళంలో కొన్నేళ్లుగా నంబ‌ర్ వ‌న్ హీరోగా కొన‌సాగుతున్న విజ‌య్.. పూర్తి స్థాయి రాజ‌కీయాల్లోకి అడుగు పెట్టి, ఎన్నిక‌ల బ‌రిలోకి దిగే…

12 hours ago

బిగ్ బ్రేకింగ్: అంబటి రాంబాబు అరెస్ట్!

తీవ్ర ఉద్రిక్తతల నడుమ వైసీపీ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబును పోలీసులు అరెస్ట్ చేశారు. అంబటి రాంబాబు వివాదాస్పద…

12 hours ago

ఆఖరి పోరులో కివీస్‌ను చిత్తు చేసిన టీమిండియా!

న్యూజిలాండ్‌తో జరిగిన ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ను భారత్ ఘనంగా ముగించింది. శనివారం జరిగిన ఆఖరిదైన ఐదో టీ20లో టీమిండియా…

12 hours ago

అంబటికి సినిమా చూపిస్తామన్న పెమ్మసాని

తిరుపతి లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి వాడకం వ్యవహారం సద్దుమణగక ముందే ఏపీ సీఎం చంద్రబాబును అంబటి రాంబాబు దుర్భాషలాడిన…

14 hours ago

సిట్ నోటీసులను లాజిక్ తో కొట్టిన కేసీఆర్

ఫోన్ ట్యాపింగ్ కేసులో నంది నగర్ లోని కేసీఆర్ నివాసంలోనే విచారణ జరుపుతామని సిట్‌ అధికారులు రెండోసారి కేసీఆర్ కు…

15 hours ago