కేంద్రంలో వరుసగా మూడోసారి ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన సంగతి తెలిసిందే. ప్రధానిగా మోడీ హ్యాట్రిక్ కొట్టడంలో టీడీపీ అధినేత, ఏపీ సీఎం చంద్రబాబు కింగ్ మేకర్ పాత్ర పోషించారని జాతీయ మీడియా సైతం కథనాలు ప్రచురించింది. చంద్రబాబు వంటి సీనియర్ పొలిటిషియన్ తో కలిసి పనిచేయడం సంతోషకరమని ప్రధాని మోడీ కూడా పలు సందర్భాల్లో అన్నారు. ఎన్డీఏ మిత్రపక్షాల సమావేశాలలో కూడా చంద్రబాబుకు మోడీ ఎంతో ప్రాధాన్యతనిచ్చారు. తన పక్కనే చంద్రబాబును కూర్చోబెట్టుకొని ఆయనకు ఎంత గౌరవమిస్తున్నానో చెప్పారు.
ఈ క్రమంలోనే తాజాగా మరోసారి చంద్రబాబుపై తనకున్న ప్రత్యేక అభిమానాన్ని మోడీ మరోసారి చాటి చెప్పారు. తాజాగా ‘మన్ కీ బాత్’ సందర్భంగా 2016లో సీఎం చంద్రబాబుతో కలిసి అరకులో కాఫీ తాగుతున్న ఫొటోల గురించి ప్రస్తావించారు. తాను అరకు కాఫీకి అభిమానిని అని, 2016లో సీఎం చంద్రబాబుతో కలిసి విశాఖపట్నంలో అరకు కాఫీ సేవిస్తూ ముచ్చటించుకున్నామని గుర్తు చేసుకున్నారు. ఆ ఫొటోలను తన ఎక్స్ ఖాతాలో మోడీ పంచుకున్నారు.
ఈ క్రమంలోనే ఆ ఫొటోలపై సీఎం చంద్రబాబు స్పందించారు. మీతో మరో కప్ అరకు కాఫీ తాగుతూ ఎంజాయ్ చేయాలని ఎదురుచూస్తున్నాను మోడీగారు అంటూ చంద్రబాబు ట్వీట్ చేశారు. తమ గిరిజన సోదరసోదరీమణులు ప్రేమతో, అత్యంత శ్రద్ధాసక్తులతో అరకు కాఫీని సాగు చేస్తారని అన్నారు. 2016లో అరకు కాఫీ తాగుతున్న ఫొటోలను షేర్ చేసి అరకు కాఫీకి ప్రచారం కల్పించినందుకు థాంక్యూ అని చంద్రబాబు ట్వీట్ చేశారు. అరకు కాఫీపై మోడీ, చంద్రబాబుల ట్వీట్స్ వైరల్ అయ్యాయి.
తెలుగులో చాలా కొద్ది మంది హీరోయిన్లకు మాత్రమే సాధ్యమైన స్టార్ ఇమేజ్ సంపాదించింది సమంత. విజయశాంతి, అనుష్కల తర్వాత హీరోలతో…
కేవలం పది కోట్ల బడ్జెట్లో తెరకెక్కిన సినిమా.. అబ్సెషన్. ఈ హాలీవుడ్ హార్రర్ మూవీ విడుదలైనప్పటి నుంచి వరల్డ్ వైడ్…
స్టార్ హీరో సినిమాల రిపీట్ వేల్యూకి ప్రధానంగా దోహదం చేసేది పాటలే. ఫైట్లు, ఎలివేషన్లు, యాక్షన్ ఎపిసోడ్లు ఎక్కువ లేని…
సంక్రాంతికి రిలీజైన మన శంకరవరప్రసాద్ గారులో ప్రాణ స్నేహితులుగా నటించిన చిరంజీవి, వెంకటేష్ మొదటిసారి స్క్రీన్ పంచుకుని ఎంత పెద్ద…
హెడింగ్ చూడగానే ఏవో ముళ్లచెట్ల వల్ల ఎవరికో ఏదో అయిపోయి షూటింగ్ బ్రేక్ పడిందని అనుకోకండి. ఇక్కడ అడ్డంకులనే కోణంలో…
రాష్ట్రంలో అటవీ సంపదను కాపాడడంతోపాటు.. వన్యప్రాణుల సంరక్షణకు సైతం ప్రాధాన్యం ఇస్తున్న ఉప ముఖ్యమంత్రి, అటవీ శాఖ మంత్రి పవన్…