ఆదిలాబాద్ మాజీ ఎంపీ రమేష్ రథోడ్ కన్నుమూశారు. నిన్న రాత్రి ఉట్నూర్ లోని తన నివాసంలో తీవ్ర అస్వస్థతకు గురికావడంతో ఆయనను ఆదిలాబాద్ లోని ఓ ప్రయివేట్ ఆసుపత్రికి తరలించారు. అక్కడ పరిస్థితి విషమించడంతో మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్ తరలిస్తుండగా మార్గమధ్యంలో ఆయన మృతి చెందారు. రమేష్ రథోడ్ 1999 లో టిడిపి నుంచి ఖానాపూర్ ఎమ్మెల్యేగా, 2009 లో ఆదిలాబాద్ ఎంపీగా గెలిచారు. ప్రస్తుతం బిజెపి లో కొనసాగుతున్నారు.
రమేశ్ రాథోడ్ తొలి సారిగా తెలుగుదేశం పార్టీ నుండి నార్నూర్ జడ్పీటిసిగా గెలిచాడు.ఖానాపూర్ నియోజకవర్గం టీడీపీ శాసనసభ్యునిగా 1999లో 20 వేల మెజారిటితో గెలిచాడు. 2006 నుండి 2009 వరకు అదిలాబాద్ జిల్లా పరిషత్ చైర్మన్ గా, 2009 లో ఆదిలాబాద్ లోక్ సభకు పోటీచేసి పార్లమెంటు సభ్యుని గా ఎన్నికయ్యాడు.
ఆ తర్వాత కాంగ్రెస్, అనంతరం బీఆర్ఎస్ పార్టీ, ఆ తర్వాత బీజేపీలో చేరిన ఆయన ఇటీవల బీజేపీ నుండి ఖానాపూర్ ఎమ్మెల్యేగా పోటీచేసి ఓడిపోయాడు. ఈ సారి ఆదిలాబాద్ బీజేపీ ఎంపీ టికెట్ కోసం చివరి వరకు పోరాడినా చివరి నిమిషంలో పార్టీలో చేరిన గోడెం నగేష్ కు పార్టీ టికెట్ దక్కింది.
This post was last modified on June 29, 2024 2:15 pm
రీఎంట్రీ తర్వాత వరుసగా మూడు రీమేక్లతో పలకరించిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.. ఈ ఏడాది రెండు నెలల వ్యవధిలో రెండు…
మన శంకరవరప్రసాద్ గారు నుంచి మరో పాట వచ్చేసింది. నిజానికీ రిలీజ్ రేపు జరగాలి. కానీ ఒక రోజు ముందుగా…
సౌతాఫ్రికాతో వన్డే సిరీస్ విజయం తర్వాత టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ తనదైన స్టైల్లో స్పందించారు. 2027 వరల్డ్…
గోవా ట్రిప్ అంటే ఫుల్ ఎంజాయ్ అనుకుంటాం. కానీ ఆరపోరాలోని 'బర్చ్ బై రోమియో లేన్' అనే నైట్ క్లబ్…
సూపర్ స్టార్ రజనీకాంత్ కెరీర్ లో బెస్ట్ మూవీస్ అంటే వెంటనే గుర్తొచ్చే పేర్లు భాష, నరసింహ, దళపతి. వీటిని…
తాను చేసింది మహా పాపమే అంటూ.. పరకామణి చోరీ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న నిందితుడు రవికుమార్ తెలిపారు. ఈ వ్యవహారంలో…