కేంద్రంలో వరుసగా మూడోసారి ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన సంగతి తెలిసిందే. ప్రధానిగా మోడీ హ్యాట్రిక్ కొట్టడంలో టీడీపీ అధినేత, ఏపీ సీఎం చంద్రబాబు కింగ్ మేకర్ పాత్ర పోషించారని జాతీయ మీడియా సైతం కథనాలు ప్రచురించింది. చంద్రబాబు వంటి సీనియర్ పొలిటిషియన్ తో కలిసి పనిచేయడం సంతోషకరమని ప్రధాని మోడీ కూడా పలు సందర్భాల్లో అన్నారు. ఎన్డీఏ మిత్రపక్షాల సమావేశాలలో కూడా చంద్రబాబుకు మోడీ ఎంతో ప్రాధాన్యతనిచ్చారు. తన పక్కనే చంద్రబాబును కూర్చోబెట్టుకొని ఆయనకు ఎంత గౌరవమిస్తున్నానో చెప్పారు.
ఈ క్రమంలోనే తాజాగా మరోసారి చంద్రబాబుపై తనకున్న ప్రత్యేక అభిమానాన్ని మోడీ మరోసారి చాటి చెప్పారు. తాజాగా ‘మన్ కీ బాత్’ సందర్భంగా 2016లో సీఎం చంద్రబాబుతో కలిసి అరకులో కాఫీ తాగుతున్న ఫొటోల గురించి ప్రస్తావించారు. తాను అరకు కాఫీకి అభిమానిని అని, 2016లో సీఎం చంద్రబాబుతో కలిసి విశాఖపట్నంలో అరకు కాఫీ సేవిస్తూ ముచ్చటించుకున్నామని గుర్తు చేసుకున్నారు. ఆ ఫొటోలను తన ఎక్స్ ఖాతాలో మోడీ పంచుకున్నారు.
ఈ క్రమంలోనే ఆ ఫొటోలపై సీఎం చంద్రబాబు స్పందించారు. మీతో మరో కప్ అరకు కాఫీ తాగుతూ ఎంజాయ్ చేయాలని ఎదురుచూస్తున్నాను మోడీగారు అంటూ చంద్రబాబు ట్వీట్ చేశారు. తమ గిరిజన సోదరసోదరీమణులు ప్రేమతో, అత్యంత శ్రద్ధాసక్తులతో అరకు కాఫీని సాగు చేస్తారని అన్నారు. 2016లో అరకు కాఫీ తాగుతున్న ఫొటోలను షేర్ చేసి అరకు కాఫీకి ప్రచారం కల్పించినందుకు థాంక్యూ అని చంద్రబాబు ట్వీట్ చేశారు. అరకు కాఫీపై మోడీ, చంద్రబాబుల ట్వీట్స్ వైరల్ అయ్యాయి.
జింబాబ్వే పర్యటన కోసం ఎంపిక చేసిన భారత జట్టులో ఎడమచేతి వాటం బ్యాటర్లదే ఆధిపత్యం నడుస్తోంది. కుర్రాడు వైభవ్ సూర్యవంశీతో…
ఇటీవలే విడుదలైన నాగబంధంకు అంత ఓపెనింగ్స్ వస్తాయని ఊహించినవాళ్లు చాలా తక్కువ. ఎంత విజువల్ ఎఫెక్ట్స్ తో తీసిన సినిమా…
రెండు సంవత్సరాలకు పైగా మోక్షం కోసం ఎదురు చూస్తున్న విశ్వంభర విడుదలకు ప్రయత్నాలు ముమ్మరమయ్యాయి. ఇప్పటికే ఆలస్యం వల్ల హైప్…
కాపు నాయకుడు, మాజీ ఎమ్మెల్యే.. దివంగత వంగవీటి మోహన్రంగా కుమార్తె ఆశాలత త్వరలోనే జనసేన పార్టీ తీర్థం పుచ్చు కోనున్నారా?…
ఫుట్బాల్ ప్రపంచాన్ని దశాబ్దాల పాటు శాసించిన క్రిస్టియానో రొనాల్డో శకం కన్నీటితో ముగిసింది. 2026 ఫిఫా వరల్డ్ కప్ ప్రీ…
కేవలం మూడు వారాలు... ప్రపంచంలోనే మొదటి ట్రిలియనీర్గా రికార్డు సృష్టించిన ఎలాన్ మస్క్ మళ్లీ పాత స్థానానికి పడిపోవడానికి పట్టిన…