Political News

అమ‌రావ‌తిలో శాశ్వ‌త భ‌వ‌నాలు..!

ఏపీ రాజ‌ధాని అమ‌రావ‌తిని చంద్ర‌బాబు కూట‌మి ప్ర‌భుత్వం ప‌రుగులు పెట్టిస్తోంది. ముఖ్య‌మంత్రిగా ప్ర‌మాణ స్వీకారం చేసిన చంద్ర‌బాబు.. అనంత‌రం.. రెండో ప‌ర్య‌ట‌న‌ను అమ‌రావ‌తిలోనే చేసిన విష‌యం తెలిసిందే. ఈ నేప‌థ్యంలో తాజాగా ఆయ‌న కీల‌క ఆదేశాలు జారీ చేశారు. అమ‌రావ‌తిలో శాశ్వ‌త భ‌వ‌నాల‌ను నిర్మించేందుకు కార్యాచ‌ర‌ణ‌ను రూపొందించ‌డ‌మే కాకుండా.. వాటిని గుర్తించాల‌ని ఆదేశించారు. దీంతో ఏపీ సీఆర్‌డీఏ అధికారులు తాజాగా గెజిట్ నోటిఫికేష‌న్ జారీ చేసింది. అమ‌రావ‌తిలో శాశ్వ‌త భ‌వ‌నాల నిర్మాణాల‌కు సంబంధించిన స్థ‌లాల‌ను గుర్తించ‌డంతోపాటు.. 1575 ఎక‌రాల ప్రాంతాన్ని కేటాయిస్తూ.. నోటిఫై చేసింది.

వాస్త‌వానికి 2018లోనే శాశ్వ‌త భ‌వ‌నాల‌కు అప్ప‌టి చంద్ర‌బాబు ప్ర‌భుత్వం పునాదులు వేసింది. ఇదే విష‌యాన్ని ఎన్నిక‌ల్లోనూ ప్ర‌చారం చేసుకుంది. కానీ.. 2019లో ప్ర‌జ‌లు వైసీపీకి ప‌ట్టంక‌ట్ట‌డంతో ఈ నిర్మాణాలు ఆగిపోయాయి. అయితే.. ఇప్పుడు చంద్ర‌బాబు స‌ర్కారు అమ‌రావ‌తిని ప‌రుగులు పెట్టించాల‌ని నిర్ణ‌యించిన ద‌రిమిలా.. పునాదుల స్థితిలో ఉన్న శాశ్వ‌త భ‌వ‌నాల ను పూర్తి చేయాల‌ని సంక‌ల్పించింది. అదేస‌మ‌యంలో మ‌రికొన్ని స‌ర్కారు కాంప్లెక్స్ భ‌వ‌నాల‌ను కూడా నిర్మించేందుకు స్థ‌లాల‌ను ఎంపిక చేయాల‌ని సీఆర్ డీఏకు ఇటీవ‌ల చంద్ర‌బాబు ఆదేశాలు జారీచేశారు.

ఈ నేప‌థ్యంలో ప్రభుత్వ కాంప్లెక్స్ కోసం 1575 ఎకరాల ప్రాంతాన్ని సిఆర్‌డిఎ తాజాగా నోటిఫై చేసింది. మాస్టర్‌ ప్లాన్‌లో భాగంగా జోనింగ్‌ నిబంధనల ప్రకారం దీనిని గుర్తించ‌డం గ‌మ‌నార్హం. ఈ స్థ‌లాలు రాయపూడి, నేలపాడు, లింగాయపాలెం, శాఖమూరు, కొండమరాజుపాలెం సరిహద్దుల్లో ఉన్నాయి. ఇప్పటికి సచివాలయం, హైకోర్టు నిర్మించినా.. అవి తాత్కాలిక భ‌వ‌నాలేన‌ని అప్ప‌ట్లోనే ప్ర‌క‌టించారు. అమ‌రావ‌తి మాస్టర్ ప్లాన్ లో భాగంగా అసెంబ్లీ, సెక్రటేరియట్, హైకోర్టు, రాజ్ భవన్ వంటి శాశ్వ‌త భ‌వ‌నాల‌ను ఇక్క‌డ నిర్మించాల్సి ఉంది. ఇప్పుడు ఆ ప‌నిపైనే చంద్ర‌బాబు స‌ర్కారు దృష్టి పెట్టింది. ఫ‌లితంగా అమ‌రావ‌తి నిర్మాణాలు వ‌చ్చే ఎన్నిక‌ల నాటికి ఒక కొలిక్కి వ‌చ్చే అవ‌కాశం ఉంద‌ని తెలుస్తోంది.

This post was last modified on June 30, 2024 7:15 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

మలయాళంలో రేవంత్ సినిమా ఎలా నడుస్తోంది?

అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న కేరళలో పలు రాష్ట్రాలకు చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్లు, ఫైర్ బ్రాండ్లు, మంచి గళం వినిపించే…

3 hours ago

ఆ సీక్వెల్… నా వల్ల కాదు బాబోయ్

అటు తమిళం, ఇటు తెలుగు ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకున్న భారీ చిత్రాల్లో ‘యుగానికి ఒక్కడు’ ఒకటి. కార్తికి స్టార్ ఇమేజ్ తీసుకొచ్చిన…

4 hours ago

నాడూ మూడే!… నేడూ మూడే!

వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి మూడు అనే అంకె అంటే చాలా ఇష్టంగానే ఉన్నట్టుంది. కనీసం రాజధాని కూడా…

8 hours ago

మోడీ ముందు జ‌గ‌న్ మ‌రింత‌ ప‌లుచ‌న‌!

ప్ర‌స్తుతం ఎవ‌రు ఔన‌న్నా.. కాద‌న్నా.. దేశానికే కాదు.. దేశంలోని రాజ‌కీయాల‌కు కూడా ప్ర‌ధాని మోడీ పెద్ద‌దిక్కుగా మారారన్నది వాస్త‌వం. ఆయ‌న‌ను…

9 hours ago

రాముడి పాత్ర వద్దన్న రణబీర్

ఒక పెద్ద సినిమాలో రాముడి పాత్రను పోషించడం ఏ నటుడికైనా అరుదైన అవకాశమే. దాన్ని లైఫ్ టైం ఛాన్స్‌లాగే ఫీలవుతారు ఎవ్వరైనా. ‘ఆదిపురుష్’ ఫలితం…

9 hours ago

దళిత క్రైస్తవుల విషయంలో జగన్ కన్నా షర్మిలే బెటర్?

వైసీపీ అధినేత, తన బ్రదర్ జగన్‌పై ఏపీ కాంగ్రెస్ చీఫ్ షర్మిల మరోసారి విమర్శలు గుప్పించారు. దళిత క్రైస్తవులకు రిజర్వేషన్…

10 hours ago