Political News

రూ.4వేలకే స్మార్ట్ ఫోన్…రిలయన్స్ మరో సంచలనం?

కర్లో దునియా ముఠ్ఠీమే అంటూ….చాలామంది ప్రజల అరచేతిలోకి ప్రపంచాన్ని తెచ్చిపెట్టిన ఘనత రిలయన్స్ ధీరూభాయ్ అంబానీదే. తన తండ్రి అడుగుజాడల్లో నడిచిన ముకేశ్ అంబానీ….జియో జీ భర్ కే అంటూ కారుచౌకగా మొబైల్ డేటాతో పాటు ఫీచర్ ఫోన్ ను సామాన్యులకు అందించారు. టెలికాం రంగంలో జియో దెబ్బకు తట్టుకోలేక చాలా టెలికాం కంపెనీలు నష్టాలను చవిచూశాయి. జియో 4జీ సేవల ధాటికి మిగతా కంపెనీలు కుదేలయ్యాయి. వచ్చే ఏడాది నాటికి భారత్ లో 5జీ సేవలను ప్రారంభించేందుకూ జియో పావులు కదుపుతోంది. ఈ క్రమంలోనే తాజాగా మరో సంచలనానికి జియో తెరతీయున్నట్లు తెలుస్తోంది. భారత్ మార్కెట్ ను దృష్టిలో ఉంచుకొని అతి చౌకగా రూ.4 వేలకే ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్ అందించాలని అంబానీ సిద్ధమవుతున్నట్లు ప్రచారం జరుగుతోంది.

130 కోట్ల మంది ఉన్న మన దేశంలో స్మార్ట్ ఫోన్ వాడకం నానాటికీ పెరిగిపోతోంది. అందుకే, షామీ, రియల్ మీ వంటి కంపెనీలు మన మార్కెట్లో చౌక ధరలకే ఫోన్లను అందిస్తూ సొమ్ము చేసుకుంటున్నాయి. తాజాగా చైనాతో వివాదం నేపథ్యంలో చైనా కంపెనీల ఉత్పత్తులకు మార్కెట్లో ఆదరణ ఉండడం లేదు. భవిష్యత్తులో చైనా మొబైల్స్ మార్కెట్ మరింత పడిపోయే అవకాశముంది. దీనికితోడు స్వదేశీ వస్తువుల వాడకం కోసం స్వదేశీ కంపెనీలకు ప్రధాని మోడీ ఊతమిస్తున్నారు. ఈ క్రమంలోనే భారత్ లోని స్మార్ట్ ఫోన్ మార్కెట్ పై రిలయన్స్ అధినేత ముఖేశ్ అంబానీ కన్నుపడిందని తెలుస్తోంది. షామీ వంటి మొబైల్ తయారీదారులకు గట్టి పోటీ ఇవ్వాలని అంబానీ ప్లాన్ చేస్తున్నారట.

అందుకే, కారు చౌకగా రూ.4 వేలకే స్మార్ట్ ఫోన్లను భారతీయ మార్కెట్ కు అనుగుణంగా విడుదల చేయాలని అంబానీ ప్రణాళికలు రచిస్తున్నారని తెలుస్తోంది. గూగుల్ ఆండ్రాయిడ్ ఓఎస్ తో నడిచే ఈ స్మార్ట్ ఫోన్ తో షామీ వంటి సంస్థలకు సవాల్ విసరాలని అంబానీ భావిస్తున్నారట. రాబోయే రెండేళ్లలో 200 మిలియన్ల స్మార్ట్ ఫోన్లు విక్రయించాలన్న లక్ష్యంతో అంబానీ ముందుకు వెళుతున్నారట. ఇందుకోసం, భారత్ లోని మొబైల్ ఫోన్ తయారీదారులతో అంబానీ ఇప్పటికే చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తోంది. ఈ ప్రచారం నిజమై రూ.4వేలకే రిలయన్స్ స్మార్ట్ ఫోన్ అందించగలిగితే…భారత్ స్మార్ట్ ఫోన్ మార్కెట్ ను రిలయన్స్ శాసిస్తుందనడంలో ఎటువంటి సందేహం లేదు.

This post was last modified on September 22, 2020 8:43 pm

Share
Show comments
Published by
suman

Recent Posts

తెలుగులో డ‌బ్బింగ్ చెప్పి, వెన‌క్కి త‌గ్గిన హీరో

ఎప్పుడు ఎవ‌రి కెరీర్ ఎలా మ‌లుపు తిరుగుతుందో చెప్ప‌లేం. త‌మిళ కుర్రాడు ప్ర‌దీప్ రంగ‌నాథ‌న్‌కు... నాలుగేళ్ల ముందు వ‌ర‌కు త‌మిళ‌నాడులోనే…

8 minutes ago

క‌విత‌కు `సీనియార్టీ` సంక‌టం.. సీరియ‌స్‌!

బీఆర్ ఎస్ పార్టీ నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చిన మాజీ సీఎం కేసీఆర్ త‌న‌య‌, మాజీ ఎంపీ క‌విత ఈ నెలలో…

1 hour ago

చెన్నైని అసలైనోళ్లే ముంచేస్తున్నారు

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) బ్యాటర్ల విధ్వంసం ముందు చెన్నై సూపర్ కింగ్స్ (CSK) తోకముడిచింది. ఆదివారం జరిగిన మ్యాచ్‌లో…

1 hour ago

రిపేర్లు సరే ముందు డ్యామేజ్ చూడండి

ఎంత పెద్ద స్టార్ హీరో నటించిన సినిమా అయినా సరైన రీతిలో ప్రేక్షకులకు దానిని చేరవేయడం చాలా అవసరం. కానీ…

2 hours ago

ఏడు ఫ్లాపుల తర్వాతైనా హిట్టు వరించేనా

ఉప్పెనతో డెబ్యూ చేసిన హీరోయిన్ కృతి శెట్టి వరసగా సినిమాలైతే చేస్తోంది కానీ విజయ లక్ష్మి మాత్రం రానని మొండికేస్తోంది.…

4 hours ago

ప్యారడైజ్ పరుగులు పెట్టాల్సిందే

పెద్ది విషయంలో జరుగుతున్న జాప్యం ఇతర సినిమాలను అలర్ట్ చేస్తోంది. రెండుసార్లు రిలీజ్ డేట్ మార్చాక కూడా దానికి కట్టుబడలేని…

5 hours ago