Political News

జూలై 1… జ‌గ‌న్ షేక్ అయ్యే స్కెచ్ వేసిన చంద్ర‌బ‌బు

టీడీపీ అధినేత, రాష్ట్ర ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు భారీ స్కెచ్ వేశారు. 1వ తేదీన సామాజిక భ‌ద్ర‌తా పింఛ‌న్ ల‌బ్ధిదారుల‌కు పంపిణీ చేసే పింఛ‌న్ల కార్య‌క్ర‌మాన్ని ఆయ‌న ప్ర‌తిష్టాత్మ‌కంగా తీసుకున్నారు. ప్ర‌తి ఇంటికీ వెళ్లి పించ‌న్ల‌ను అందించాల‌ని.. అధికారుల‌ను, వార్డు, గ్రామ స‌చివాల‌య సిబ్బందిని ఆయ‌న ఆదేశించారు. మ‌రోవైపు.. రాజ‌కీయంగా కూడా దీనిని స‌ద్వినియోగం చేసుకుంటున్నారు. మంత్రులు, కార్య‌క‌ర్త‌లు, నాయ‌కుల‌ను కూడా రంగంలోకి దింపుతున్నారు.

వారి ద్వారా.. ప్ర‌తి ఇంటికీవెళ్లి ల‌బ్ధి దారుల‌కు పింఛ‌న్లు పంపిణీ చేయ‌డంతోపాటు.. తాను రాసిన బ‌హిరంగ లేఖ‌ను కూడా.. వారికి అందించాల‌ని ఆదేశించారు. ఒక‌ర‌కంగా.. జూలై 1వ తారీకున రాష్ట్రంలో పించ‌న్ల పంపిణీ కార్య‌క్ర‌మాన్ని పెద్ద పండుగ మాదిరిగా నిర్వ‌హించాల‌ని ఆదేశించారు. ఎక్క‌డెక్క‌డ నాయ‌కులు ఉన్నా.. క్షేత్ర‌స్థాయికి రావాల‌ని ఆదేశించారు. దీంతో ఎంపీలు, కేంద్ర మంత్రులు, ఎమ్మెల్యేలు అంద‌రూ త‌మ త‌మ నియోజ‌క‌వ‌ర్గాల‌కు ఇప్ప‌టికే చేరుకున్నారు.

జూలై 1 ప్ర‌తి ఒక్క‌రూ పింఛ‌న్ల పంపిణీ కార్య‌క్ర‌మంలో పాల్గొంటారు. ప్ర‌తి ల‌బ్ధి దారుడిని క‌లుసుకుని.. ప్ర‌భుత్వం ఇస్తున్న పింఛ‌న్ల‌ను అందించ‌నున్నారు. ఈ సారి పింఛ‌నును ఒకేసారి రూ.1000 చొప్పున పెంచి ఇవ్వ‌డంతోపాటు.. ఎన్నిక‌ల‌కు ముందు ఇచ్చిన హామీ మేర‌కు.. ఏప్రిల్ నుంచి జూన్ వ‌ర‌కు కూడా పెంచిన సొమ్మును ఇస్తున్నారు. ఇది ఒక ర‌కంగా.. ప్ర‌భుత్వానికి ప్ర‌జ‌ల్లో పెద్ద ఎత్తున సానుభూతిని తీసుకువ‌స్తుంద‌ని చంద్ర‌బాబు భావిస్తున్నారు.

ఇదే స‌మ‌యంలో ఇప్ప‌టి వ‌ర‌కు సామాజిక భ‌ద్ర‌తా పింఛ‌న్ల‌ను ప్ర‌తి నెలా 1వ తేదీనే.. ఇంటింటికీ పంపిస్తున్నాన‌ని చెప్పుకొంటున్న మాజీ సీఎం జ‌గ‌న్‌కు కూడా.. చంద్ర‌బాబు చెక్ పెడుతున్నారు. తానే కాదు.. త‌న‌కు మించిన విధంగా త‌మ ప్ర‌భుత్వం ప్ర‌జ‌ల‌కుమేలు చేస్తోంద‌ని ఆయ‌న చెప్పుకొనే ప్ర‌య‌త్నం చేస్తున్నారు. తొలి అడుగులోనే స‌క్సెస్ సాధించి.. జ‌గ‌న్ వ్యూహానికి పెద్ద గండి కొట్ట‌నున్నారు. ఇది వ‌చ్చే ఎన్నిక‌ల నాటికి త‌న‌కు .. పార్టీకి, ప్ర‌ష‌భుత్వానికి కూడా మేలు చేస్తుంద‌ని చంద్ర‌బాబు భావిస్తున్నారు.

This post was last modified on June 30, 2024 10:54 am

Share

Recent Posts

యేషనాగుల డ్యాన్స్ ఓదెల నిర్ణయమే

నాని కొత్త సినిమా ‘ది ప్యారడైజ్’ నుంచి వచ్చిన తొలి పాట ‘ఆయా షేర్’ అద్భుతమైన స్పందన తెచ్చుకుని ఎక్కడికో…

13 minutes ago

కాకాని ఆగమంటున్న విశ్వంభర ?

ఖైదీ నెంబర్ 150 నుంచి కంబ్యాక్ అయ్యాక ఎప్పుడూ చూడని ఒక విచిత్రమైన పరిస్థితిని చిరంజీవి ఎదురుకుంటున్నట్టు మెగా వర్గాల…

56 minutes ago

ఎపిక్ మీద నెగిటివిటీ ఎందుకంటే

నిన్న విడుదలైన ఎపిక్ మీద సోషల్ మీడియా లోపలా బయటా మిక్స్డ్ టాక్ నడుస్తున్న మాట వాస్తవం. ఈ విషయాన్ని…

2 hours ago

5జీ రావడం లేదని టెక్నీషియన్‌ను కట్టేశారా?

ఇంస్టాగ్రామ్ రీల్స్ చూస్తున్నారు.. ఫేస్ బుక్ వెతుకుతున్నారు.. సిగ్నల్ సింబల్ గిర్రున తిరుగుతోంది కానీ రీల్స్ ముందుకు జరగడం లేదు.…

2 hours ago

కాళీమాత గుడిలో చేపల కూర తిన్న బీజేపీ సీఎం

పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి సువేందు అధికారి కోల్ కతాలోని కాళీ ఘాట్ ఆలయంలో అమ్మవారికి నైవేద్యంగా సమర్పించిన చేపల కూర…

2 hours ago

పోలీసులు కాదు.. భార్య గ‌ద్దిస్తే నిజం చెప్పాడు!

స‌హ‌జంగా ఏ కేసులో అయినా.. నిందితులు లేదా అనుమానితుల‌ను పోలీసులు ప్ర‌శ్నిస్తారు. ముందు మాట‌ల‌తో.. త‌ర్వాత త‌మ‌దైన లాఠీ శైలితోనూ…

5 hours ago