కేంద్రంలో వరుసగా మూడోసారి ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన సంగతి తెలిసిందే. ప్రధానిగా మోడీ హ్యాట్రిక్ కొట్టడంలో టీడీపీ అధినేత, ఏపీ సీఎం చంద్రబాబు కింగ్ మేకర్ పాత్ర పోషించారని జాతీయ మీడియా సైతం కథనాలు ప్రచురించింది. చంద్రబాబు వంటి సీనియర్ పొలిటిషియన్ తో కలిసి పనిచేయడం సంతోషకరమని ప్రధాని మోడీ కూడా పలు సందర్భాల్లో అన్నారు. ఎన్డీఏ మిత్రపక్షాల సమావేశాలలో కూడా చంద్రబాబుకు మోడీ ఎంతో ప్రాధాన్యతనిచ్చారు. తన పక్కనే చంద్రబాబును కూర్చోబెట్టుకొని ఆయనకు ఎంత గౌరవమిస్తున్నానో చెప్పారు.
ఈ క్రమంలోనే తాజాగా మరోసారి చంద్రబాబుపై తనకున్న ప్రత్యేక అభిమానాన్ని మోడీ మరోసారి చాటి చెప్పారు. తాజాగా ‘మన్ కీ బాత్’ సందర్భంగా 2016లో సీఎం చంద్రబాబుతో కలిసి అరకులో కాఫీ తాగుతున్న ఫొటోల గురించి ప్రస్తావించారు. తాను అరకు కాఫీకి అభిమానిని అని, 2016లో సీఎం చంద్రబాబుతో కలిసి విశాఖపట్నంలో అరకు కాఫీ సేవిస్తూ ముచ్చటించుకున్నామని గుర్తు చేసుకున్నారు. ఆ ఫొటోలను తన ఎక్స్ ఖాతాలో మోడీ పంచుకున్నారు.
ఈ క్రమంలోనే ఆ ఫొటోలపై సీఎం చంద్రబాబు స్పందించారు. మీతో మరో కప్ అరకు కాఫీ తాగుతూ ఎంజాయ్ చేయాలని ఎదురుచూస్తున్నాను మోడీగారు అంటూ చంద్రబాబు ట్వీట్ చేశారు. తమ గిరిజన సోదరసోదరీమణులు ప్రేమతో, అత్యంత శ్రద్ధాసక్తులతో అరకు కాఫీని సాగు చేస్తారని అన్నారు. 2016లో అరకు కాఫీ తాగుతున్న ఫొటోలను షేర్ చేసి అరకు కాఫీకి ప్రచారం కల్పించినందుకు థాంక్యూ అని చంద్రబాబు ట్వీట్ చేశారు. అరకు కాఫీపై మోడీ, చంద్రబాబుల ట్వీట్స్ వైరల్ అయ్యాయి.
This post was last modified on June 30, 2024 6:27 pm
బాక్సాఫీస్ వద్ద ర్యాంపేజ్ చూపిస్తున్న దురంధర్ ది రివెంజ్ కు సంబంధించి ఒక ముఖ్యమైన ప్రశ్న అందరి మెదళ్లను తొలిచేసింది.…
బాలినేని శ్రీనివాస రెడ్డి జనసేనలో చేరిన తర్వాత పెద్దగా యాక్టివ్ గా లేని సంగతి తెలిసిందే. అధికారికంగా జనసేన నిర్వహించే…
ఫిబ్రవరితో మొదలుపెట్టి మార్చి రెండో వారం దాకా పట్టుమని వారం రోజులు హౌస్ ఫుల్ చేసే సినిమా లేక గగ్గోలు…
కొన్నిసార్లు అవగాహన రాహిత్యంతో డిజిటల్ మోసాల బారిన పడతాం. అలాంటి వారి విషయంలో ఇప్పటివరకు ఎప్పుడూ లేని విధంగా పరిహారం…
ప్రపంచంలోని మూర్ఖ పాలకుల జాబితాను తీస్తే.. అందులో మొదటి ముగ్గురు పాలకుల్లో ఒకరుగా నిలుస్తారు కింగ్ జోంగ్ ఉన్. తన…
బాలీవుడ్లో స్టార్ పవర్ కంటే కేవలం కథను నమ్మి సినిమాలు తీసే దర్శకులు చాలా తక్కువ మంది ఉంటారు. అందులో…