Political News

అమ‌రావ‌తిలో శాశ్వ‌త భ‌వ‌నాలు..!

ఏపీ రాజ‌ధాని అమ‌రావ‌తిని చంద్ర‌బాబు కూట‌మి ప్ర‌భుత్వం ప‌రుగులు పెట్టిస్తోంది. ముఖ్య‌మంత్రిగా ప్ర‌మాణ స్వీకారం చేసిన చంద్ర‌బాబు.. అనంత‌రం.. రెండో ప‌ర్య‌ట‌న‌ను అమ‌రావ‌తిలోనే చేసిన విష‌యం తెలిసిందే. ఈ నేప‌థ్యంలో తాజాగా ఆయ‌న కీల‌క ఆదేశాలు జారీ చేశారు. అమ‌రావ‌తిలో శాశ్వ‌త భ‌వ‌నాల‌ను నిర్మించేందుకు కార్యాచ‌ర‌ణ‌ను రూపొందించ‌డ‌మే కాకుండా.. వాటిని గుర్తించాల‌ని ఆదేశించారు. దీంతో ఏపీ సీఆర్‌డీఏ అధికారులు తాజాగా గెజిట్ నోటిఫికేష‌న్ జారీ చేసింది. అమ‌రావ‌తిలో శాశ్వ‌త భ‌వ‌నాల నిర్మాణాల‌కు సంబంధించిన స్థ‌లాల‌ను గుర్తించ‌డంతోపాటు.. 1575 ఎక‌రాల ప్రాంతాన్ని కేటాయిస్తూ.. నోటిఫై చేసింది.

వాస్త‌వానికి 2018లోనే శాశ్వ‌త భ‌వ‌నాల‌కు అప్ప‌టి చంద్ర‌బాబు ప్ర‌భుత్వం పునాదులు వేసింది. ఇదే విష‌యాన్ని ఎన్నిక‌ల్లోనూ ప్ర‌చారం చేసుకుంది. కానీ.. 2019లో ప్ర‌జ‌లు వైసీపీకి ప‌ట్టంక‌ట్ట‌డంతో ఈ నిర్మాణాలు ఆగిపోయాయి. అయితే.. ఇప్పుడు చంద్ర‌బాబు స‌ర్కారు అమ‌రావ‌తిని ప‌రుగులు పెట్టించాల‌ని నిర్ణ‌యించిన ద‌రిమిలా.. పునాదుల స్థితిలో ఉన్న శాశ్వ‌త భ‌వ‌నాల ను పూర్తి చేయాల‌ని సంక‌ల్పించింది. అదేస‌మ‌యంలో మ‌రికొన్ని స‌ర్కారు కాంప్లెక్స్ భ‌వ‌నాల‌ను కూడా నిర్మించేందుకు స్థ‌లాల‌ను ఎంపిక చేయాల‌ని సీఆర్ డీఏకు ఇటీవ‌ల చంద్ర‌బాబు ఆదేశాలు జారీచేశారు.

ఈ నేప‌థ్యంలో ప్రభుత్వ కాంప్లెక్స్ కోసం 1575 ఎకరాల ప్రాంతాన్ని సిఆర్‌డిఎ తాజాగా నోటిఫై చేసింది. మాస్టర్‌ ప్లాన్‌లో భాగంగా జోనింగ్‌ నిబంధనల ప్రకారం దీనిని గుర్తించ‌డం గ‌మ‌నార్హం. ఈ స్థ‌లాలు రాయపూడి, నేలపాడు, లింగాయపాలెం, శాఖమూరు, కొండమరాజుపాలెం సరిహద్దుల్లో ఉన్నాయి. ఇప్పటికి సచివాలయం, హైకోర్టు నిర్మించినా.. అవి తాత్కాలిక భ‌వ‌నాలేన‌ని అప్ప‌ట్లోనే ప్ర‌క‌టించారు. అమ‌రావ‌తి మాస్టర్ ప్లాన్ లో భాగంగా అసెంబ్లీ, సెక్రటేరియట్, హైకోర్టు, రాజ్ భవన్ వంటి శాశ్వ‌త భ‌వ‌నాల‌ను ఇక్క‌డ నిర్మించాల్సి ఉంది. ఇప్పుడు ఆ ప‌నిపైనే చంద్ర‌బాబు స‌ర్కారు దృష్టి పెట్టింది. ఫ‌లితంగా అమ‌రావ‌తి నిర్మాణాలు వ‌చ్చే ఎన్నిక‌ల నాటికి ఒక కొలిక్కి వ‌చ్చే అవ‌కాశం ఉంద‌ని తెలుస్తోంది.

This post was last modified on June 30, 2024 7:15 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

రాజా సాబ్ ను లైట్ తీసుకున్న‌ హిందీ ఆడియ‌న్స్

బాహుబ‌లి, బాహుబ‌లి-2 చిత్రాల‌తో దేశ‌వ్యాప్తంగా తిరుగులేని ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్ సంపాదంచుకున్నాడు ప్ర‌భాస్. ఇదంతా రాజ‌మౌళి పుణ్యం అంటూ కొంద‌రు…

39 minutes ago

వింటేజ్ మెగాస్టార్ బయటికి వచ్చేశారు

చాలా గ్యాప్ తర్వాత చిరంజీవి సినిమాకు సోషల్ మీడియాలో విపరీతమైన పాజిటివ్ వైబ్స్ కనిపిస్తున్నాయి. ప్రీమియర్లతో విడుదలైన మన శంకరవరప్రసాద్…

46 minutes ago

సంక్రాంతిలో శర్వా సేఫ్ గేమ్

సంక్రాంతి అంటేనే సినిమాల పండగ. ఈసారి బాక్సాఫీస్ వద్ద రద్దీ మామూలుగా లేదు. ప్రభాస్ 'రాజా సాబ్', మెగాస్టార్ 'MSG'…

1 hour ago

‘నదీ తీర ప్రాంతంలో ఉన్న తాడేపల్లి ప్యాలెస్ మునిగిందా?’

వరద భయం లేకుండా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అమరావతి నగరాన్ని నిర్మిస్తున్నట్లు కూటమి ప్రభుత్వం హామీ ఇస్తోంది. మరోవైపు అమరావతి…

2 hours ago

ఇలాంటి సీక్వెన్స్ ఎలా తీసేశారు సాబ్‌?

మూడేళ్ల‌కు పైగా టైం తీసుకుని, 400 కోట్ల‌కు పైగా బ‌డ్జెట్ పెట్టి తీసిన సినిమా.. రాజాసాబ్. కానీ ఏం లాభం?…

4 hours ago

రామ్ దెబ్బ తిన్నాడు… మరి రవితేజ?

హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…

5 hours ago