టీడీపీ అధినేత, రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు భారీ స్కెచ్ వేశారు. 1వ తేదీన సామాజిక భద్రతా పింఛన్ లబ్ధిదారులకు పంపిణీ చేసే పింఛన్ల కార్యక్రమాన్ని ఆయన ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. ప్రతి ఇంటికీ వెళ్లి పించన్లను అందించాలని.. అధికారులను, వార్డు, గ్రామ సచివాలయ సిబ్బందిని ఆయన ఆదేశించారు. మరోవైపు.. రాజకీయంగా కూడా దీనిని సద్వినియోగం చేసుకుంటున్నారు. మంత్రులు, కార్యకర్తలు, నాయకులను కూడా రంగంలోకి దింపుతున్నారు.
వారి ద్వారా.. ప్రతి ఇంటికీవెళ్లి లబ్ధి దారులకు పింఛన్లు పంపిణీ చేయడంతోపాటు.. తాను రాసిన బహిరంగ లేఖను కూడా.. వారికి అందించాలని ఆదేశించారు. ఒకరకంగా.. జూలై 1వ తారీకున రాష్ట్రంలో పించన్ల పంపిణీ కార్యక్రమాన్ని పెద్ద పండుగ మాదిరిగా నిర్వహించాలని ఆదేశించారు. ఎక్కడెక్కడ నాయకులు ఉన్నా.. క్షేత్రస్థాయికి రావాలని ఆదేశించారు. దీంతో ఎంపీలు, కేంద్ర మంత్రులు, ఎమ్మెల్యేలు అందరూ తమ తమ నియోజకవర్గాలకు ఇప్పటికే చేరుకున్నారు.
జూలై 1 ప్రతి ఒక్కరూ పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొంటారు. ప్రతి లబ్ధి దారుడిని కలుసుకుని.. ప్రభుత్వం ఇస్తున్న పింఛన్లను అందించనున్నారు. ఈ సారి పింఛనును ఒకేసారి రూ.1000 చొప్పున పెంచి ఇవ్వడంతోపాటు.. ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీ మేరకు.. ఏప్రిల్ నుంచి జూన్ వరకు కూడా పెంచిన సొమ్మును ఇస్తున్నారు. ఇది ఒక రకంగా.. ప్రభుత్వానికి ప్రజల్లో పెద్ద ఎత్తున సానుభూతిని తీసుకువస్తుందని చంద్రబాబు భావిస్తున్నారు.
ఇదే సమయంలో ఇప్పటి వరకు సామాజిక భద్రతా పింఛన్లను ప్రతి నెలా 1వ తేదీనే.. ఇంటింటికీ పంపిస్తున్నానని చెప్పుకొంటున్న మాజీ సీఎం జగన్కు కూడా.. చంద్రబాబు చెక్ పెడుతున్నారు. తానే కాదు.. తనకు మించిన విధంగా తమ ప్రభుత్వం ప్రజలకుమేలు చేస్తోందని ఆయన చెప్పుకొనే ప్రయత్నం చేస్తున్నారు. తొలి అడుగులోనే సక్సెస్ సాధించి.. జగన్ వ్యూహానికి పెద్ద గండి కొట్టనున్నారు. ఇది వచ్చే ఎన్నికల నాటికి తనకు .. పార్టీకి, ప్రషభుత్వానికి కూడా మేలు చేస్తుందని చంద్రబాబు భావిస్తున్నారు.
This post was last modified on June 30, 2024 10:54 am
సెలబ్రిటీలు చిన్న వాళ్ళైనా పెద్దోళ్ళయినా ఏదైనా మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితి ఉందిప్పుడు. సోషల్ మీడియా జమానాలో చిన్న టంగ్…
అభిమానుల్లోనే కాదు సినీ ప్రియుల్లోనూ విపరీతమైన అంచనాలు మోస్తున్న సినిమా పెద్ది. చికిరి చికిరి ఛార్ట్ బస్టర్ పుణ్యమాని హిందీలోనూ…
హైదరాబాద్లోని పంజాగుట్ట పోలీసులు యూట్యూబర్ అన్వేష్ (నా అన్వేషణ)పై లుకౌట్ నోటీసులు జారీ చేశారు. ప్రస్తుతం అన్వేష్ విదేశాల్లో ఉన్నారని…
ఏపీ కాంగ్రెస్ పార్టీ పరిస్థితి నానాటికీ తీసికట్టుగా మారుతోందా? .. పార్టీ నాయకులు దీనస్థితిలో ఉన్నారా? అంటే.. ఔననే సమాధానమే…
ఇరాన్లో ప్రస్తుతం నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులు అక్కడ వైద్య విద్యనభ్యసిస్తున్న భారతీయ విద్యార్థులను తీవ్ర ఆందోళనకు గురిచేస్తున్నాయి. ఒకవైపు అమెరికా…
ఇప్పుడు తెలుగులో వంద కోట్ల హీరోగా ఎదిగాడు నవీన్ పొలిశెట్టి. సంక్రాంతికి విడుదలైన తన చివరి చిత్రం అనగనగా ఒక…