Political News

రూ.4వేలకే స్మార్ట్ ఫోన్…రిలయన్స్ మరో సంచలనం?

కర్లో దునియా ముఠ్ఠీమే అంటూ….చాలామంది ప్రజల అరచేతిలోకి ప్రపంచాన్ని తెచ్చిపెట్టిన ఘనత రిలయన్స్ ధీరూభాయ్ అంబానీదే. తన తండ్రి అడుగుజాడల్లో నడిచిన ముకేశ్ అంబానీ….జియో జీ భర్ కే అంటూ కారుచౌకగా మొబైల్ డేటాతో పాటు ఫీచర్ ఫోన్ ను సామాన్యులకు అందించారు. టెలికాం రంగంలో జియో దెబ్బకు తట్టుకోలేక చాలా టెలికాం కంపెనీలు నష్టాలను చవిచూశాయి. జియో 4జీ సేవల ధాటికి మిగతా కంపెనీలు కుదేలయ్యాయి. వచ్చే ఏడాది నాటికి భారత్ లో 5జీ సేవలను ప్రారంభించేందుకూ జియో పావులు కదుపుతోంది. ఈ క్రమంలోనే తాజాగా మరో సంచలనానికి జియో తెరతీయున్నట్లు తెలుస్తోంది. భారత్ మార్కెట్ ను దృష్టిలో ఉంచుకొని అతి చౌకగా రూ.4 వేలకే ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్ అందించాలని అంబానీ సిద్ధమవుతున్నట్లు ప్రచారం జరుగుతోంది.

130 కోట్ల మంది ఉన్న మన దేశంలో స్మార్ట్ ఫోన్ వాడకం నానాటికీ పెరిగిపోతోంది. అందుకే, షామీ, రియల్ మీ వంటి కంపెనీలు మన మార్కెట్లో చౌక ధరలకే ఫోన్లను అందిస్తూ సొమ్ము చేసుకుంటున్నాయి. తాజాగా చైనాతో వివాదం నేపథ్యంలో చైనా కంపెనీల ఉత్పత్తులకు మార్కెట్లో ఆదరణ ఉండడం లేదు. భవిష్యత్తులో చైనా మొబైల్స్ మార్కెట్ మరింత పడిపోయే అవకాశముంది. దీనికితోడు స్వదేశీ వస్తువుల వాడకం కోసం స్వదేశీ కంపెనీలకు ప్రధాని మోడీ ఊతమిస్తున్నారు. ఈ క్రమంలోనే భారత్ లోని స్మార్ట్ ఫోన్ మార్కెట్ పై రిలయన్స్ అధినేత ముఖేశ్ అంబానీ కన్నుపడిందని తెలుస్తోంది. షామీ వంటి మొబైల్ తయారీదారులకు గట్టి పోటీ ఇవ్వాలని అంబానీ ప్లాన్ చేస్తున్నారట.

అందుకే, కారు చౌకగా రూ.4 వేలకే స్మార్ట్ ఫోన్లను భారతీయ మార్కెట్ కు అనుగుణంగా విడుదల చేయాలని అంబానీ ప్రణాళికలు రచిస్తున్నారని తెలుస్తోంది. గూగుల్ ఆండ్రాయిడ్ ఓఎస్ తో నడిచే ఈ స్మార్ట్ ఫోన్ తో షామీ వంటి సంస్థలకు సవాల్ విసరాలని అంబానీ భావిస్తున్నారట. రాబోయే రెండేళ్లలో 200 మిలియన్ల స్మార్ట్ ఫోన్లు విక్రయించాలన్న లక్ష్యంతో అంబానీ ముందుకు వెళుతున్నారట. ఇందుకోసం, భారత్ లోని మొబైల్ ఫోన్ తయారీదారులతో అంబానీ ఇప్పటికే చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తోంది. ఈ ప్రచారం నిజమై రూ.4వేలకే రిలయన్స్ స్మార్ట్ ఫోన్ అందించగలిగితే…భారత్ స్మార్ట్ ఫోన్ మార్కెట్ ను రిలయన్స్ శాసిస్తుందనడంలో ఎటువంటి సందేహం లేదు.

This post was last modified on September 22, 2020 8:43 pm

Share

Recent Posts

దేవర కలెక్షన్లపై డిస్ట్రిబ్యూటర్ క్లారిటీ

ఒక సినిమా రిలీజైన రెండు మూడేళ్ల తర్వాత కూడా దాని కలెక్షన్ల గురించి విపరీతమైన చర్చ జరగడం అరుదు. ‘దేవర’ విషయంలో ఇదే…

3 hours ago

ఏజెంట్‌లో నన్ను చూసి అసహ్యమేసింది – అఖిల్

అక్కినేని యువ కథానాయకుడు అఖిల్ హీరోగా స్టార్ డైరెక్టర్ సురేందర్ రెడ్డి రూపొందించిన ‘ఏజెంట్’ టాలీవుడ్ చరిత్రలోనే అతి పెద్ద…

5 hours ago

కొత్త విద్యా మంత్రిగా జోషి… ఎవరీయన?

కేంద్ర విద్యా శాఖకు నూతన మంత్రిగా బీజేపీ సీనియర్ నేత, కేంద్ర కేబినెట్ లో కీలక శాఖల మంత్రిగా కొనసాగుతున్న ప్రహ్లాద్ జోషి నియమితులయ్యారు.…

6 hours ago

విజయ్ బలహీనతే కిరణ్ బలం

బాక్సాఫీస్ దగ్గర పోటీ ఉన్నప్పుడు కొన్ని ఆసక్తికరమైన పరిణామాలు జరుగుతాయి. ఇది అలాంటిదే. కేవలం ఒక్క రోజు గ్యాప్ తో…

7 hours ago

‘స్పైడర్ మ్యాన్’ రచ్చ చేసేలా ఉన్నాడు

ప్రపంచవ్యాప్తంగా కోట్లాది అభిమానులను సొంతం చేసుకున్న స్పైడర్ మ్యాన్ సిరీస్ లోని కొత్త సినిమా బ్రాండ్ న్యూ డే జూలై…

8 hours ago

జగన్ లాజిక్… ధర్మేంద్ర ప్రధాన్ రిజైన్ కి లోకేష్ కు ముడి!

ఏపీ మాజీ ముఖ్యమంత్రి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైయస్ జగన్ కొత్త లాజిక్ మాట్లాడుతున్నారు. నైతిక బాధ్యత వహిస్తూ…

8 hours ago