Political News

రూ.4వేలకే స్మార్ట్ ఫోన్…రిలయన్స్ మరో సంచలనం?

కర్లో దునియా ముఠ్ఠీమే అంటూ….చాలామంది ప్రజల అరచేతిలోకి ప్రపంచాన్ని తెచ్చిపెట్టిన ఘనత రిలయన్స్ ధీరూభాయ్ అంబానీదే. తన తండ్రి అడుగుజాడల్లో నడిచిన ముకేశ్ అంబానీ….జియో జీ భర్ కే అంటూ కారుచౌకగా మొబైల్ డేటాతో పాటు ఫీచర్ ఫోన్ ను సామాన్యులకు అందించారు. టెలికాం రంగంలో జియో దెబ్బకు తట్టుకోలేక చాలా టెలికాం కంపెనీలు నష్టాలను చవిచూశాయి. జియో 4జీ సేవల ధాటికి మిగతా కంపెనీలు కుదేలయ్యాయి. వచ్చే ఏడాది నాటికి భారత్ లో 5జీ సేవలను ప్రారంభించేందుకూ జియో పావులు కదుపుతోంది. ఈ క్రమంలోనే తాజాగా మరో సంచలనానికి జియో తెరతీయున్నట్లు తెలుస్తోంది. భారత్ మార్కెట్ ను దృష్టిలో ఉంచుకొని అతి చౌకగా రూ.4 వేలకే ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్ అందించాలని అంబానీ సిద్ధమవుతున్నట్లు ప్రచారం జరుగుతోంది.

130 కోట్ల మంది ఉన్న మన దేశంలో స్మార్ట్ ఫోన్ వాడకం నానాటికీ పెరిగిపోతోంది. అందుకే, షామీ, రియల్ మీ వంటి కంపెనీలు మన మార్కెట్లో చౌక ధరలకే ఫోన్లను అందిస్తూ సొమ్ము చేసుకుంటున్నాయి. తాజాగా చైనాతో వివాదం నేపథ్యంలో చైనా కంపెనీల ఉత్పత్తులకు మార్కెట్లో ఆదరణ ఉండడం లేదు. భవిష్యత్తులో చైనా మొబైల్స్ మార్కెట్ మరింత పడిపోయే అవకాశముంది. దీనికితోడు స్వదేశీ వస్తువుల వాడకం కోసం స్వదేశీ కంపెనీలకు ప్రధాని మోడీ ఊతమిస్తున్నారు. ఈ క్రమంలోనే భారత్ లోని స్మార్ట్ ఫోన్ మార్కెట్ పై రిలయన్స్ అధినేత ముఖేశ్ అంబానీ కన్నుపడిందని తెలుస్తోంది. షామీ వంటి మొబైల్ తయారీదారులకు గట్టి పోటీ ఇవ్వాలని అంబానీ ప్లాన్ చేస్తున్నారట.

అందుకే, కారు చౌకగా రూ.4 వేలకే స్మార్ట్ ఫోన్లను భారతీయ మార్కెట్ కు అనుగుణంగా విడుదల చేయాలని అంబానీ ప్రణాళికలు రచిస్తున్నారని తెలుస్తోంది. గూగుల్ ఆండ్రాయిడ్ ఓఎస్ తో నడిచే ఈ స్మార్ట్ ఫోన్ తో షామీ వంటి సంస్థలకు సవాల్ విసరాలని అంబానీ భావిస్తున్నారట. రాబోయే రెండేళ్లలో 200 మిలియన్ల స్మార్ట్ ఫోన్లు విక్రయించాలన్న లక్ష్యంతో అంబానీ ముందుకు వెళుతున్నారట. ఇందుకోసం, భారత్ లోని మొబైల్ ఫోన్ తయారీదారులతో అంబానీ ఇప్పటికే చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తోంది. ఈ ప్రచారం నిజమై రూ.4వేలకే రిలయన్స్ స్మార్ట్ ఫోన్ అందించగలిగితే…భారత్ స్మార్ట్ ఫోన్ మార్కెట్ ను రిలయన్స్ శాసిస్తుందనడంలో ఎటువంటి సందేహం లేదు.

This post was last modified on September 22, 2020 8:43 pm

Share
Show comments
Published by
suman

Recent Posts

మ‌మ‌త ప‌రిస్థితి.. ఏపీకి పాఠం అవుతుందా?!

త‌మ్ముడు త‌మ్ముడే.. రాజ‌కీయం రాజ‌కీయ‌మే.. బీజేపీ విష‌యంలో ఇది అక్ష‌రాలా నిజం. త‌న‌కు అవ‌కాశం లేనంత సేపూ.. ఆ పార్టీ…

52 minutes ago

కెపాసిటీ లేకే ర‌జినీ సినిమా వ‌దిలేశా

సూప‌ర్ స్టార్ ర‌జినీకాంత్ హీరోగా లోక‌నాయ‌కుడు క‌మ‌ల్ హాస‌న్ నిర్మించే సినిమా ద‌ర్శ‌కుడి ఎంపిక విష‌యంలో ఎంత త‌ల‌నొప్పి ఎదురైందో…

3 hours ago

తొలిసారి బాల‌య్య‌తో అనిరుధ్‌?

టాలీవుడ్లో ఇప్ప‌టికే ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్, యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ లాంటి అగ్ర క‌థానాయ‌కుల‌తో పాటు నాని, విజ‌య్…

4 hours ago

పవన్ వచ్చాక పిఠాపురంలో ఏం చేశారు?

ఉమ్మ‌డి తూర్పు గోదావ‌రి జిల్లాలోని పిఠాపురం నియోజ‌కవ‌ర్గం నుంచి తొలిసారి పోటీ చేసిన జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్ 2024…

5 hours ago

‘కల్తీ నెయ్యి’లో ఆ ఇద్దరిదే కీలక భూమిక?

కలియుగ దైవం శ్రీవేంకటేశ్వర స్వామి వారి ప్రసాదం తిరుమల లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి వినియోగించారన్న కేసులో రోజుకో కొత్త…

5 hours ago

చంద్ర‌బాబు ప్ర‌క‌టించిన `లేబ‌ర్ అడ్డా` గురించి తెలుసా?

ఏపీ సీఎం చంద్ర‌బాబు గ‌త 2024లో కూట‌మి క‌ట్టి అధికారంలోకి వ‌చ్చిన విష‌యం తెలిసిందే. ఆయ‌న ముఖ్య‌మంత్రి అయిన త‌ర్వాత‌..…

7 hours ago