కేంద్రంలో వరుసగా మూడోసారి ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన సంగతి తెలిసిందే. ప్రధానిగా మోడీ హ్యాట్రిక్ కొట్టడంలో టీడీపీ అధినేత, ఏపీ సీఎం చంద్రబాబు కింగ్ మేకర్ పాత్ర పోషించారని జాతీయ మీడియా సైతం కథనాలు ప్రచురించింది. చంద్రబాబు వంటి సీనియర్ పొలిటిషియన్ తో కలిసి పనిచేయడం సంతోషకరమని ప్రధాని మోడీ కూడా పలు సందర్భాల్లో అన్నారు. ఎన్డీఏ మిత్రపక్షాల సమావేశాలలో కూడా చంద్రబాబుకు మోడీ ఎంతో ప్రాధాన్యతనిచ్చారు. తన పక్కనే చంద్రబాబును కూర్చోబెట్టుకొని ఆయనకు ఎంత గౌరవమిస్తున్నానో చెప్పారు.
ఈ క్రమంలోనే తాజాగా మరోసారి చంద్రబాబుపై తనకున్న ప్రత్యేక అభిమానాన్ని మోడీ మరోసారి చాటి చెప్పారు. తాజాగా ‘మన్ కీ బాత్’ సందర్భంగా 2016లో సీఎం చంద్రబాబుతో కలిసి అరకులో కాఫీ తాగుతున్న ఫొటోల గురించి ప్రస్తావించారు. తాను అరకు కాఫీకి అభిమానిని అని, 2016లో సీఎం చంద్రబాబుతో కలిసి విశాఖపట్నంలో అరకు కాఫీ సేవిస్తూ ముచ్చటించుకున్నామని గుర్తు చేసుకున్నారు. ఆ ఫొటోలను తన ఎక్స్ ఖాతాలో మోడీ పంచుకున్నారు.
ఈ క్రమంలోనే ఆ ఫొటోలపై సీఎం చంద్రబాబు స్పందించారు. మీతో మరో కప్ అరకు కాఫీ తాగుతూ ఎంజాయ్ చేయాలని ఎదురుచూస్తున్నాను మోడీగారు అంటూ చంద్రబాబు ట్వీట్ చేశారు. తమ గిరిజన సోదరసోదరీమణులు ప్రేమతో, అత్యంత శ్రద్ధాసక్తులతో అరకు కాఫీని సాగు చేస్తారని అన్నారు. 2016లో అరకు కాఫీ తాగుతున్న ఫొటోలను షేర్ చేసి అరకు కాఫీకి ప్రచారం కల్పించినందుకు థాంక్యూ అని చంద్రబాబు ట్వీట్ చేశారు. అరకు కాఫీపై మోడీ, చంద్రబాబుల ట్వీట్స్ వైరల్ అయ్యాయి.
This post was last modified on June 30, 2024 6:27 pm
అనుకున్నట్టే ది ప్యారడైజ్ ట్రైలర్ రావడం లేదు. రిలీజ్ డేట్ సెప్టెంబర్ 24 మీద చాలా ఒత్తిడి ఉండటంతో ఇప్పటికిప్పుడు…
తెలుగు సినిమాల వింటేజ్ అభిమానుల ప్రధాన సమస్య ఒకటే. చాలా క్లాసిక్ మూవీస్, బ్లాక్ బస్టర్స్ సరైన రీతిలో ఆన్…
ఇప్పటిదాకా అన్ని భాషల్లో కలిపి కొన్ని వందల హారర్ సినిమాలు వచ్చి ఉంటాయి. హాలీవుడ్ ఈవిల్ డెడ్ తో మొదలుపెట్టి…
బాలీవుడ్ లో సంచలన వసూళ్లు నమోదు చేస్తున్న హనుమాన్ అంశ్ తెలుగులో సెప్టెంబర్ 18 విడుదల కానుంది. ఆశ్చర్యం కలిగించే…
వరుస ఫ్లాపుల కారణంగా గత కొన్నేళ్లలో మాస్ రాజా రవితేజ ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్ బాగా దెబ్బ తిన్న మాట…
అక్టోబర్ 2 జాతిపిత మహాత్మా గాంధీ జయంతి. నేషనల్ హాలిడే. ఆ మహానుభావుడిని ఎందరు గుర్తు చేసుకుంటారో కానీ సెలవు…