రాజధాని విషయంపై వ్యూహం మార్చాలని చంద్రబాబు నిర్ణయించుకున్నట్టు టీడీపీలో చర్చ నడుస్తోంది. దీనిపై ఇప్పటికే అనేక రూపాల్లో యుద్ధం చేసిన బాబు.. ఒకరకంగా అస్త్ర సన్యాసం చేసేశారు. మూడు రాజధానుల విషయంలో అమరావతి రైతులను, ప్రజలను, మహిళలను, యువతను కూడా ఆయన ప్రభావితం చేశారు. ఎక్కడెక్కడో ఉన్న వారిని కూడా ఏకతాటిపైకి తెచ్చారు. ప్రభుత్వంపైనా.. మరీ ముఖ్యంగా ముఖ్యమంత్రి జగన్పైనా బాబు వ్యూహాత్మకంగా ఎదురుదాడి చేయించారు. ఈ క్రమంలో రాజకీయాల్లో ఎన్నడూ జోలె పట్టని చంద్రబాబు.. అది కూడా చేసేశారు.
అయితే, ఎన్ని చేసినా.. జగన్ కానీ, ఆయన పార్టీ నేతలు కానీ.. ఈ మూడు రాజధానుల విషయంలో వెనక్కి తగ్గలేదు. దీంతో న్యాయ పోరాటం అన్నారు. అది కూడా సాధ్యమవుతున్న పరిస్తితి లేదు. కేంద్రం ముందు సాగిలపడ్డారు. కేంద్రమే ఆదుకోవాలన్నారు. మోడీ హఠావో అన్న నోటితోనే.. మోడీనే దేవుడు అన్నారు. ఆయనే వచ్చి అమరావతిని కాపాడుకోవాలన్నారు. అయినా.. వర్కవుట్ కాలేదు. మరి ఇప్పుడు ఏం చేయాలి? ఈ క్రమంలోనే ఇప్పుడు టీడీపీ అధినేత మరోరూపంలో ఉద్యమించేందుకు సిద్ధమవుతున్నారని అంటున్నారు టీడీపీ నాయకులు. వారి చూచాయగా చెబుతున్న దానిని బట్టి.. త్వరలోనే చంద్రబాబు.. మరోసారి జిల్లాల పర్యటనకు రెడీ అవుతున్నారు.
అదేసమయంలో ఏ పార్టీ రాజధాని అంశంపై కలిసి వస్తే.. ఆ పార్టీతో జట్టుకు కూడా వెనుకాడేది లేదనే సంకేతాలు పంపాలని రెడీ అయ్యారట. మరీ ముఖ్యంగా బీజేపీతోనూ ఈ విషయంలో చేతులు కలపాలని నిర్ణయించుకున్నట్టు చెబుతున్నారు. త్వరలోనే తిరుపతి ఎంపీ స్థానానికి ఉప ఎన్నిక వస్తోంది. దీనిని అవసరమైతే.. బీజేపీకి ఇచ్చేసి .. తాను సహకరించాలని నిర్ణయించుకున్నట్టు చెబుతున్నారు. ఇక, సోషల్ మీడియాలో మరింత ఎక్కువగా వార్తలు రాయించడంతోపాటు.. రాజధాని అంశాన్ని జాతీయ స్తాయిలోనూ ఉద్యమించేలా ముందుకు నడిపించాలని భావిస్తున్నారు. అంతేకాదు, ఈ ఉద్యమాన్ని రెండు రూపాల్లో నడిపించాలని భావిస్తున్నారట. మరి అవైనా సక్సెస్ అవుతాయా? చూడాలి. బాబు వ్యూహం ఏమవుతుందో అంటున్నారు టీడీపీ నేతలు కొందరు.
This post was last modified on September 22, 2020 8:32 pm
ప్రచార హోరులో తానే సింగిల్ సింహం అని, కృష్ణుడిని, అర్జునుడిని అంటూ గొప్పలు చెప్పుకోవడం రాజకీయాల్లో సాధారణమే. కానీ, ప్రజాసమస్యలపై…
వివేకా హత్య కేసు విచారణ ఏళ్ల తరబడి కొనసాగుతున్న వైనంపై వివేకా తనయురాలు సునీత అసహనం వ్యక్తం చేస్తున్న సంగతి…
విదేశాంగ శాఖ అనుమతి నిరాకరించడంతో తెలంగాణా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అమెరికా పర్యటన రద్దయ్యింది. ముందుగా నిర్ణయించుకున్న షెడ్యూల్ ప్రకారం…
సీఎం రేవంత్ రెడ్డిపై మంత్రి కొండా సురేఖ తనయురాలు కొండా సుష్మిత చేసిన కామెంట్లు తెలంగాణ రాజకీయాల్లో వేడి రాజేశాయి.…
కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా అధ్యక్షతన చెన్నై లో జరిగిన దక్షిణాది రాష్ట్రాల ప్రాంతీయ మండలి సమావేశంలో…
ఇప్పటికే పైరసీని ఎలా అణచాలో అర్థం కాక నిర్మాతలు తలలు పట్టుకోవడం చూస్తున్నాం. టెక్నాలజీ ఇంత అభివుద్ది చెందిన తర్వాత…