Political News

పాత బస్తీకి టెండర్ పెట్టిన రేవంత్?

తెలంగాణ విద్యుత్ రంగంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. రాష్ట్రంలో విద్యుత్ పంపిణీ వ్యవస్థను నష్టాలను పూరించే క్రమంలో బలమైన ప్రైవేటు కంపెనీని దించుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం అడుగులు వేస్తున్నది. హైదరాబాద్ పాతబస్తీలో విద్యుత్ పంపిణీ బాధ్యతలను పైలట్ ప్రాజెక్టుగా అదానీ గ్రూప్‌కు అప్పగించాలని నిర్ణయించినట్లు స్వయంగా రేవంత్ రెడ్డి వెల్లడించారు. ఈ మేరకు ఢిల్లీలో నిర్వహించిన మీడియా సమావేశంలో స్పష్టం చేశారు.

‘‘పాత బస్తీలో కరెంట్ బిల్లులు సక్రమంగా చెల్లించడం లేదు. వసూలు చేసేందుకు వెళ్లే కరెంట్‌ సిబ్బందిపై దౌర్జన్యానికి దిగుతున్నారు. అందుకే ప్రయోగాత్మకంగా ఈ ప్రాంతంలో విద్యుత్ వ్యవస్థను ఆదానీ కంపెనీకి అప్పగించాలని నిర్ణయం తీసుకున్నట్టు’’ రేవంత్ రెడ్డి అన్నారు. అనంతరం దశలవారీగా హైదరాబాద్ నగరం, ఆపై రాష్ట్రవ్యాప్తంగా విద్యుత్ పంపిణీ బాధ్యతను ఆదానికి అప్పగిస్తామని వెల్లడించారు.

అదానీ గ్రూప్ ద్వారా వచ్చే ఆదాయంలో 75% రాష్ట్ర ప్రభుత్వానికి, మిగిలిన 25% అదానీ గ్రూప్‌కు వెళ్తుందని, దీనిపై ఇప్పటికే అదానీ గ్రూప్‌తో చర్చించామని, వారు అంగీకరించారని, దీనికి సంబంధించిన ప్రాజెక్ట్ రిపోర్టును సిద్ధం చేయాలని అదానీ గ్రూప్‌ను కోరినట్టు రేవంత్ రెడ్డి వెల్లడించారు. ఈ సంధర్భంగా ‘‘కేంద్ర ప్రభుత్వ ఆస్తులను అదానీకి అప్పగించడాన్ని రాహుల్‌ గాంధీ తప్పు పడుతున్నారని, అంతేతప్ప అదానీతో వ్యాపారం చేయొద్దని ఎప్పుడూ అనలేదని’’ రేవంత్ చెప్పడం కొసమెరుపు.

This post was last modified on June 29, 2024 2:14 pm

Share
Show comments
Published by
satya
Tags: Adani

Recent Posts

సమంతా చేతికి దళపతి విజయ్ 69

అవకాశాల విషయంలో ఆచితూచి అడుగులు వేస్తున్న సమంతా తొందరపడి వచ్చిన ప్రతి ఆఫర్ కి ఎస్ చెప్పడం లేదు. తన…

21 mins ago

వీకెండ్ బాక్సాఫీసుని కమ్మేసిన భైరవ

శనివారం రోజు వరల్డ్ కప్ ఫైనల్. అయినా సరే కల్కి 2898 ఏడి షోలు దేశవ్యాప్తంగా అన్ని ప్రధాన కేంద్రాల్లో…

1 hour ago

మాట‌కు మాట‌: వాళ్లు మూడేళ్లు ప‌డ్డారు.. బొత్స గారూ!

మాట‌కు మాట‌… సోష‌ల్ మీడియా ప్ర‌భావం రాజ‌కీయాల‌పై ఎక్కువ‌గానే ఉంది. నాయ‌కులు చేసే వ్యాఖ్య‌లు ఇట్టే వైర‌ల్ అవుతుండ‌డం ఒక…

1 hour ago

నితీష్‌కు వంత పాడిన మోడీ వీరాభిమాని!

ప్ర‌ధాని న‌రేంద్ర మోడీకి వీరాభిమానిగా గుర్తింపు పొందారు.. ప్ర‌స్తుత కేంద్ర మంత్రి చిరాగ్ పాశ్వాన్‌. ఈయ‌న ఒక‌ప్ప‌టి కేంద్ర మంత్రి…

2 hours ago

ఆగ‌స్టు 15 రేసులోకి మ‌రో భారీ చిత్రం

ఒక్క పుష్ప-2 సినిమా ఆగ‌స్టు 15 నుంచి వాయిదా ప‌డేస‌రికి.. దేశంలో వివిధ భాష‌ల నుంచి ఆ వీకెండ్‌కు కొత్త…

2 hours ago

క‌ల్కి పాత్ర‌పై విజ‌య్ ఏమ‌న్నాడంటే..?

క‌ల్కి సినిమాలో ముఖ్య పాత్ర‌ల గురించి ఎంత చ‌ర్చ జ‌రిగిందో విజ‌య్ దేవ‌ర‌కొండ చేసిన అతిథి పాత్ర మీద కూడా…

3 hours ago