కలియుగ దైవం అయిన తిరుమల వెంకన్న ఆలయంలోకి ప్రవేశించే అన్యమతస్థుల డిక్లరేషన్ వ్యవహారంపై ఇరు తెలుగు రాష్ట్రాలతోపాటు దేశవ్యాప్తంగా తీవ్ర చర్చ జరుగుతోన్న సంగతి తెలిసిందే. ఈ వ్యవహారంపై టీటీడీ చైర్మన్ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదం కావడంతో ఆయన క్లారిటీ ఇచ్చారు. దీంతో, ఈ వ్యవహారం సద్దుమణిగిందనుకుంటున్న సమయంలో మంత్రి కొడాలి నాని సంచలన వ్యాఖ్యలు చేశారు. అసలు తిరుమలలో డిక్లరేషన్ అనే అంశంపై చర్చ జరగాలని, వేరే గుళ్లలో లేని డిక్లరేషన్ తిరుమలలో మాత్రం ఎందుకని…ఇక్కడ కూడా డిక్లరేషన్ తీసేయాలని నాని సంచలన వ్యాఖ్యలు చేశారు. అంతర్వేదిలో కోటి రూపాయల విలువైన రథం దగ్దం కావడంతో గుడికి నష్టమేమీ లేదని ప్రభుత్వం కొత్త రథం చేయిస్తుందని, పది కేజీల వెండి పోయిందని…ఆరేడు లక్షల రూపాయలు పెడితే మళ్లీ వస్తుందని షాకింగ్ కామెంట్లు చేశారు. ఈ నేపథ్యంలో నాని వ్యాఖ్యలపై సర్వత్రా తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇప్పటికే ఆలయాలపై దాడుల వ్యవహారంతో ఉక్కిరిబిక్కిరవుతున్న ప్రభుత్వానికి నాని వ్యాఖ్యలు మరింత డ్యామేజీ చేసేలా ఉన్నాయని కొందరు వైసీపీ నేతలు కూడా అభిప్రాయాలు వ్యక్తం చేశారని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. ఈ క్రమంలోనే నాని మరోసారి షాకింగ్ కామెంట్లు చేశారు. తాను చేసిన వ్యాఖ్యలకు కట్టుబడి ఉన్నానని, క్షమాపణలు చెప్పబోనని అన్నారు. అంతేకాదు, డిక్లరేషన్ ఎత్తివేయాలని మరోసారి నాని డిమాండ్ చేశారు.
కోట్లాదిమంది హిందువుల మనోభావాలతో ముడిపడిన తిరుమల ఆలయం డిక్లరేషన్ వ్యవహారంలో నాని వ్యాఖ్యలు ఆమోదయోగ్యంగా లేవన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్న సంగతి తెలిసిందే. మతపరమైన సున్నితమైన అంశాల విషయంలో నాని ఇటువంటి బాధ్యతారాహిత్యమైన వ్యాఖ్యలు చేయడంపై చర్చ జరుగుతోంది. ఆ వ్యాఖ్యల వేడి సద్దుమణగక ముందే నాని మరోసారి షాకింగ్ కామెంట్లు చేశారు. తిరుమలలో అన్యమతస్థుల నుంచి డిక్లరేషన్ తీసుకునే విధానాన్ని ఎత్తి వేయాలని నాని అన్నారు. వెంకటేశ్వరస్వామి భక్తుడిగా ఇది తన నావ్యక్తిగత అభిప్రాయమన్న నాని…తన వ్యాఖ్యలకు కట్టుబడి ఉన్నానని అన్నారు. 6 కోట్ల ఆంధ్రుల ప్రతినిధిగా శ్రీవారికి సీఎం జగన్ పట్టువస్త్రాలు సమర్పిస్తున్నారని చెప్పారు. సీఎం జగన్ కేవలం హిందువుల ప్రతినిధిగా మాత్రమే తిరుమలకు వెళ్లడం లేదని, ఏపీలో అన్ని మతాలు, కులాల వారు ఉన్నారని నాని అన్నారు. సీఎం జగన్ను డిక్లరేషన్పై సంతకం చేయాలని కోరడం నీచ రాజకీయమన్నారు. సోము వీర్రాజుకు, చంద్రబాబుకు తాను క్షమాపణ చెప్పాల్సిన అవసరం లేదని, తానేమీ తప్పుగా మాట్లాడలేదని నాని తన వ్యాఖ్యలను సమర్థించుకున్నారు.
This post was last modified on September 22, 2020 8:40 pm
తెలంగాణ అధికార పార్టీ కాంగ్రెస్లో వన్ మ్యాన్ `ఆర్మీ`గా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కనిపిస్తున్నారు. గత ఎన్నికల్లో పార్టీని అధికారంలోకి…
ఉత్తరాంధ్ర రాజకీయాల్లో ఒకప్పుడు దూకుడుగా ఉన్న వైసీపీ ఇప్పుడు పెద్దగా కనిపించడం లేదన్న టాక్ వినిపిస్తోంది. కీలక నాయకులు ఉన్నప్పటికీ..…
కరణం బలరామకృష్ణమూర్తి.. రాజకీయ ఉద్ధండుడిగా పేరొందిన ఉమ్మడి ప్రకాశం జిల్లాకు చెందిన నేత. కుమారుడు కరణం వెంకటేష్ను ఎమ్మెల్యేగా చూసుకోవాలన్న…
నియోజకవర్గాల పునర్విభజన అనూహ్య పరిణామాల నేపథ్యంలో అలా వెనక్కెళ్లిపోయింది. దక్షిణాది, ఈశాన్య రాష్ట్రాలకు తీరని అన్యాయం అంటూ కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియా…
బ్లాక్ బస్టర్ సినిమాల వెనుక కొన్ని వేల మంది కష్టం దాగి ఉంటుంది. కాకపోతే ప్రేక్షకులకది అనవసరం. థియేటర్ లో…
ప్రతి నెల ఒకటో తారీకు కోసం ఉద్యోగులు ఎదురు చూడడం సహజం. కారణం నెలంతా కష్టపడితే జీవితాలు అకౌంట్ లో…